Political News

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు

ధర్మవరం పట్టణంలోని చిక్క వడియార్ చెరువును వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆక్రమించారని గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువును కేతిరెడ్డి కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, గూగుల్ మ్యాప్స్ లో కూడా చెరువు ఆక్రమణకు గురైనట్లు స్పష్టంగా ఉందని గతంలో టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ చెరువు కబ్జా వ్యవహారంలో కేతిరెడ్డికి నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలోనే ఆ నోటీసులపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాజాగా స్పందించారు.

ఆ నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందని కేతిరెడ్డి ఆరోపించారు. ఆ భూములకు అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోందని, ఈ సమయంలో అధికారులు నోటీసులు ఎలా ఇస్తారని కేతిరెడ్డి ప్రశ్నించారు. ఈ నోటీసులపై కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కోర్టును ఆశ్రయిస్తానని కేతిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు.

ఆ చెరువు సమీపంలో కొంత భూమి కొని దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కేతిరెడ్డి ఆక్రమించారని అధికారులు అంటున్నారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోదరుడి భార్య గాలి వసుమతి పేరుతో ఆ భూములున్నాయని, ఆక్రమించిన భూమిని వారం రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు నోటీసులిచ్చారు. అలా చేయకుంటే ఆ స్థలంలోని నిర్మాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కేతిరెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.

This post was last modified on November 8, 2024 6:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

29 minutes ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

4 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

5 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

5 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

6 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

6 hours ago