Political News

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు

ధర్మవరం పట్టణంలోని చిక్క వడియార్ చెరువును వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆక్రమించారని గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువును కేతిరెడ్డి కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, గూగుల్ మ్యాప్స్ లో కూడా చెరువు ఆక్రమణకు గురైనట్లు స్పష్టంగా ఉందని గతంలో టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ చెరువు కబ్జా వ్యవహారంలో కేతిరెడ్డికి నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలోనే ఆ నోటీసులపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాజాగా స్పందించారు.

ఆ నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందని కేతిరెడ్డి ఆరోపించారు. ఆ భూములకు అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోందని, ఈ సమయంలో అధికారులు నోటీసులు ఎలా ఇస్తారని కేతిరెడ్డి ప్రశ్నించారు. ఈ నోటీసులపై కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కోర్టును ఆశ్రయిస్తానని కేతిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు.

ఆ చెరువు సమీపంలో కొంత భూమి కొని దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కేతిరెడ్డి ఆక్రమించారని అధికారులు అంటున్నారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోదరుడి భార్య గాలి వసుమతి పేరుతో ఆ భూములున్నాయని, ఆక్రమించిన భూమిని వారం రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు నోటీసులిచ్చారు. అలా చేయకుంటే ఆ స్థలంలోని నిర్మాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కేతిరెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.

This post was last modified on November 8, 2024 6:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago