Political News

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు

ధర్మవరం పట్టణంలోని చిక్క వడియార్ చెరువును వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆక్రమించారని గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువును కేతిరెడ్డి కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, గూగుల్ మ్యాప్స్ లో కూడా చెరువు ఆక్రమణకు గురైనట్లు స్పష్టంగా ఉందని గతంలో టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ చెరువు కబ్జా వ్యవహారంలో కేతిరెడ్డికి నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలోనే ఆ నోటీసులపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాజాగా స్పందించారు.

ఆ నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందని కేతిరెడ్డి ఆరోపించారు. ఆ భూములకు అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోందని, ఈ సమయంలో అధికారులు నోటీసులు ఎలా ఇస్తారని కేతిరెడ్డి ప్రశ్నించారు. ఈ నోటీసులపై కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కోర్టును ఆశ్రయిస్తానని కేతిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు.

ఆ చెరువు సమీపంలో కొంత భూమి కొని దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కేతిరెడ్డి ఆక్రమించారని అధికారులు అంటున్నారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోదరుడి భార్య గాలి వసుమతి పేరుతో ఆ భూములున్నాయని, ఆక్రమించిన భూమిని వారం రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు నోటీసులిచ్చారు. అలా చేయకుంటే ఆ స్థలంలోని నిర్మాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కేతిరెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.

This post was last modified on November 8, 2024 6:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

15 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

55 minutes ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

5 hours ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

12 hours ago