ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రెండు రోజుల కిందట రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంపై కీలక ఆరోపణలు చేశారు. శాంతి భద్రతలు ఎటు పోతున్నాయో తెలియడం లేదన్నారు. హోం శాఖ మంత్రి పైపైనే పనిచేస్తున్నారని కూడా చెప్పారు. అంతేకాదు.. తానే హోం మంత్రి అయి ఉంటే.. పరిస్థితి దీనికి భిన్నంగా ఉండేవని కూడా చెప్పుకొచ్చారు. రోజుకొక దాడి జరుగుతున్నా.. సోష ల్ మీడియాలో వికృత చేష్ఠలకు పాల్పడుతున్నా.. సహించాల్సి వస్తోందని ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం చేశారు. మొత్తంగా పవన్ కల్యాణ్ వేదన గురించి రాజకీయంగా చర్చ అయితే సాగింది. సాగుతోంది.
అయితే.. ఇంత కోపం పవన్కు ఎందుకువ చ్చింది? అనేది ఇప్పటి వరకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు ఆయన ఆవేదన చెందారా? లేక, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి.. కంట్రోల్ చేయకపోతే.. తనకు కూడా మచ్చ వస్తుందని భావించిన ఆయన ఇలా ఫైరయ్యారా? అనేది ఇప్పటికీ విశ్లేషకులు సైతం తేల్చలేక పోతున్నారు. అయితే.. ఈ విషయానికి సంబంధించి.. పవన్ కల్యాణ్ ఇంత ఫైర్ అవడం వెనుక.. తాజాగా ఓ కీలక సంగతి వెలుగు చూసింది. అది కూడా.. పవన్ కల్యాణ్ నోటి నుంచే బయటకు రావడం గమనార్హం.
తాజాగా ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల విషయంతోపాటు.. మంత్రుల పనితీరుపైనా చర్చ వచ్చింది. ఈ సమయంలో జోక్యం చేసుకున్న పవన్ కల్యాణ్.. వైసీపీకి అధికారం పోయినా.. దూకుడు తగ్గలేదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని ప్రభుత్వంపైనా, మంత్రులపైనా, నాయకులపైనా తీవ్ర స్థాయిలో పోస్టులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. దీనిని కట్టడి చేయాలని ఆయన సూచించారు.
ఈ క్రమంలోనే పవన్ అసలు సంగతి చెప్పారు. “వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోతోంది. ఎంత మాట పడితే అంత మాట అనేస్తోంది. దీనిని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పినా.. వినిపించుకోవడం లేదు. చర్యలు కూడా తీసుకోవడం లేదు. నామటుకు నాకే అసహ్యం వేస్తోంది. నేనే స్వయంగా కొందరు ఎస్పీలకు ఫోన్లు చేశారు. కానీ, ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. కనీసం .. కాల్ బ్యాక్ కూడా చేయలేదు. వీరి సంగతి ఏంటో ఆలోచించండి” అని చంద్రబాబుకు సూచించారు. అంటే.. దీనిని బట్టి.. పవన్ ఆగ్రహం వెనుక.. తనకు(డిప్యూటీ సీఎంగా) కూడా ఎస్పీలు స్పందించకపోవడం అనే ఆవేదన ఉందన్న సంగతి అర్ధమవుతోంది. అందుకే పవన్ ఇలా రియాక్ట్ అయ్యారనే సంకేతాలు వచ్చాయి.
This post was last modified on November 7, 2024 9:23 am
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…