Political News

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అందుకే మండిందా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రెండు రోజుల కింద‌ట రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంపై కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు. శాంతి భ‌ద్ర‌త‌లు ఎటు పోతున్నాయో తెలియ‌డం లేద‌న్నారు. హోం శాఖ మంత్రి పైపైనే ప‌నిచేస్తున్నార‌ని కూడా చెప్పారు. అంతేకాదు.. తానే హోం మంత్రి అయి ఉంటే.. ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉండేవ‌ని కూడా చెప్పుకొచ్చారు. రోజుకొక దాడి జ‌రుగుతున్నా.. సోష ల్ మీడియాలో వికృత చేష్ఠ‌ల‌కు పాల్ప‌డుతున్నా.. స‌హించాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న‌, ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేశారు. మొత్తంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వేద‌న గురించి రాజ‌కీయంగా చర్చ అయితే సాగింది. సాగుతోంది.

అయితే.. ఇంత కోపం ప‌వ‌న్‌కు ఎందుకువ చ్చింది? అనేది ఇప్ప‌టి వ‌ర‌కు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారిపోయింది. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు ఆయ‌న ఆవేద‌న చెందారా? లేక‌, ప్ర‌భుత్వంలో ఉన్నాం కాబ‌ట్టి.. కంట్రోల్ చేయ‌క‌పోతే.. త‌న‌కు కూడా మ‌చ్చ వ‌స్తుంద‌ని భావించిన ఆయ‌న ఇలా ఫైర‌య్యారా? అనేది ఇప్ప‌టికీ విశ్లేష‌కులు సైతం తేల్చ‌లేక పోతున్నారు. అయితే.. ఈ విష‌యానికి సంబంధించి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంత ఫైర్ అవ‌డం వెనుక‌.. తాజాగా ఓ కీల‌క సంగ‌తి వెలుగు చూసింది. అది కూడా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ నోటి నుంచే బ‌య‌ట‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ఏపీ కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశానికి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా శాంతి భ‌ద్ర‌తల విష‌యంతోపాటు.. మంత్రుల ప‌నితీరుపైనా చ‌ర్చ వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీకి అధికారం పోయినా.. దూకుడు త‌గ్గ‌లేద‌ని వ్యాఖ్యానించారు. సోష‌ల్ మీడియాను అడ్డు పెట్టుకుని ప్ర‌భుత్వంపైనా, మంత్రుల‌పైనా, నాయ‌కుల‌పైనా తీవ్ర స్థాయిలో పోస్టులు పెడుతున్నార‌ని చెప్పుకొచ్చారు. దీనిని క‌ట్టడి చేయాల‌ని ఆయ‌న సూచించారు.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ అస‌లు సంగ‌తి చెప్పారు. “వైసీపీ సోష‌ల్ మీడియా రెచ్చిపోతోంది. ఎంత మాట ప‌డితే అంత మాట అనేస్తోంది. దీనిని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో కూడా అర్థం కావ‌డం లేదు. ఇలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు చెప్పినా.. వినిపించుకోవ‌డం లేదు. చ‌ర్య‌లు కూడా తీసుకోవ‌డం లేదు. నామ‌టుకు నాకే అస‌హ్యం వేస్తోంది. నేనే స్వ‌యంగా కొంద‌రు ఎస్పీల‌కు ఫోన్లు చేశారు. కానీ, ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. క‌నీసం .. కాల్ బ్యాక్ కూడా చేయ‌లేదు. వీరి సంగ‌తి ఏంటో ఆలోచించండి” అని చంద్ర‌బాబుకు సూచించారు. అంటే.. దీనిని బ‌ట్టి.. ప‌వ‌న్ ఆగ్ర‌హం వెనుక‌.. త‌న‌కు(డిప్యూటీ సీఎంగా) కూడా ఎస్పీలు స్పందించ‌క‌పోవ‌డం అనే ఆవేద‌న ఉంద‌న్న సంగ‌తి అర్ధ‌మ‌వుతోంది. అందుకే ప‌వ‌న్ ఇలా రియాక్ట్ అయ్యార‌నే సంకేతాలు వ‌చ్చాయి.

Satya

Recent Posts

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్…

8 minutes ago

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

2 hours ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

3 hours ago

OG 2… ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…

4 hours ago

హీరోల్లో గుబులు రేపుతున్న సమంత

హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్‌ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…

5 hours ago

బండ్ల గణేష్… త్రివిక్రమ్… కలిసిపోయారు!

టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…

8 hours ago