Political News

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అందుకే మండిందా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రెండు రోజుల కింద‌ట రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంపై కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు. శాంతి భ‌ద్ర‌త‌లు ఎటు పోతున్నాయో తెలియ‌డం లేద‌న్నారు. హోం శాఖ మంత్రి పైపైనే ప‌నిచేస్తున్నార‌ని కూడా చెప్పారు. అంతేకాదు.. తానే హోం మంత్రి అయి ఉంటే.. ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉండేవ‌ని కూడా చెప్పుకొచ్చారు. రోజుకొక దాడి జ‌రుగుతున్నా.. సోష ల్ మీడియాలో వికృత చేష్ఠ‌ల‌కు పాల్ప‌డుతున్నా.. స‌హించాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న‌, ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేశారు. మొత్తంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వేద‌న గురించి రాజ‌కీయంగా చర్చ అయితే సాగింది. సాగుతోంది.

అయితే.. ఇంత కోపం ప‌వ‌న్‌కు ఎందుకువ చ్చింది? అనేది ఇప్ప‌టి వ‌ర‌కు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారిపోయింది. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు ఆయ‌న ఆవేద‌న చెందారా? లేక‌, ప్ర‌భుత్వంలో ఉన్నాం కాబ‌ట్టి.. కంట్రోల్ చేయ‌క‌పోతే.. త‌న‌కు కూడా మ‌చ్చ వ‌స్తుంద‌ని భావించిన ఆయ‌న ఇలా ఫైర‌య్యారా? అనేది ఇప్ప‌టికీ విశ్లేష‌కులు సైతం తేల్చ‌లేక పోతున్నారు. అయితే.. ఈ విష‌యానికి సంబంధించి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంత ఫైర్ అవ‌డం వెనుక‌.. తాజాగా ఓ కీల‌క సంగ‌తి వెలుగు చూసింది. అది కూడా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ నోటి నుంచే బ‌య‌ట‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ఏపీ కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశానికి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా శాంతి భ‌ద్ర‌తల విష‌యంతోపాటు.. మంత్రుల ప‌నితీరుపైనా చ‌ర్చ వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీకి అధికారం పోయినా.. దూకుడు త‌గ్గ‌లేద‌ని వ్యాఖ్యానించారు. సోష‌ల్ మీడియాను అడ్డు పెట్టుకుని ప్ర‌భుత్వంపైనా, మంత్రుల‌పైనా, నాయ‌కుల‌పైనా తీవ్ర స్థాయిలో పోస్టులు పెడుతున్నార‌ని చెప్పుకొచ్చారు. దీనిని క‌ట్టడి చేయాల‌ని ఆయ‌న సూచించారు.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ అస‌లు సంగ‌తి చెప్పారు. “వైసీపీ సోష‌ల్ మీడియా రెచ్చిపోతోంది. ఎంత మాట ప‌డితే అంత మాట అనేస్తోంది. దీనిని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో కూడా అర్థం కావ‌డం లేదు. ఇలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు చెప్పినా.. వినిపించుకోవ‌డం లేదు. చ‌ర్య‌లు కూడా తీసుకోవ‌డం లేదు. నామ‌టుకు నాకే అస‌హ్యం వేస్తోంది. నేనే స్వ‌యంగా కొంద‌రు ఎస్పీల‌కు ఫోన్లు చేశారు. కానీ, ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. క‌నీసం .. కాల్ బ్యాక్ కూడా చేయ‌లేదు. వీరి సంగ‌తి ఏంటో ఆలోచించండి” అని చంద్ర‌బాబుకు సూచించారు. అంటే.. దీనిని బ‌ట్టి.. ప‌వ‌న్ ఆగ్ర‌హం వెనుక‌.. త‌న‌కు(డిప్యూటీ సీఎంగా) కూడా ఎస్పీలు స్పందించ‌క‌పోవ‌డం అనే ఆవేద‌న ఉంద‌న్న సంగ‌తి అర్ధ‌మ‌వుతోంది. అందుకే ప‌వ‌న్ ఇలా రియాక్ట్ అయ్యార‌నే సంకేతాలు వ‌చ్చాయి.

This post was last modified on November 7, 2024 9:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

9 minutes ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

10 minutes ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

1 hour ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

2 hours ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

2 hours ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

2 hours ago