Political News

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అందుకే మండిందా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రెండు రోజుల కింద‌ట రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంపై కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు. శాంతి భ‌ద్ర‌త‌లు ఎటు పోతున్నాయో తెలియ‌డం లేద‌న్నారు. హోం శాఖ మంత్రి పైపైనే ప‌నిచేస్తున్నార‌ని కూడా చెప్పారు. అంతేకాదు.. తానే హోం మంత్రి అయి ఉంటే.. ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉండేవ‌ని కూడా చెప్పుకొచ్చారు. రోజుకొక దాడి జ‌రుగుతున్నా.. సోష ల్ మీడియాలో వికృత చేష్ఠ‌ల‌కు పాల్ప‌డుతున్నా.. స‌హించాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న‌, ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేశారు. మొత్తంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వేద‌న గురించి రాజ‌కీయంగా చర్చ అయితే సాగింది. సాగుతోంది.

అయితే.. ఇంత కోపం ప‌వ‌న్‌కు ఎందుకువ చ్చింది? అనేది ఇప్ప‌టి వ‌ర‌కు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారిపోయింది. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు ఆయ‌న ఆవేద‌న చెందారా? లేక‌, ప్ర‌భుత్వంలో ఉన్నాం కాబ‌ట్టి.. కంట్రోల్ చేయ‌క‌పోతే.. త‌న‌కు కూడా మ‌చ్చ వ‌స్తుంద‌ని భావించిన ఆయ‌న ఇలా ఫైర‌య్యారా? అనేది ఇప్ప‌టికీ విశ్లేష‌కులు సైతం తేల్చ‌లేక పోతున్నారు. అయితే.. ఈ విష‌యానికి సంబంధించి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంత ఫైర్ అవ‌డం వెనుక‌.. తాజాగా ఓ కీల‌క సంగ‌తి వెలుగు చూసింది. అది కూడా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ నోటి నుంచే బ‌య‌ట‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ఏపీ కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశానికి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా శాంతి భ‌ద్ర‌తల విష‌యంతోపాటు.. మంత్రుల ప‌నితీరుపైనా చ‌ర్చ వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీకి అధికారం పోయినా.. దూకుడు త‌గ్గ‌లేద‌ని వ్యాఖ్యానించారు. సోష‌ల్ మీడియాను అడ్డు పెట్టుకుని ప్ర‌భుత్వంపైనా, మంత్రుల‌పైనా, నాయ‌కుల‌పైనా తీవ్ర స్థాయిలో పోస్టులు పెడుతున్నార‌ని చెప్పుకొచ్చారు. దీనిని క‌ట్టడి చేయాల‌ని ఆయ‌న సూచించారు.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ అస‌లు సంగ‌తి చెప్పారు. “వైసీపీ సోష‌ల్ మీడియా రెచ్చిపోతోంది. ఎంత మాట ప‌డితే అంత మాట అనేస్తోంది. దీనిని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో కూడా అర్థం కావ‌డం లేదు. ఇలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు చెప్పినా.. వినిపించుకోవ‌డం లేదు. చ‌ర్య‌లు కూడా తీసుకోవ‌డం లేదు. నామ‌టుకు నాకే అస‌హ్యం వేస్తోంది. నేనే స్వ‌యంగా కొంద‌రు ఎస్పీల‌కు ఫోన్లు చేశారు. కానీ, ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. క‌నీసం .. కాల్ బ్యాక్ కూడా చేయ‌లేదు. వీరి సంగ‌తి ఏంటో ఆలోచించండి” అని చంద్ర‌బాబుకు సూచించారు. అంటే.. దీనిని బ‌ట్టి.. ప‌వ‌న్ ఆగ్ర‌హం వెనుక‌.. త‌న‌కు(డిప్యూటీ సీఎంగా) కూడా ఎస్పీలు స్పందించ‌క‌పోవ‌డం అనే ఆవేద‌న ఉంద‌న్న సంగ‌తి అర్ధ‌మ‌వుతోంది. అందుకే ప‌వ‌న్ ఇలా రియాక్ట్ అయ్యార‌నే సంకేతాలు వ‌చ్చాయి.

This post was last modified on November 7, 2024 9:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

5 minutes ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

16 minutes ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

1 hour ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

1 hour ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

1 hour ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

1 hour ago