Political News

రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి ఎత్తేస్తాం: రాహుల్‌

దేశంలో రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి 50 శాతంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఏ రిజ‌ర్వేష‌న్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వ‌డానికి వీల్లేదు. దీనిపైకోర్టు తీర్పులు, రాజ్యాంగ ప‌రిమితులు కూడా స్ప‌ష్టం చేస్తున్నాయి. అయితే.. ఈ రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితిని ఎత్తేయనున్న‌ట్టు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తాజాగా హైదరాబాద్‌లోని బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. బుధ‌వారం(న‌వంబ‌రు 6) నుంచి రాష్ట్రంలో కుల గ‌ణన ప్రారంభం కానున్న నేప‌థ్యంలో రాహుల్ గాంధీ దీనిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు.

తాము అధికారంలోకి(కేంద్రం) వ‌చ్చిన వెంట‌నే రిజ‌ర్వేష‌న్ల పై ఉన్న ప‌రిమితిని ఎత్తేయ‌నున్న‌ట్టు చెప్పారు. దేశంలో ఇప్ప‌టికీ అనేక రంగాల్లో కుల వివ‌క్ష ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. “కుల గ‌ణ‌నను కొంద‌రు రాజకీయాల కోసం అని అనుకుంటున్నారు. కానీ, స‌మాజంలోని వివ‌క్ష‌ను త‌రిమ కొట్టేందుకే ఈ కుల గ‌ణ‌న చేప‌ట్టాం” అని రాహుల్ వెల్ల‌డించారు. ఏ రంగంలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారో.. వారి కుటుంబాలు ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నాయో ఈ గ‌ణ‌న ద్వారా తెలుస్తాయ‌ని చెప్పారు.

“భార‌త్ జోడో యాత్ర చేసిన‌ప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో తిరిగా. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కుల వివ‌క్ష ఉంది. ఈ విష‌యాన్ని నేను నా క‌ళ్ల‌తో చూశా. కానీ, కొంద‌రు అగ్ర‌కులంలో ఉన్న‌వారికి ఈ కుల వివ‌క్ష క‌నిపించ‌దు” అని దుయ్య‌బ‌ట్టారు. కుల గ‌ణ‌న చేప‌ట్ట‌డం ద్వారా.. స‌మాజంలో స‌మానత్వాన్ని తీసుకువ‌స్తామ‌ని రాహుల్ చెప్పారు. “ఆ వ్య‌వ‌స్థ‌, ఈ వ్య‌వ‌స్థ అనే తేడాలేదు. అన్ని వ్య‌వ‌స్థ‌ల్లోనూ కుల వివ‌క్ష ఉంది. రాజ‌కీయంగా, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల్లోనూ.. పారిశ్రామికంగా కూడా కుల వివ‌క్ష ఈ దేశాన్ని ప‌ట్టిపీడిస్తోంది” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

“ఎస్‌సీ, ఎస్‌టీ, గిరిజన కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. వారిలో ప్ర‌తిభ ఉన్నా.. వెలుగులోకి రాలేక పోతున్నారు. దీనికి కుల వివ‌క్షే కార‌ణం” అని రాహుల్ గాంధీ దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో కుల గ‌ణ‌న చేప‌డుతున్నామ‌ని. దీన‌ర్థం.. కులాల లెక్క‌లు తీయ‌డం కాద‌ని.. వారి సామాజిక స్థితిగ‌తులు తెలుసుకుని స‌ర్కారు ప‌రంగా వారిని స‌మాజంలో ఉన్న‌త స్థాయికి చేర్చ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని రాహుల్ చెప్పారు. ఇక‌, తెలంగాణ‌లో కుల గ‌ణ‌న అత్య‌వస‌ర‌మ‌ని పేర్కొన్న రాహుల్ దీనిద్వారా రాష్ట్రంలో ప‌రిస్థితి మారుతుంద‌న్నారు.

This post was last modified on November 5, 2024 11:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

5 hours ago

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

7 hours ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

9 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

12 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

14 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

15 hours ago