Political News

రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి ఎత్తేస్తాం: రాహుల్‌

దేశంలో రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి 50 శాతంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఏ రిజ‌ర్వేష‌న్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వ‌డానికి వీల్లేదు. దీనిపైకోర్టు తీర్పులు, రాజ్యాంగ ప‌రిమితులు కూడా స్ప‌ష్టం చేస్తున్నాయి. అయితే.. ఈ రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితిని ఎత్తేయనున్న‌ట్టు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తాజాగా హైదరాబాద్‌లోని బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. బుధ‌వారం(న‌వంబ‌రు 6) నుంచి రాష్ట్రంలో కుల గ‌ణన ప్రారంభం కానున్న నేప‌థ్యంలో రాహుల్ గాంధీ దీనిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు.

తాము అధికారంలోకి(కేంద్రం) వ‌చ్చిన వెంట‌నే రిజ‌ర్వేష‌న్ల పై ఉన్న ప‌రిమితిని ఎత్తేయ‌నున్న‌ట్టు చెప్పారు. దేశంలో ఇప్ప‌టికీ అనేక రంగాల్లో కుల వివ‌క్ష ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. “కుల గ‌ణ‌నను కొంద‌రు రాజకీయాల కోసం అని అనుకుంటున్నారు. కానీ, స‌మాజంలోని వివ‌క్ష‌ను త‌రిమ కొట్టేందుకే ఈ కుల గ‌ణ‌న చేప‌ట్టాం” అని రాహుల్ వెల్ల‌డించారు. ఏ రంగంలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారో.. వారి కుటుంబాలు ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నాయో ఈ గ‌ణ‌న ద్వారా తెలుస్తాయ‌ని చెప్పారు.

“భార‌త్ జోడో యాత్ర చేసిన‌ప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో తిరిగా. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కుల వివ‌క్ష ఉంది. ఈ విష‌యాన్ని నేను నా క‌ళ్ల‌తో చూశా. కానీ, కొంద‌రు అగ్ర‌కులంలో ఉన్న‌వారికి ఈ కుల వివ‌క్ష క‌నిపించ‌దు” అని దుయ్య‌బ‌ట్టారు. కుల గ‌ణ‌న చేప‌ట్ట‌డం ద్వారా.. స‌మాజంలో స‌మానత్వాన్ని తీసుకువ‌స్తామ‌ని రాహుల్ చెప్పారు. “ఆ వ్య‌వ‌స్థ‌, ఈ వ్య‌వ‌స్థ అనే తేడాలేదు. అన్ని వ్య‌వ‌స్థ‌ల్లోనూ కుల వివ‌క్ష ఉంది. రాజ‌కీయంగా, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల్లోనూ.. పారిశ్రామికంగా కూడా కుల వివ‌క్ష ఈ దేశాన్ని ప‌ట్టిపీడిస్తోంది” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

“ఎస్‌సీ, ఎస్‌టీ, గిరిజన కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. వారిలో ప్ర‌తిభ ఉన్నా.. వెలుగులోకి రాలేక పోతున్నారు. దీనికి కుల వివ‌క్షే కార‌ణం” అని రాహుల్ గాంధీ దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో కుల గ‌ణ‌న చేప‌డుతున్నామ‌ని. దీన‌ర్థం.. కులాల లెక్క‌లు తీయ‌డం కాద‌ని.. వారి సామాజిక స్థితిగ‌తులు తెలుసుకుని స‌ర్కారు ప‌రంగా వారిని స‌మాజంలో ఉన్న‌త స్థాయికి చేర్చ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని రాహుల్ చెప్పారు. ఇక‌, తెలంగాణ‌లో కుల గ‌ణ‌న అత్య‌వస‌ర‌మ‌ని పేర్కొన్న రాహుల్ దీనిద్వారా రాష్ట్రంలో ప‌రిస్థితి మారుతుంద‌న్నారు.

This post was last modified on November 5, 2024 11:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునీల్ వ‌ర్సెస్ RRR.. మ‌రింత ముదిరిందిగా!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న సునీల్‌కు రఘురామకు…

2 hours ago

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

5 hours ago

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే..…

8 hours ago

ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…

9 hours ago

విజ‌య్‌ని డీగ్రేడ్ చేసేలా పొలిటిక‌ల్ మూవీ?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నపుడు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలివేష‌న్లు ఇస్తూ సినిమాలు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రు నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ మూవీస్…

9 hours ago

రాజ‌ధానిపై చంద్ర‌బాబు ముందు చూపు… ఇవే కీల‌కం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజ‌ధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.…

9 hours ago