దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి వీల్లేదు. దీనిపైకోర్టు తీర్పులు, రాజ్యాంగ పరిమితులు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఈ రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేయనున్నట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తాజాగా హైదరాబాద్లోని బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బుధవారం(నవంబరు 6) నుంచి రాష్ట్రంలో కుల గణన ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ దీనిపై సంచలన వ్యాఖ్యలుచేశారు.
తాము అధికారంలోకి(కేంద్రం) వచ్చిన వెంటనే రిజర్వేషన్ల పై ఉన్న పరిమితిని ఎత్తేయనున్నట్టు చెప్పారు. దేశంలో ఇప్పటికీ అనేక రంగాల్లో కుల వివక్ష ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. “కుల గణనను కొందరు రాజకీయాల కోసం అని అనుకుంటున్నారు. కానీ, సమాజంలోని వివక్షను తరిమ కొట్టేందుకే ఈ కుల గణన చేపట్టాం” అని రాహుల్ వెల్లడించారు. ఏ రంగంలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారో.. వారి కుటుంబాలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయో ఈ గణన ద్వారా తెలుస్తాయని చెప్పారు.
“భారత్ జోడో యాత్ర చేసినప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో తిరిగా. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కుల వివక్ష ఉంది. ఈ విషయాన్ని నేను నా కళ్లతో చూశా. కానీ, కొందరు అగ్రకులంలో ఉన్నవారికి ఈ కుల వివక్ష కనిపించదు” అని దుయ్యబట్టారు. కుల గణన చేపట్టడం ద్వారా.. సమాజంలో సమానత్వాన్ని తీసుకువస్తామని రాహుల్ చెప్పారు. “ఆ వ్యవస్థ, ఈ వ్యవస్థ అనే తేడాలేదు. అన్ని వ్యవస్థల్లోనూ కుల వివక్ష ఉంది. రాజకీయంగా, న్యాయవ్యవస్థల్లోనూ.. పారిశ్రామికంగా కూడా కుల వివక్ష ఈ దేశాన్ని పట్టిపీడిస్తోంది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఎస్సీ, ఎస్టీ, గిరిజన కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. వారిలో ప్రతిభ ఉన్నా.. వెలుగులోకి రాలేక పోతున్నారు. దీనికి కుల వివక్షే కారణం” అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కాంగ్రెస్పాలిత రాష్ట్రాల్లో కుల గణన చేపడుతున్నామని. దీనర్థం.. కులాల లెక్కలు తీయడం కాదని.. వారి సామాజిక స్థితిగతులు తెలుసుకుని సర్కారు పరంగా వారిని సమాజంలో ఉన్నత స్థాయికి చేర్చడమే లక్ష్యమని రాహుల్ చెప్పారు. ఇక, తెలంగాణలో కుల గణన అత్యవసరమని పేర్కొన్న రాహుల్ దీనిద్వారా రాష్ట్రంలో పరిస్థితి మారుతుందన్నారు.
This post was last modified on November 5, 2024 11:34 pm
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసు వ్యవహారం ఎన్నికలకు ముందు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
వచ్చే వారం ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న విశ్వనాథం అండ్ సన్స్ మీద ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి బజ్…
వరుణ్ తేజ్ గత సినిమాల ఓపెనింగ్స్ ఒకసారి తవ్వి తీస్తే రిలీజ్ రోజు మార్నింగ్ షోకు చాలా చోట్ల ఫుల్స్…
న్యాచురల్ స్టార్ నాని అభిమానుల విపరీతమైన ఎదురు చూపులకు చెక్ పెడుతూ ది ప్యారడైజ్ టీజర్ వచ్చేసింది. నిమిషంన్నర లోపే…
సోషల్ మీడియా ఎప్పుడు ఎవరికి ఎలా ఫేమ్ తెచ్చిపెడుతుందో ఊహించలేం. మలయాళ అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్ అనుకోకుండా అలాగే…
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…