దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి వీల్లేదు. దీనిపైకోర్టు తీర్పులు, రాజ్యాంగ పరిమితులు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఈ రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేయనున్నట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తాజాగా హైదరాబాద్లోని బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బుధవారం(నవంబరు 6) నుంచి రాష్ట్రంలో కుల గణన ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ దీనిపై సంచలన వ్యాఖ్యలుచేశారు.
తాము అధికారంలోకి(కేంద్రం) వచ్చిన వెంటనే రిజర్వేషన్ల పై ఉన్న పరిమితిని ఎత్తేయనున్నట్టు చెప్పారు. దేశంలో ఇప్పటికీ అనేక రంగాల్లో కుల వివక్ష ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. “కుల గణనను కొందరు రాజకీయాల కోసం అని అనుకుంటున్నారు. కానీ, సమాజంలోని వివక్షను తరిమ కొట్టేందుకే ఈ కుల గణన చేపట్టాం” అని రాహుల్ వెల్లడించారు. ఏ రంగంలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారో.. వారి కుటుంబాలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయో ఈ గణన ద్వారా తెలుస్తాయని చెప్పారు.
“భారత్ జోడో యాత్ర చేసినప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో తిరిగా. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కుల వివక్ష ఉంది. ఈ విషయాన్ని నేను నా కళ్లతో చూశా. కానీ, కొందరు అగ్రకులంలో ఉన్నవారికి ఈ కుల వివక్ష కనిపించదు” అని దుయ్యబట్టారు. కుల గణన చేపట్టడం ద్వారా.. సమాజంలో సమానత్వాన్ని తీసుకువస్తామని రాహుల్ చెప్పారు. “ఆ వ్యవస్థ, ఈ వ్యవస్థ అనే తేడాలేదు. అన్ని వ్యవస్థల్లోనూ కుల వివక్ష ఉంది. రాజకీయంగా, న్యాయవ్యవస్థల్లోనూ.. పారిశ్రామికంగా కూడా కుల వివక్ష ఈ దేశాన్ని పట్టిపీడిస్తోంది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఎస్సీ, ఎస్టీ, గిరిజన కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. వారిలో ప్రతిభ ఉన్నా.. వెలుగులోకి రాలేక పోతున్నారు. దీనికి కుల వివక్షే కారణం” అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కాంగ్రెస్పాలిత రాష్ట్రాల్లో కుల గణన చేపడుతున్నామని. దీనర్థం.. కులాల లెక్కలు తీయడం కాదని.. వారి సామాజిక స్థితిగతులు తెలుసుకుని సర్కారు పరంగా వారిని సమాజంలో ఉన్నత స్థాయికి చేర్చడమే లక్ష్యమని రాహుల్ చెప్పారు. ఇక, తెలంగాణలో కుల గణన అత్యవసరమని పేర్కొన్న రాహుల్ దీనిద్వారా రాష్ట్రంలో పరిస్థితి మారుతుందన్నారు.
తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెలుగులో ఎలాంటి ఫాలోయింగ్ ఉండేదో అందరికీ తెలిసిందే. ఆయన ఇక్కడి టాప్ స్టార్లతో నేరుగా…
ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ పేరు ఎలా మార్మోగిందో తెలిసిందే. మహా మహా బ్యాటర్లను వెనక్కి నెట్టి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆడుతున్న క్రికెట్ చివరి ఓవర్ కు వచ్చేసింది. బుక్ మై షోలో నిన్నటిదాకా…
తమిళ సినీ పరిశ్రమలో "స్క్రీన్ప్లే కింగ్"గా పేరొందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ మృతితో సినీ ప్రపంచం విషాదంలో…
వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేసమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా…
తెలుగులో కేవలం నటనకు పరిమితం కాకుండా.. రైటింగ్, మేకింగ్లోనూ భాగం అవుతూ తన సినిమాలను సక్సెస్ చేసుకునే హీరోల్లో నవీన్…