Political News

ఆ కారు ప్రమాదంపై స్పందించిన విజయమ్మ

2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒకేసారి ఫ్రంట్ టైర్లు రెండూ ఊడిపోవడంపై టీడీపీ ఎక్స్ ఖాతాలో కొద్ది రోజుల క్రితం పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

షర్మిలతో ఆస్తి పంపకాల వివాదాల నేపథ్యంలో ఆ ప్రమాద ఘటనకు జగన్ కు లింక్ పెడుతూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ ప్రమాద ఘటనపై వైఎస్ విజయమ్మ స్పందించారు. ఈ క్రమంలోనే విజయమ్మ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.

కొద్ది రోజులుగా ఆ ప్రమాదం గురించి, తమ కుటుంబం గురించి జరుగుతున్న దుష్ప్రచారాన్ని విజయమ్మ ఖండించారు. రాజకీయాల కోసం ఇటువంటి దుష్ప్రచారం ఎవరికీ తగదని, జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ఈ తరహా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.

కర్నూలులో కొద్ది రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని అన్నారు. ఆ ప్రచారం చూసి తనకు మానసిక వేదన కలుగుతోందని, ఆ ఘటనపై వివరణ ఇవ్వకుంటే ప్రజలు ఆ ప్రచారం నిజం అనుకునే అవకాశముందని విజయమ్మ తెలిపారు.

ప్రజలకు వాస్తవాలు, కొంతమంది దుర్మార్గపు ఉద్దేశ్యాలు తెలియాలనే ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు. ఎప్పుడో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని తన కుమారుడికి ముడిపెట్టి ప్రచారం చేయడం విచారకరమన్నారు. అమెరికాలో తన మనవడి దగ్గరకు వెళ్లానని, జగన్ కు భయపడి వెళ్లలేదని, దానిపై కూడా విష ప్రచారం చేయడం నీతిమాలిన చర్య అని మండిపడ్డారు. ఇకనైనా, ఇటువంటి ప్రచారాలను ఆపకుంటే సహించబోనని విజయమ్మ వార్నింగ్ ఇచ్చారు.

ఈ తరహా దిగజారుడు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని, ఇటువంటి దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవపట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ తరహా వ్యక్తిత్వహనన వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago