Political News

ఆ కారు ప్రమాదంపై స్పందించిన విజయమ్మ

2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒకేసారి ఫ్రంట్ టైర్లు రెండూ ఊడిపోవడంపై టీడీపీ ఎక్స్ ఖాతాలో కొద్ది రోజుల క్రితం పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

షర్మిలతో ఆస్తి పంపకాల వివాదాల నేపథ్యంలో ఆ ప్రమాద ఘటనకు జగన్ కు లింక్ పెడుతూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ ప్రమాద ఘటనపై వైఎస్ విజయమ్మ స్పందించారు. ఈ క్రమంలోనే విజయమ్మ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.

కొద్ది రోజులుగా ఆ ప్రమాదం గురించి, తమ కుటుంబం గురించి జరుగుతున్న దుష్ప్రచారాన్ని విజయమ్మ ఖండించారు. రాజకీయాల కోసం ఇటువంటి దుష్ప్రచారం ఎవరికీ తగదని, జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ఈ తరహా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.

కర్నూలులో కొద్ది రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని అన్నారు. ఆ ప్రచారం చూసి తనకు మానసిక వేదన కలుగుతోందని, ఆ ఘటనపై వివరణ ఇవ్వకుంటే ప్రజలు ఆ ప్రచారం నిజం అనుకునే అవకాశముందని విజయమ్మ తెలిపారు.

ప్రజలకు వాస్తవాలు, కొంతమంది దుర్మార్గపు ఉద్దేశ్యాలు తెలియాలనే ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు. ఎప్పుడో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని తన కుమారుడికి ముడిపెట్టి ప్రచారం చేయడం విచారకరమన్నారు. అమెరికాలో తన మనవడి దగ్గరకు వెళ్లానని, జగన్ కు భయపడి వెళ్లలేదని, దానిపై కూడా విష ప్రచారం చేయడం నీతిమాలిన చర్య అని మండిపడ్డారు. ఇకనైనా, ఇటువంటి ప్రచారాలను ఆపకుంటే సహించబోనని విజయమ్మ వార్నింగ్ ఇచ్చారు.

ఈ తరహా దిగజారుడు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని, ఇటువంటి దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవపట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ తరహా వ్యక్తిత్వహనన వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు.

This post was last modified on November 5, 2024 12:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

39 minutes ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

1 hour ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

5 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

6 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

8 hours ago