జగన్ ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త రోడ్ల సంగతి పక్కనబెడితే…ఉన్న రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని దుస్థితి గత ప్రభుత్వంలో ఉందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో రోడ్లకు మహర్దశ కల్పించేందుకు సీఎం చంద్రబాబు నడుం బిగించారు. ఏపీలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో చంద్రబాబు నేడు శ్రీకారం చుట్టారు.
సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రంలోని రోడ్లపై ఒక్క గుంత ఉండకూడదని, అన్ని గుంతలు పూడ్చాల్సిందేనని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రా ఎస్కోబార్ వచ్చి రోడ్లపై గుంతలు పెట్టి వెళ్లారని జగన్ను విమర్శించారు. జగన్ హయాంలో రోడ్లపై నాట్లు వేశారని, చేపలు పట్టారని, స్విమ్మింగ్ ఫూల్స్ దర్శనమిచ్చాయని సెటైర్లు వేశారు. జగన్ హయాంలో నరకానికి మార్గాలుగా రోడ్లు ఉండేవని, వాటిని డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి మారుస్తామని చెప్పారు. విశాఖ నుండి అమరావతికి 2 గంటల్లో చేరుకునేలా రోడ్లు వేస్తామని చెప్పారు.
ఇక, మద్యం, ఇసుక వ్యాపారాల్లో అక్రమాలు చేస్తే సహించబోనని చంద్రబాబు అన్నారు. ఉచిత ఇసుక అక్రమ వ్యాపారం చేస్తే చర్యలు తప్పవని, పీడీ యాక్ట్ పెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఇక, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని, మద్యం రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోబోనని హెచ్చరించారు.
This post was last modified on November 2, 2024 2:38 pm
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…