జగన్ ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త రోడ్ల సంగతి పక్కనబెడితే…ఉన్న రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని దుస్థితి గత ప్రభుత్వంలో ఉందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో రోడ్లకు మహర్దశ కల్పించేందుకు సీఎం చంద్రబాబు నడుం బిగించారు. ఏపీలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో చంద్రబాబు నేడు శ్రీకారం చుట్టారు.
సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రంలోని రోడ్లపై ఒక్క గుంత ఉండకూడదని, అన్ని గుంతలు పూడ్చాల్సిందేనని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రా ఎస్కోబార్ వచ్చి రోడ్లపై గుంతలు పెట్టి వెళ్లారని జగన్ను విమర్శించారు. జగన్ హయాంలో రోడ్లపై నాట్లు వేశారని, చేపలు పట్టారని, స్విమ్మింగ్ ఫూల్స్ దర్శనమిచ్చాయని సెటైర్లు వేశారు. జగన్ హయాంలో నరకానికి మార్గాలుగా రోడ్లు ఉండేవని, వాటిని డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి మారుస్తామని చెప్పారు. విశాఖ నుండి అమరావతికి 2 గంటల్లో చేరుకునేలా రోడ్లు వేస్తామని చెప్పారు.
ఇక, మద్యం, ఇసుక వ్యాపారాల్లో అక్రమాలు చేస్తే సహించబోనని చంద్రబాబు అన్నారు. ఉచిత ఇసుక అక్రమ వ్యాపారం చేస్తే చర్యలు తప్పవని, పీడీ యాక్ట్ పెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఇక, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని, మద్యం రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోబోనని హెచ్చరించారు.
This post was last modified on November 2, 2024 2:38 pm
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…