జగన్ ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త రోడ్ల సంగతి పక్కనబెడితే…ఉన్న రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని దుస్థితి గత ప్రభుత్వంలో ఉందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో రోడ్లకు మహర్దశ కల్పించేందుకు సీఎం చంద్రబాబు నడుం బిగించారు. ఏపీలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో చంద్రబాబు నేడు శ్రీకారం చుట్టారు.
సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రంలోని రోడ్లపై ఒక్క గుంత ఉండకూడదని, అన్ని గుంతలు పూడ్చాల్సిందేనని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రా ఎస్కోబార్ వచ్చి రోడ్లపై గుంతలు పెట్టి వెళ్లారని జగన్ను విమర్శించారు. జగన్ హయాంలో రోడ్లపై నాట్లు వేశారని, చేపలు పట్టారని, స్విమ్మింగ్ ఫూల్స్ దర్శనమిచ్చాయని సెటైర్లు వేశారు. జగన్ హయాంలో నరకానికి మార్గాలుగా రోడ్లు ఉండేవని, వాటిని డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి మారుస్తామని చెప్పారు. విశాఖ నుండి అమరావతికి 2 గంటల్లో చేరుకునేలా రోడ్లు వేస్తామని చెప్పారు.
ఇక, మద్యం, ఇసుక వ్యాపారాల్లో అక్రమాలు చేస్తే సహించబోనని చంద్రబాబు అన్నారు. ఉచిత ఇసుక అక్రమ వ్యాపారం చేస్తే చర్యలు తప్పవని, పీడీ యాక్ట్ పెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఇక, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని, మద్యం రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోబోనని హెచ్చరించారు.
This post was last modified on November 2, 2024 2:38 pm
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…
నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…
ఈనెల 17 వ తేదీన ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో…
ఇన్స్టాగ్రామ్లో సెలబ్రిటీల పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ గురించి ఈమధ్య సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. నెలకు కొంత…
నాలుగు నెలల క్రితం అనుష్క కొత్త మలయాళం మూవీ 'కథనార్ - ది వైల్డ్ సోర్సెరర్' ప్రమోషన్లు మొదలయ్యాయి. ట్రైలర్…