Political News

బెల్ట్ షాపు పెడితే బెల్ట్ తీస్తా..చంద్రబాబు వార్నింగ్

జగన్ ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త రోడ్ల సంగతి పక్కనబెడితే…ఉన్న రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని దుస్థితి గత ప్రభుత్వంలో ఉందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో రోడ్లకు మహర్దశ కల్పించేందుకు సీఎం చంద్రబాబు నడుం బిగించారు. ఏపీలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో చంద్రబాబు నేడు శ్రీకారం చుట్టారు.

సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రంలోని రోడ్లపై ఒక్క గుంత ఉండకూడదని, అన్ని గుంతలు పూడ్చాల్సిందేనని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రా ఎస్కోబార్ వచ్చి రోడ్లపై గుంతలు పెట్టి వెళ్లారని జగన్‎ను విమర్శించారు. జగన్ హయాంలో రోడ్లపై నాట్లు వేశారని, చేపలు పట్టారని, స్విమ్మింగ్ ఫూల్స్ దర్శనమిచ్చాయని సెటైర్లు వేశారు. జగన్ హయాంలో నరకానికి మార్గాలుగా రోడ్లు ఉండేవని, వాటిని డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి మారుస్తామని చెప్పారు. విశాఖ నుండి అమరావతికి 2 గంటల్లో చేరుకునేలా రోడ్లు వేస్తామని చెప్పారు.

ఇక, మద్యం, ఇసుక వ్యాపారాల్లో అక్రమాలు చేస్తే సహించబోనని చంద్రబాబు అన్నారు. ఉచిత ఇసుక అక్రమ వ్యాపారం చేస్తే చర్యలు తప్పవని, పీడీ యాక్ట్ పెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఇక, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని, మద్యం రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోబోనని హెచ్చరించారు.

This post was last modified on November 2, 2024 2:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

7 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

51 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago