జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు ఎన్వీఎస్ ఎస్ వర్మకు చంద్రబాబు నుంచి ఇంకా ఎలాంటి అనుగ్రహం లభించకపోవడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయనకు కీలకమైన పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విజయం దక్కించుకున్నారు. కానీ, వర్మకు మాత్రం ఎలాంటి పదవీ దక్కలేదు.
ఇది.. పైకి చెక్కపోయినా.. ఇటు టీడీపీలోను.. అటు జనసేనలోనూ తరచుగా చర్చకు వస్తున్న విషయం. వర్మ గారిని మరిచిపోయారా? అంటూ.. పిఠాపురం నాయకులు(ఆయనపట్ల విధేయతతో ఉన్నవారు) కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే.. కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఎమ్మెల్సీలను నియమించారు. నామినేటెడ్ పదవులు ఇచ్చారు. కీలకమైన టీటీడీ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. మరికొన్ని రోజుల్లో మరో 40 దాకా.. నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే.. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన పేరు వినిపించలేదు. మొత్తంగా ఈ పరిణామాలను చూస్తే.. వర్మ విషయంలో లెక్కలు సరిపోవడం లేదా? అనేది కూటమి నేతల మధ్య జరుగుతున్న చర్చ. అయితే.. రాజకీయ విశ్లేషకులు మరో మాట చెబుతున్నారు. అసలుచాలా చిక్కుల్లో ఉన్నారన్నదివారి మాట. వర్మ విషయంలో కొందరు నాయకులు తెరచాటున అడ్డు తగులుతున్నారని వారు చెబుతున్నారు.
వారిలో కీలకమైన జనసేన నాయకుడు చక్రం తిప్పుతున్నారన్న వాదనా ఉంది. వర్మకు ఏ చిన్న పదవి ఇచ్చినా.. రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయన్నది వారి సమస్య. ఈ విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టినా.. పెట్టకపోయినా.. తెరచాటున జరుగుతున్న రాజకీయ చర్చ అయితే.. మొత్తంగా ఇదేనన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవన్నీ సమసిపోయి.. వర్మకు పదవి రావడం.. అంటే.. కనీసంలో కనీసం.. ఆరు మాసాలైనా ఆగకతప్పదన్నది వారి మాట. ఏదేమైనా.. రాజకీయాలు ఇంతే!!
This post was last modified on November 1, 2024 12:07 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…