Political News

పిఠాపురంలో ‘వ‌ర్మ‌’కు చిక్కులు!

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కులు ఎన్‌వీఎస్ ఎస్ వ‌ర్మకు చంద్ర‌బాబు నుంచి ఇంకా ఎలాంటి అనుగ్ర‌హం ల‌భించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న‌కు కీల‌క‌మైన ప‌దవి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ప్ర‌భుత్వం వ‌చ్చింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, వ‌ర్మ‌కు మాత్రం ఎలాంటి ప‌ద‌వీ ద‌క్క‌లేదు.

ఇది.. పైకి చెక్క‌పోయినా.. ఇటు టీడీపీలోను.. అటు జ‌న‌సేన‌లోనూ త‌ర‌చుగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. వ‌ర్మ గారిని మ‌రిచిపోయారా? అంటూ.. పిఠాపురం నాయ‌కులు(ఆయ‌న‌ప‌ట్ల విధేయ‌త‌తో ఉన్న‌వారు) కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఎమ్మెల్సీల‌ను నియ‌మించారు. నామినేటెడ్ ప‌ద‌వులు ఇచ్చారు. కీల‌క‌మైన టీటీడీ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. మ‌రికొన్ని రోజుల్లో మ‌రో 40 దాకా.. నామినేటెడ్ ప‌ద‌వులు భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న పేరు వినిపించలేదు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను చూస్తే.. వ‌ర్మ విష‌యంలో లెక్క‌లు స‌రిపోవ‌డం లేదా? అనేది కూట‌మి నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే.. రాజ‌కీయ విశ్లేష‌కులు మ‌రో మాట చెబుతున్నారు. అస‌లుచాలా చిక్కుల్లో ఉన్నార‌న్న‌దివారి మాట‌. వ‌ర్మ విష‌యంలో కొంద‌రు నాయ‌కులు తెర‌చాటున‌ అడ్డు త‌గులుతున్నారని వారు చెబుతున్నారు.

వారిలో కీల‌క‌మైన జ‌న‌సేన నాయ‌కుడు చ‌క్రం తిప్పుతున్నార‌న్న వాద‌నా ఉంది. వ‌ర్మ‌కు ఏ చిన్న ప‌ద‌వి ఇచ్చినా.. రెండు అధికార కేంద్రాలు ఏర్ప‌డ‌తాయ‌న్న‌ది వారి స‌మ‌స్య‌. ఈ విష‌యంపై చంద్ర‌బాబు దృష్టి పెట్టినా.. పెట్ట‌క‌పోయినా.. తెర‌చాటున జ‌రుగుతున్న రాజ‌కీయ చ‌ర్చ అయితే.. మొత్తంగా ఇదేనన్న‌ది అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇవ‌న్నీ స‌మ‌సిపోయి.. వ‌ర్మ‌కు ప‌ద‌వి రావ‌డం.. అంటే.. క‌నీసంలో క‌నీసం.. ఆరు మాసాలైనా ఆగ‌క‌త‌ప్ప‌ద‌న్న‌ది వారి మాట‌. ఏదేమైనా.. రాజకీయాలు ఇంతే!!

This post was last modified on November 1, 2024 12:07 pm

Share

Recent Posts

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

8 minutes ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

3 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

4 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

12 hours ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

12 hours ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

12 hours ago