Political News

సుబ్బారెడ్డి, సాయిరెడ్డి అబ‌ద్ధాలు చెబుతున్నారు: విజ‌య‌మ్మ రియాక్ష‌న్‌

వైఎస్ కుటుంబంలో రాజుకున్న ఆస్తుల వివాదం.. తార‌స్థాయికి చేరిన విష‌యం తెలిసిందే. ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు .. దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప‌ది రోజుల పాటు ఈ ఎపిసోడ్ ప‌త్రిక‌ల్లోనూ ప్ర‌ముఖంగా ముందుకు సాగింది. వైఎస్ జ‌గ‌న్ వ‌ర్సెస్ వైఎస్ ష‌ర్మిల మ‌ధ్య చోటు చేసుకున్న ఈ వివాదం అనేక మ‌లుపులు తిరిగింది. ఈ క్ర‌మంలో అంద‌రి చూపూ విజ‌య‌మ్మ వైపే పెట్టారు. ఆమె స్పందించాల‌ని కోరుకున్నారు. ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు విజ‌య‌మ్మ స్పందించారు.

తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఆమె వైఎస్సార్ అభిమానుల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. వైఎస్ ఆశ‌యాల మేర‌కు.. ఆస్తుల‌ను ఇద్ద‌రికీ స‌మానంగా పంచాల‌న్న‌ది వైఎస్ ఉద్దేశ‌మ‌ని చెప్పారు. అయితే.. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాలు.. త‌న‌ను క‌ల‌చివేస్తున్నాయ‌ని చెప్పారు. ఇద్ద‌రి మ‌ధ్య‌(జ‌గ‌న్‌, ష‌ర్మిల‌) తాను ఎంతో ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు చెప్పారు. అయినా కూడా.. జ‌ర‌గ‌కూడ‌నివి జ‌రుగుతూనే ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇక‌, ఈ ఎపిసోడ్‌లో కొంద‌రు(విజ‌య‌సాయిరెడ్డి, సుబ్బారెడ్డి) జోక్యం చేసుకుని చెబుతున్న‌వ‌న్నీ.. అబ‌ద్ధా లేన‌ని చెప్పారు. ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు మాట్లాడుతున్నార‌ని అన్నారు. ‘‘జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి“ అని విజ‌య‌మ్మ పేర్కొన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని తెలిపారు.

అయితే.. ఈ అబద్ధాల పరంపర ఇంక కొన‌సాగ‌కూడ‌ద‌ని తాను కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఇద్ద‌రు పిల్ల‌ల‌కే కాకుండా.. రాష్ట్రానికి కూడా మంచిది కాద‌ని పేర్కొన్నారు. అయితే.. ష‌ర్మిల‌.. వైఎస్ చెప్పిన‌ట్టు.. న‌లుగురు మ‌న‌వ‌ల‌కు స‌మానంగా పంచాల‌ని కోరుతుండగా.. విజ‌య‌మ్మ మాత్రం ఇద్ద‌రి గురించే పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ లేఖ‌తో అయినా.. వివాదాలు ఆగుతాయేమో చూడాలి.

This post was last modified on October 30, 2024 10:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

3 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

4 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

4 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

5 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

7 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

7 hours ago