Political News

ఆ టీడీపీ లేడీ ఎమ్మెల్యే కూల్ కూల్‌గా…

వ్యాపార వేత్త‌ల కుటుంబాలు కూడా.. రాజకీయాలు చేయ‌డం ఇప్పుడు పెద్ద చిత్రంకాదు. అస‌లు అవ‌సరం కూడా వారికే ఎక్కువ‌గా ఉంది. ఏ ప‌ని కావాల‌న్నా.. వ్యాపార వేత్త‌ల‌కు రాజ‌కీయ నేత‌ల‌తో ముడి ప‌డిపోయింది. అందుకే… వారే రాజ‌కీయ నేత‌లుగా మారుతున్నారు. అయితే.. ఎంత మంది వ్యాపార వేత్త‌లు ప్ర‌జ‌ల‌కు నేరుగా సేవ‌లు అందిస్తున్నార‌న్న విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. కొంత డౌటే కొడుతుంది. అవ‌కాశం తీరింది.. కాబ‌ట్టి.. అవ‌స‌రం ఇప్పుడు ప్ర‌జ‌ల‌ది అన్న‌ట్టుగా ఉంది.

అయితే.. ఈ అభిప్రాయాల‌కు భిన్నంగా.. ఒక మ‌హిళా పారిశ్రామిక వేత్త‌.. మాత్రం ఎమ్మెల్యేగా త‌న క‌ర్త‌వ్యాన్ని నిరాటంకంగా నిర్వ‌హిస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌పైనా దృష్టి పెట్టారు. ఆమే.. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆమె చుట్టూ రాజుకున్న రాజ‌కీయాలు అన్నీ ఇన్నీకావు. అనేక రూపాల్లో ఆమెపై వివాదాలు చెల‌రేగాయి. అయినా.. త‌ట్టుకుని విజ‌యం ద‌క్కించుకున్నారు.

దీనికి ప్రాతిప‌దిక‌.,. వేమిరెడ్డి ఎన్నిక‌ల స‌మయంలో చేసిన వాగ్దానాలు. “నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి ఒక్క‌రికీ అందుబాటులో ఉంటా” అని చెప్పిన ప్ర‌శాంతి.. ప్ర‌స్తుతం అదే ప‌నిచేస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల‌తో పోల్చుకుంటే.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేగా ప్ర‌శాంతి పేరే ముందుంది. అంతేకాదు.. స‌మ‌స్య‌ల‌ను కూలంక‌షంగా విన‌డంతోపాటు.. ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో 100మందికి కొత్త పింఛ‌న్ల‌ను రాయించారు.

అంతేకాదు.. స‌మ‌స్య ఎక్కడ ఉంటే అక్క‌డకు ఆమే వెళ్తున్నారు. నిజానికి ఎమ్మెల్యేలు బాధితుల‌ను త‌మ కార్యాల‌యాల‌కు పిలుస్తున్నారు. కానీ, ప్ర‌శాంతి మాత్రం త‌న ఆరోగ్యాన్ని కూడా లెక్క‌చేయ‌కుండా.. ఉద‌యాన్నే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. కోవూరులో వాకింగ్ క్ల‌బ్‌ను ఏర్పాటు చేసి.. వృద్ధుల స‌మ‌స్య‌లు ఈ క్ల‌బ్ ద్వారా ప‌రిష్క‌రిస్తున్నారు.

ఇప్ప‌టికి ప్ర‌తి నెలా(4సార్లుగా) ఉద్యోగమేళా నిర్వ‌హిస్తూ.. త‌మ వ్యాపారాలు స‌హా.. ఇత‌ర వ్యాపార‌స్తుల‌ను కూడా పిలిచి నియోజ‌క‌వ‌ర్గంలోని నిరుద్యోగుల‌కు నెల‌కు రూ.15000 వేత‌నం త‌గ్గ‌కుండా ఉపాధి క‌ల్పిస్తున్నారు. అయితే..ఎక్క‌డా ఆమె ప్ర‌చారం చేసుకోక‌పోవ‌డం మ‌రి ముఖ్య విష‌యం.

Satya

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

1 hour ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

2 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

3 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

3 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

3 hours ago