Political News

అంద‌రి చూపూ భార‌తి వైపు.. రీజ‌నేంటి?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌, కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల మ‌ధ్య చోటు చేసుకున్న ఆస్తుల వివాదం రాజ‌కీయ ర‌చ్చ‌గా మారిన విష‌యం తెలిసిందే. గ‌త వారం ప‌ది రోజులుగా ఈ చ‌ర్చ జోరుగా సాగుతూనే ఉంది.

అంతేకాదు.. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాటల దాడులు కూడా కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు అటు జ‌గ‌న్‌, ఇటు ష‌ర్మిల త‌ప్ప‌.. ప్ర‌ధానంగా కుటుంబ స‌భ్యులు ఎవ‌రూ కూడా.. మీడియా ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఈ విష‌యంలో జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి చుట్టూ కూడా క‌థ న‌డుస్తోంది.

భార‌తి సిమెంట్స్‌, సాక్షి, స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్ వంటి సంస్థ‌ల్లో భార‌తి బోర్డు డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. సాక్షికి ఆమె ఏకంగా చైర్మ‌న్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భార‌తి సిమెంట్స్‌లో పూర్తి గుత్తాధిప‌త్యం కూడా ఆమెదే కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ ఆస్తుల వివాదంపైనే తాజాగా ష‌ర్మిల రియాక్ట్ అయ్యారు. త‌న‌కు కూడా వాటాలు ఉన్నాయ‌ని.. న‌లుగురు మ‌న‌వ‌ళ్ల‌కు కూడా స‌మానంగా పంచాల‌ని వైఎస్ చెప్పార‌ని ఆమె చెబుతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో భార‌తి ఎందుకు మౌనంగా ఉన్నార‌నేది ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం ఆమెకు అనుకూలంగా కొన్ని సామాజిక మాధ్య‌మాల్లో చ‌ర్చ సాగుతుండ‌గా.. వ్య‌తిరేకంగా మ‌రికొన్ని మీడియా సంస్థ‌ల్లోనూ చ‌ర్చ వ‌స్తోంది. దీంతో అస‌లు వాస్త‌వం ఏంటి? భార‌తి వ్య‌వ‌హారం ఏంటి? అనేది చ‌ర్చ‌నీయాంశంగానే ఉంది. ఈ క్ర‌మంలో భార‌తి వైపు అంద‌రూ ఆస‌క్తిగా చూస్తున్నారు. ఆమె నోరు విప్పితే బాగుంటుంద‌ని.. మెజారిటీ రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయంగా ఉంది.

అంతేకాదు.. ఏం జ‌రిగిందో ధ‌ర్డ్ ప‌ర్స‌న్‌గా కంటే కూడా.. ఆమె వైఎస్ కోడ‌లిగా.. మీడియా ముందుకు వ‌స్తే.. ఈ స‌మ‌స్య‌కు కొంత ప‌రిష్కారం ల‌భించే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని భావిస్తున్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తి నోరు విప్ప‌డం లేదు. మీడియా ముందుకు కూడా రాలేదు. మ‌రి ఆమె ఏమ‌నుకుంటున్నారు? అనేది కీల‌కంగా మారింది. ఇంటి గుట్టు బ‌య‌ట పెట్ట‌రాద‌ని భావిస్తున్నారా? లేక‌.. జ‌రిగింది త‌ప్ప‌ని మౌనంగానే చెబుతున్నారా? అనేది తేలాల్సి ఉంది.

This post was last modified on October 27, 2024 5:45 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

37 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

2 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

2 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

3 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

5 hours ago