Political News

ఏపీ ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్లు.. కూట‌మికి ప‌దిలంగా.. !

రాష్ట్రంలో ప‌ట్ట‌భ‌ద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. వ‌చ్చే నెలలో ఈ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌త్య‌క్షంగా జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల త‌ర‌ఫున ఇద్ద‌రూ టీడీపీ నాయ‌కుల‌కే అవ‌కాశం చిక్కింది. దీంతో వీరిని గెలిపించుకోవ‌డం ద్వారా టీడీపీ త‌న హ‌వాను నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్లు ప‌దిలింగా టీడీపీకి ప‌డాల‌న్న ల‌క్ష్యంతో ఉండ‌డం గ‌మ‌నార్హం.

కూట‌మి పార్టీలైన జనసేన, బీజేపీల సమన్వయంతో నాయ‌కులు ముందుకు న‌డవాల్సిన అవ‌స‌రం ఏర్పడింది. అయితే.. ఇప్పుడు.. గ‌త రెండు మాసాల ముందున్న ప‌రిస్థితి అయితే.. లేదు. కొంత తేడా కొడుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వ‌చ్చిన ఎన్నిక‌లను ఎదుర్కొన‌డం అనేది అంత ఈజీకాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అంటే.. క్షేత్ర‌స్థాయిలో ఉన్న చిన్న‌పాటి లుక‌లుక‌లు.. నేత‌ల మ‌ధ్య విభేదాలుగా మారి.. ఐక్య‌త‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌న్న భావ‌న వ్య‌క్త‌మవుతోంది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిగే.. ఉమ్మడి తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు ఇటీవ‌ల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీయే అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు. జనసేన, బీజేపీలతో సమన్వయంతో ముందుకెళ్లాలని క్షేత్ర‌స్థాయిలో త‌మ్ముళ్ల‌కు సూచించారు. ఒక్క ఓటు కూడా చేజార కూడ‌ద‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎన్నికల అభ్యర్ధిగా పేరాబత్తుల రాజశేఖర్, గుంటూరు – కృష్ణా జిల్లాల అభ్యర్ధిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఖ‌చ్చితంగా గెలిపించుకునే బాధ్య‌త‌ల‌ను పార్టీ నాయ‌కుల‌కే అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. అవ‌స‌రమైతే.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు న‌మోదు ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించాల‌న్న‌ది కూడా.. చంద్ర‌బాబు వ్యూహం. త‌ద్వారా.. ప్ర‌తి ఓటుకూ ఎంతో విలువ ఉంది కాబ‌ట్టి.. ఓటర్ల నమోదును అత్యంత కీల‌కంగా తీసుకోవాల‌ని కూడా చంద్ర‌బాబు ఆదేశించారు. మ‌రి త‌మ్ముళ్లు ఏం చేస్తారో చూడాలి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago