Political News

‘ఐటీ మ్యాన్‌’…. చంద్ర‌బాబు: స‌రికొత్త ప్ర‌శంస‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రికార్డుల్లోకి స‌రికొత్త ప్ర‌శంస వ‌చ్చి చేరింది. ఆయ‌న‌ను ‘ఐటీ మ్యాన్‌’ అంటూ.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ కొనియాడారు. నిజానికి ‘ఐటీ’ గురించి ఎక్క‌డ‌మాట్లాడినా.. చంద్ర‌బాబు పేరు త‌ర‌చుగా వినిపిస్తుంది. ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. ఈ పేరు మాత్రం శాశ్వ‌తంగా నిలిచిపోయింది. దీనికి కార‌ణం.. హైద‌రాబాద్‌కు దీటుగా సైబ‌రాబాద్‌ను నిర్మించారు. దీనిలో ప్ర‌ఖ్యాత ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేలా ప్రోత్స‌హించారు. అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌ను కూడా తీసుకువ‌చ్చారు.

దీంతో చంద్ర‌బాబుపై స‌హ‌జంగానే ‘ఐటీ’ ముద్ర ప‌డింది. గ‌తంలో తెలంగాణ‌ను పాలించిన కేసీఆర్ స‌హా..అప్ప‌టి మంత్రి కేటీఆర్ కూడా.. చంద్ర‌బాబు ఐటీ కోసం చేసిన కృషిని త‌గ్గించ‌లేక‌పోయారు. పైకి కొ్న్ని కొన్ని సంద‌ర్భాల్లో బ‌య‌ట కూడా ప‌డ్డారు. ఇలా.. త‌న‌కంటూ.. ప్ర‌త్య‌క‌త‌ను సంత‌రించుకున్న చంద్ర‌బాబు.. తాజాగా కేంద్ర మంత్రి నుంచి కూడా ప్ర‌శంస‌లు ద‌క్కించుకోవ‌డం గ‌మ నార్హం. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ది ప్రాజెక్టులు.. రైల్వే ప్రాజెక్టుల‌కు సంబంధించి.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌తో చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ భేటీ అంతా.. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారానే జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి వంటివారు ప‌దుల సంఖ్య‌లో అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని.. కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు.. “ఇంత మందితో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన ఘ‌నత మీదే” అంటూ.. అశ్వినీ వైష్ణ‌వ్‌పై ప్ర‌శంస‌లు గుప్పించారు. అయితే.. ఆయ‌న ఈ ప్ర‌శంస‌ల‌ను తిప్పి కొడుతూ.. “నేను కాదు.. అస‌లు ఐటీమ్యాన్ మ‌న ముందున్న చంద్ర‌బాబు జీ!” అని ప్ర‌శంసించారు. దీంతో హాలు హాలంగా చ‌ప్ప‌ట్లతో మార్మోగిపోయింది. అయితే.. ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగు చూడ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 26, 2024 5:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

26 minutes ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

1 hour ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

2 hours ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

2 hours ago

RC 16 – ఒకట్రెండు ఆటలు కాదు బాసూ

రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉంటుందనే టాక్ ఉంది…

3 hours ago

అంతా సిద్ధం!.. టెస్లా రావడమే ఆలస్యం!

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే…

5 hours ago