Political News

కొండా సురేఖపై కోర్టు ఆగ్రహం

మాజీ మంత్రి కేటీఆర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పేను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో నాగార్జున, సమంతలతో కేటీఆర్ అసభ్యకరంగా వ్యాఖ్యానించారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా విచారణ ఈ రోజు కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా కొండా సురేఖపై నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

బాధ్యతగల మహిళా మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఓ మహిళా మంత్రి ఈ రకమైన కామెంట్లు చేయడం ఆశ్చర్యం కలిగించిందని కోర్టు వ్యాఖ్యానించింది. సమాజంపై ఈ తరహా వ్యాఖ్యలు చెడు ప్రభావాన్ని చూపిస్తాయని, ఆమె వ్యాఖ్యలను ఇటు మీడియా, అటు సోషల్ మీడియా, యూట్యూబ్ ప్లాట్ ఫాంల నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది.

కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రచారం చేసిన, ప్రచురించి మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను, వీడియోలను తొలగించాలని ఆదేశించింది. ఆ తరహా వ్యాఖ్యలు పబ్లిక్ డొమైన్ లో ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇంకెప్పుడూ కేటీఆర్ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది. అయితే, పరువు నష్టం కేసులో ఓ మంత్రి స్థాయి వ్యక్తిపై కోర్టు ఈ స్థాయిలో ఆగ్రహం, అసహనం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.
గతంలో కూడా కొండా సురేఖ ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినా సురేఖలో మార్పు రాలేదని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.

This post was last modified on October 25, 2024 4:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

12 minutes ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

30 minutes ago

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌ను న‌డిపించే ఎగ్జిబిట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మధ్య పీట‌ముడి గ‌ట్టిగానే బిగుసుకునేలా క‌నిపిస్తోంది. అద్దె విధానం ప‌క్క‌న పెట్టి…

34 minutes ago

విచారణకు భగీరథ్ డుమ్మా

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…

4 hours ago

బల పరీక్షలో నెగ్గిన విజయ్… కానీ…

ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…

4 hours ago

‘అందుకే ఇండస్ట్రీని వదిలేశా’

పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…

5 hours ago