వైసీపీకి మరో పెను గండం పొంచి ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. కీలకమైన కాపు నాయకుడు.. 2019 లో పవన్ను ఓడించిన నాయకుడు.. ఇప్పుడు జగన్ కు బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. 2019 ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో జనసేన తరఫున పవన్ కల్యాణ్.. పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో రెండు స్థానాలనుంచి పవన్ పోటీ చేశారు. భీమవరంలో వైసీపీ తరఫున కాపు నాయకుడు గ్రంధి శ్రీనివాస్ పోటీ చేసి పవన్పై విజయం దక్కించుకున్నారు.
అయితే.. పవన్ను ఓడించి.. వైసీపీ పరువు నిలబెట్టిన తనకు మంత్రి పదవి దక్కుతుందని.. జగన్ దగ్గర మరింత పరపతి చిక్కుతుందని గ్రంధి ఆశించారు. కానీ, ఆయనకు అలాంటిదేమీ దక్కలేదు. నిజానికి పవన్ను ఇద్దరు వైసీపీ నాయకులు ఓడించారు. వారిలో ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు. ఇక, ఆ తర్వాత కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి అయినా దక్కుతుందని అనుకున్నా.. అది కూడా లభించలేదు. ఇక, ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి.
కానీ, జగన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని అనుకున్నవారిలో గ్రంధి కూడా ఒకరు. దీంతో ఆయన తన ప్రతిపాదనను వాయిదా వేసుకున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా టీడీపీ వైపు దృష్టి పెట్టినట్టు సమాచారం. త్వరలోనే ఆయన టీడీపీతీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు వార్తలు గుప్పుమంటు న్నాయి. దీంతో అలెర్ట్ అయిన వైసీపీ కీలక నేతలను రంగంలోకి దింపింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన.. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఉమ్మడి కృష్నాకు చెందిన కాపునాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని.. ఇద్దరూ.. గ్రంధితో చర్చలు జరుపుతున్నారు. మరి ఈ బుజ్జగింపులు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. కాగా.. వైసీపీలో అసలు బుజ్జగింపుల పర్వం లేదని చెప్పే నాయకులు ఇప్పుడు గ్రంధిని ఎందుకు బుజ్జగిస్తున్నారన్నది ఆసక్తిగా మారింది. గతంలో ఇదే జిల్లాకు చెందిన ఆళ్ల కాళీకృష్ణశ్రీనివాస్ ఉరఫ్ నాని రాజీనామా చేసినప్పుడు లైట్ తీసుకున్న విషయం తెలిసిందే.
This post was last modified on October 24, 2024 2:28 pm
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…