Political News

టీడీపీలోకి ప‌వ‌న్‌ను ఓడించిన వైసీపీ నేత‌!!

వైసీపీకి మ‌రో పెను గండం పొంచి ఉంద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. కీల‌క‌మైన కాపు నాయ‌కుడు.. 2019 లో ప‌వ‌న్‌ను ఓడించిన నాయ‌కుడు.. ఇప్పుడు జ‌గ‌న్ కు బై చెప్పేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలిసింది. 2019 ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌నసేన త‌ర‌ఫున ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఎన్నిక‌ల్లో రెండు స్థానాల‌నుంచి ప‌వ‌న్ పోటీ చేశారు. భీమ‌వ‌రంలో వైసీపీ త‌ర‌ఫున కాపు నాయ‌కుడు గ్రంధి శ్రీనివాస్ పోటీ చేసి ప‌వ‌న్‌పై విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. ప‌వ‌న్‌ను ఓడించి.. వైసీపీ ప‌రువు నిలబెట్టిన త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర మ‌రింత ప‌ర‌ప‌తి చిక్కుతుంద‌ని గ్రంధి ఆశించారు. కానీ, ఆయ‌న‌కు అలాంటిదేమీ ద‌క్క‌లేదు. నిజానికి ప‌వ‌న్‌ను ఇద్ద‌రు వైసీపీ నాయ‌కులు ఓడించారు. వారిలో ఎవ‌రికీ మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌లేదు. ఇక‌, ఆ త‌ర్వాత కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి అయినా ద‌క్కుతుంద‌ని అనుకున్నా.. అది కూడా ల‌భించ‌లేదు. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

కానీ, జ‌గ‌న్ మ‌రోసారి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అనుకున్న‌వారిలో గ్రంధి కూడా ఒకరు. దీంతో ఆయ‌న త‌న ప్ర‌తిపాద‌న‌ను వాయిదా వేసుకున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా టీడీపీ వైపు దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఆయ‌న టీడీపీతీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిన‌ట్టు వార్త‌లు గుప్పుమంటు న్నాయి. దీంతో అలెర్ట్ అయిన వైసీపీ కీల‌క నేత‌ల‌ను రంగంలోకి దింపింది.

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన.. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు, ఉమ్మ‌డి కృష్నాకు చెందిన కాపునాయ‌కుడు, మాజీ మంత్రి పేర్ని నాని.. ఇద్ద‌రూ.. గ్రంధితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. మ‌రి ఈ బుజ్జ‌గింపులు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి. కాగా.. వైసీపీలో అస‌లు బుజ్జ‌గింపుల ప‌ర్వం లేద‌ని చెప్పే నాయ‌కులు ఇప్పుడు గ్రంధిని ఎందుకు బుజ్జ‌గిస్తున్నార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. గ‌తంలో ఇదే జిల్లాకు చెందిన ఆళ్ల కాళీకృష్ణ‌శ్రీనివాస్ ఉర‌ఫ్ నాని రాజీనామా చేసిన‌ప్పుడు లైట్ తీసుకున్న విష‌యం తెలిసిందే.

Satya

Recent Posts

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

1 hour ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

2 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

2 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

3 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

3 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

5 hours ago