Political News

టీడీపీలోకి ప‌వ‌న్‌ను ఓడించిన వైసీపీ నేత‌!!

వైసీపీకి మ‌రో పెను గండం పొంచి ఉంద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. కీల‌క‌మైన కాపు నాయ‌కుడు.. 2019 లో ప‌వ‌న్‌ను ఓడించిన నాయ‌కుడు.. ఇప్పుడు జ‌గ‌న్ కు బై చెప్పేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలిసింది. 2019 ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌నసేన త‌ర‌ఫున ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఎన్నిక‌ల్లో రెండు స్థానాల‌నుంచి ప‌వ‌న్ పోటీ చేశారు. భీమ‌వ‌రంలో వైసీపీ త‌ర‌ఫున కాపు నాయ‌కుడు గ్రంధి శ్రీనివాస్ పోటీ చేసి ప‌వ‌న్‌పై విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. ప‌వ‌న్‌ను ఓడించి.. వైసీపీ ప‌రువు నిలబెట్టిన త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర మ‌రింత ప‌ర‌ప‌తి చిక్కుతుంద‌ని గ్రంధి ఆశించారు. కానీ, ఆయ‌న‌కు అలాంటిదేమీ ద‌క్క‌లేదు. నిజానికి ప‌వ‌న్‌ను ఇద్ద‌రు వైసీపీ నాయ‌కులు ఓడించారు. వారిలో ఎవ‌రికీ మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌లేదు. ఇక‌, ఆ త‌ర్వాత కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి అయినా ద‌క్కుతుంద‌ని అనుకున్నా.. అది కూడా ల‌భించ‌లేదు. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

కానీ, జ‌గ‌న్ మ‌రోసారి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అనుకున్న‌వారిలో గ్రంధి కూడా ఒకరు. దీంతో ఆయ‌న త‌న ప్ర‌తిపాద‌న‌ను వాయిదా వేసుకున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా టీడీపీ వైపు దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఆయ‌న టీడీపీతీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిన‌ట్టు వార్త‌లు గుప్పుమంటు న్నాయి. దీంతో అలెర్ట్ అయిన వైసీపీ కీల‌క నేత‌ల‌ను రంగంలోకి దింపింది.

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన.. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు, ఉమ్మ‌డి కృష్నాకు చెందిన కాపునాయ‌కుడు, మాజీ మంత్రి పేర్ని నాని.. ఇద్ద‌రూ.. గ్రంధితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. మ‌రి ఈ బుజ్జ‌గింపులు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి. కాగా.. వైసీపీలో అస‌లు బుజ్జ‌గింపుల ప‌ర్వం లేద‌ని చెప్పే నాయ‌కులు ఇప్పుడు గ్రంధిని ఎందుకు బుజ్జ‌గిస్తున్నార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. గ‌తంలో ఇదే జిల్లాకు చెందిన ఆళ్ల కాళీకృష్ణ‌శ్రీనివాస్ ఉర‌ఫ్ నాని రాజీనామా చేసిన‌ప్పుడు లైట్ తీసుకున్న విష‌యం తెలిసిందే.

This post was last modified on October 24, 2024 2:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

2 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

3 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

4 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

6 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

6 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

7 hours ago