Political News

అవ‌మానం తొల‌గించుకొని… ఆల్ రైట్ స్థాయికి చేరిన రేవంత్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా తనపై వస్తున్న విమర్శలకు అనుకోకుండానే కలిసి వచ్చిన అవకాశంతో చెక్‌ పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తనపై జరుగుతున్న దుష్ప్రచారం, ఒకింత అవమాన పర్వానికి ఆయన ప‌రోక్షంగా క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ యువనేత ప్రియాంక గాంధీ నామినేషన్ పర్వం సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఊహించని రీతిలో రేవంత్ రెడ్డి పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. హైడ్రా కూల్చివేత‌లు, గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ లోని జీవో 29 కార‌ణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ముఖ్యంగా విద్యార్థులు రోడ్డెక్క‌డం సహా వివిధ అంశాల్లో తీవ్ర వ్యతిరేకతని సీఎం రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ… ఈ విషయం ఢిల్లీ పెద్దలకు కూడా చేరింది అనేది ఈ వ్య‌తిరేక ప్ర‌చారంలోని సారాంశం. యువ నేతగా అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే రేవంత్ సొంత నిర్ణయాలు తీసుకుంటూ తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతని సొంతం చేసుకున్నారని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో, రాజకీయ స్ర‌వంతిలో గుసగుసలు వినిపించాయి.

పై కారణాలనే పేర్కొంటూ రేవంత్ కి ఢిల్లీలో అపాయింట్మెంట్ కరువైందని అందుకే ఇటీవల కాలంలో తరచుగా ఢిల్లీ వెళ్తున్న పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ముఖ్య నేతలైన రాహుల్ ప్రియాంకల దర్శనం దొరకడం లేదని రేవంత్ రెడ్డికి ఇది ఊహించ‌ని ప‌రిణామం.. ఒకింత అవ‌మానం అనేది ప్ర‌చారం జ‌రిగింది. అయితే, తాజాగా ప్రియాంక గాంధీ నామినేషన్ ఈ ప్రచారానికి చెక్ పెట్టింది.

తన సోదరుడైన రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఏర్పడిన వయనాడు ఎంపీ స్థానంలో పోటీ చేసే అవ‌కాశం నేప‌థ్యంలో తాజాగా బుధ‌వారం ప్రియాంక గాంధీ నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ త‌ర‌ఫున ముఖ్య నేత‌లు హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మానికి రేవంత్ రెడ్డి సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీ ముఖ్య‌నేత‌లై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీల‌కు నమస్కరించారు. వారికి పార్టీ కండువాలు క‌ప్పారు. ఈ ప‌రిణామాల‌న్నింటినీ ఉటంకిస్తున్న రేవంత్ అనుచ‌ర వ‌ర్గం ఢిల్లీ కేంద్రంగా రేవంత్‌ పట్ల జరుగుతున్న ప్రచారం నిజం కాదని ప్రచారంలో పెట్టింది.

This post was last modified on October 24, 2024 12:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago