Political News

ఆ విష‌యంలో జ‌న‌సేన‌ను.. బీజేపీ హైజాక్ చేస్తుందా..!

రాష్ట్రంలో మూడు పార్టీల కూట‌మిని ఏర్పాటు చేసి, వైసీపీని గ‌ద్దె దించిన పార్టీ జ‌న‌సేన‌. ఇక‌, టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసిన పార్టీ బీజేపీ. అంటే.. మొత్తంగా కూట‌మిలో ఈ రెండు పార్టీల ప్ర‌భావం, ప్రాధాన్యం కూడా ఎక్కువ‌గానే ఉంది. మంత్రి ప‌ద‌వులు కూడా పంచుకున్నారు. వారి వారి ఎమ్మెల్యేల సంఖ్య‌ను బ‌ట్టి.. చంద్ర‌బాబు ఆయా పార్టీల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన నామినేటెడ్ ప‌ద‌వుల పంప‌కం వ‌చ్చింది. ఈ విష‌యంలో చంద్ర‌బాబు త‌ప్పుకొన్నారు.

‘మీకు 20 శాతం ప‌ద‌వులు ఇస్తాం.. వాటిని మీరు ఎలాగైనా పంచుకోండి! మాకు అభ్యంత‌రం లేదు’- అని చంద్ర‌బాబు తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో ఆ 20 శాతం ప‌ద‌వుల‌ను పంచుకునే ప‌రిస్థితి జ‌న‌సేన‌, బీజేపీల కోర్టులో ఉంది. ఈ విష‌యంలో బీజేపీ హైజాక్ చేస్తుందా? లేక‌.. ఇరు పార్టీలూ ఒక ఒప్పందానికి వ‌చ్చి పద‌వులు పంచుకుంటాయా? అనేది ఆస‌క్తిగా మారింది. ఎన్నిక‌ల స‌మయంలోనూ.. బీజేపీ.. కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది.

టీడీపీ ప్ర‌క‌టించిన సీట్ల‌లో అప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన సీట్ల‌లో ఎన్నిక‌ల నామినేష‌న్ల గ‌డువు ముగుస్తున్న స‌మ‌యంలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుని.. అప్ప‌టికే ప్ర‌క‌టించిన వాటిలో త‌మ అభ్య‌ర్థుల‌ను నిలిపింది. ఇలా నాలుగు చోట్ల టీడీపీ అప్ప‌టిక‌ప్పుడు అభ్య‌ర్థుల‌ను మార్చాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అంటే.. ఒక‌ర‌కంగా బీజేపీనే అప్ప‌ట్లో పైచేయి సాధించింద‌న్న చ‌ర్చ సాగింది. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన విష‌యంలో , నామినేటెడ్ ప‌ద‌వుల అంశంలోనూ ఇలానే చేసే అవ‌కావం ఉందా? అనేది సందేహం.

జ‌న‌సేన పార్టీ ఆది నుంచి వైసీపీపై చూపిస్తున్న దూకుడు.. ప‌ద‌వులు, ఇత‌ర‌త్రా కూట‌మిలో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌య‌త్నించ‌లేదు. పైచేయి కూడా చూప‌లేదు. స‌ర్దుకు పోయే ధోర‌ణిలోనే ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు బీజేపీ 20 శాతం ప‌ద‌వుల్లో మెజారిటీ షేర్ తీసుకున్నా ఆశ్చ‌ర్యం లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. లేదా.. స‌మానంగా అయినా.. పంచుకునే అవ‌కాశం ఉంది. వాస్త‌వానికి బీజేపీకి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు పోల్చుకుంటే.. కొంద‌రు ఓడిపోయారు. కానీ, జ‌న‌సేన పూర్తిగా విజ‌యం ద‌క్కించుకుంది. అలాంట‌ప్పుడు 12-15 శాతం తీసుకుంటే బెట‌ర్ అని పార్టీ నాయ‌కులు ఆలోచ‌న చేసే అవ‌కాశం ఉంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

3 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

5 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

6 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

6 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

6 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

7 hours ago