రాష్ట్రంలో మూడు పార్టీల కూటమిని ఏర్పాటు చేసి, వైసీపీని గద్దె దించిన పార్టీ జనసేన. ఇక, టీడీపీ, జనసేనతో కలిసిన పార్టీ బీజేపీ. అంటే.. మొత్తంగా కూటమిలో ఈ రెండు పార్టీల ప్రభావం, ప్రాధాన్యం కూడా ఎక్కువగానే ఉంది. మంత్రి పదవులు కూడా పంచుకున్నారు. వారి వారి ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి.. చంద్రబాబు ఆయా పార్టీలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, ఇప్పుడు కీలకమైన నామినేటెడ్ పదవుల పంపకం వచ్చింది. ఈ విషయంలో చంద్రబాబు తప్పుకొన్నారు.
‘మీకు 20 శాతం పదవులు ఇస్తాం.. వాటిని మీరు ఎలాగైనా పంచుకోండి! మాకు అభ్యంతరం లేదు’- అని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో ఆ 20 శాతం పదవులను పంచుకునే పరిస్థితి జనసేన, బీజేపీల కోర్టులో ఉంది. ఈ విషయంలో బీజేపీ హైజాక్ చేస్తుందా? లేక.. ఇరు పార్టీలూ ఒక ఒప్పందానికి వచ్చి పదవులు పంచుకుంటాయా? అనేది ఆసక్తిగా మారింది. ఎన్నికల సమయంలోనూ.. బీజేపీ.. కీలకంగా వ్యవహరించింది.
టీడీపీ ప్రకటించిన సీట్లలో అప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన సీట్లలో ఎన్నికల నామినేషన్ల గడువు ముగుస్తున్న సమయంలో సంచలన నిర్ణయాలు తీసుకుని.. అప్పటికే ప్రకటించిన వాటిలో తమ అభ్యర్థులను నిలిపింది. ఇలా నాలుగు చోట్ల టీడీపీ అప్పటికప్పుడు అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే.. ఒకరకంగా బీజేపీనే అప్పట్లో పైచేయి సాధించిందన్న చర్చ సాగింది. ఇక, ఇప్పుడు జనసేన విషయంలో , నామినేటెడ్ పదవుల అంశంలోనూ ఇలానే చేసే అవకావం ఉందా? అనేది సందేహం.
జనసేన పార్టీ ఆది నుంచి వైసీపీపై చూపిస్తున్న దూకుడు.. పదవులు, ఇతరత్రా కూటమిలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించలేదు. పైచేయి కూడా చూపలేదు. సర్దుకు పోయే ధోరణిలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ 20 శాతం పదవుల్లో మెజారిటీ షేర్ తీసుకున్నా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. లేదా.. సమానంగా అయినా.. పంచుకునే అవకాశం ఉంది. వాస్తవానికి బీజేపీకి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు పోల్చుకుంటే.. కొందరు ఓడిపోయారు. కానీ, జనసేన పూర్తిగా విజయం దక్కించుకుంది. అలాంటప్పుడు 12-15 శాతం తీసుకుంటే బెటర్ అని పార్టీ నాయకులు ఆలోచన చేసే అవకాశం ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on October 23, 2024 11:10 am
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఫలితం పట్ల దర్శకుడు ఆదిత్య హాసన్ టెన్షన్ పడుతున్న…
భారత్లో కొత్త కార్లు కొనేవాళ్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. ఆగస్టులో పెట్రోల్ కార్ల కంటే CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు…
థియేటర్ల దగ్గర టాక్సిక్ కథ ముగిసిపోయింది కానీ దాని కథలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సర్దార్ దర్శకుడు మిత్రన్…
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు వాకౌట్ చేసిన సంగతి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మధ్యంతర ఎన్నికల సెగ భారీగా తగిలేలా కనిపిస్తోంది. మధ్యంతర ఎన్నికలు వచ్చే అక్టోబరు-నవంబరు మాసాల…