ప్రజల్లో ఉండాలంటూ.. నాయకులకు, కార్యకర్తలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తాజాగా సెలవిచ్చారు. ‘ప్రజల్లో ఉంటేనే గుర్తింపు ఉంటుంది. వారు మనల్ని గుర్తు పెట్టుకుంటారు. మీరు నిరంతరం ప్రజల్లో ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా వైసీపీ నేతలతో ఆయన వర్క్ షాపు నిర్వహించారు. ఈ సందర్భంగానే వారికి ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ఇది మంచిదే. ఎవరూ కాదనరు. కానీ, అసలు ప్రజల్లో ఉండాల్సింది ఎవరు? అన్నది ప్రశ్న.
ఎందుకంటే.. ఓడిపోయిన పార్టీకి ప్రజలలో ఆదరణ పెద్దగా ఉండదు. పైగా కార్యకర్తలు, నేతలు ముందుకు వెళ్లినా.. వారికి నిరసన సెగ తగులుతుంది. ఇది అన్ని పార్టీలకూ కామనే. గతంలో 2019-24 మధ్య టీడీపీ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు వచ్చేందుకు భయపడ్డారు. ఈ సమయంలో మీ కంటే ముందు నేనే ప్రజల్లో ముందుంటానంటూ.. చంద్రబాబు బయటకు వచ్చారు. ఆయనే నేరుగా కార్యక్రమాల్లో ముందు పాల్గొన్నారు.
దీంతో కార్యకర్తలు, నాయకుల్లో చైతన్యం వచ్చింది. టీడీపీ పుంజుకునేందుకు బాటలు పడ్డాయి. ఈ క్రమంలో చంద్రబాబు తన వయసును, ఇతరత్రా సమస్యలను కూడా పట్టించుకోకుండానే ముందుకు సాగారు. మరి.. ఇలాంటి పరిస్థితే వైసీపీలోనే ఉంటుంది కదా? ఈ విషయాన్ని జగన్ విస్మరించారు. మీరు వండి పెట్టండి నేను భోజనం చేస్తాను! అన్నట్టుగానే ఆయన వ్యవహారం ఉందన్న విమర్శలు వస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు కార్యకర్తలు, నాయకులు కూడా అంతర్గత సంభాషణల్లో వెల్లడించారు.
అయితే.. ఎవరూ కూడా జగన్ను నేరుగా ప్రశ్నించే పరిస్థితి లేకపోవడం గమనార్హం. కానీ, వారి చర్చల్లో రీజన్ కనిపిస్తోంది. ముందు రావాల్సింది.. ముందు నిలబడాల్సింది కూడా జగనే. పార్టీ బలోపేతం అనేది నాయకుడు వ్యవహరించే తీరును బట్టే ఉంటుంది. కానీ, ఈ చిన్న సూత్రాన్ని జగన్ మరిచిపోయినట్టుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా ఉంది. కానీ, ఇది సరైన పద్ధతి కాదని, మీరు బెంగళూరులోను, తాడేపల్లిలోనూ కూర్చుంటే మేం ప్రజల్లో తిరిగితే ఫలితం ఉండదని మెజారిటీ నాయకులు చెబుతుండడం గమనార్హం.
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…