Political News

ప్ర‌జ‌ల్లో ఎవ‌రుండాలి? జ‌గ‌న్‌కు సూటి ప్ర‌శ్న‌.. !

ప్ర‌జ‌ల్లో ఉండాలంటూ.. నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌ల‌కు వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ తాజాగా సెల‌విచ్చారు. ‘ప్ర‌జ‌ల్లో ఉంటేనే గుర్తింపు ఉంటుంది. వారు మ‌న‌ల్ని గుర్తు పెట్టుకుంటారు. మీరు నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉండాలి’ అని ఆయ‌న పేర్కొన్నారు. తాజాగా వైసీపీ నేత‌ల‌తో ఆయ‌న వ‌ర్క్ షాపు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగానే వారికి ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని పిలుపునిచ్చారు. ఇది మంచిదే. ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, అస‌లు ప్ర‌జ‌ల్లో ఉండాల్సింది ఎవ‌రు? అన్న‌ది ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. ఓడిపోయిన పార్టీకి ప్ర‌జ‌ల‌లో ఆద‌ర‌ణ పెద్ద‌గా ఉండ‌దు. పైగా కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ముందుకు వెళ్లినా.. వారికి నిర‌స‌న సెగ త‌గులుతుంది. ఇది అన్ని పార్టీల‌కూ కామ‌నే. గ‌తంలో 2019-24 మ‌ధ్య టీడీపీ కూడా ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంది. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు వ‌చ్చేందుకు భ‌యప‌డ్డారు. ఈ స‌మ‌యంలో మీ కంటే ముందు నేనే ప్ర‌జ‌ల్లో ముందుంటానంటూ.. చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆయ‌నే నేరుగా కార్య‌క్ర‌మాల్లో ముందు పాల్గొన్నారు.

దీంతో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో చైత‌న్యం వ‌చ్చింది. టీడీపీ పుంజుకునేందుకు బాట‌లు ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు త‌న వ‌య‌సును, ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌ట్టించుకోకుండానే ముందుకు సాగారు. మ‌రి.. ఇలాంటి ప‌రిస్థితే వైసీపీలోనే ఉంటుంది క‌దా? ఈ విష‌యాన్ని జ‌గ‌న్ విస్మ‌రించారు. మీరు వండి పెట్టండి నేను భోజ‌నం చేస్తాను! అన్న‌ట్టుగానే ఆయ‌న వ్య‌వ‌హారం ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నారు. ఇదే విష‌యాన్ని కొంద‌రు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో వెల్ల‌డించారు.

అయితే.. ఎవ‌రూ కూడా జ‌గ‌న్‌ను నేరుగా ప్ర‌శ్నించే ప‌రిస్థితి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కానీ, వారి చ‌ర్చ‌ల్లో రీజ‌న్ క‌నిపిస్తోంది. ముందు రావాల్సింది.. ముందు నిల‌బ‌డాల్సింది కూడా జ‌గ‌నే. పార్టీ బ‌లోపేతం అనేది నాయ‌కుడు వ్య‌వ‌హ‌రించే తీరును బ‌ట్టే ఉంటుంది. కానీ, ఈ చిన్న సూత్రాన్ని జ‌గ‌న్ మ‌రిచిపోయిన‌ట్టుగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేస్తున్న‌ట్టుగా ఉంది. కానీ, ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని, మీరు బెంగ‌ళూరులోను, తాడేప‌ల్లిలోనూ కూర్చుంటే మేం ప్ర‌జ‌ల్లో తిరిగితే ఫ‌లితం ఉండ‌ద‌ని మెజారిటీ నాయ‌కులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 18, 2024 9:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago