మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దల మధ్య వినిపిస్తున్న మాట ఇదేనని అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం. టాలీవుడ్ కు తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సమస్యలు లేవు. బిఆర్ఎస్ హయాం నుంచి ఇప్పటి కాంగ్రెస్ పాలన దాకా ప్రతిదీ ఇబ్బంది లేని తరహాలోనే జరిగింది. టికెట్ల పెంపుకు అనుమతులు కావాలన్నా, అదనపు ఆటలు వేసుకోవాలన్నా, ఎక్కువ హంగామా లేకుండా సరైన అప్లికేషన్ పెడితే వేగంగానే అనుమతులు వచ్చేవి. ఇలాంటి అనుకూలమైన పరిస్థితి వైసిపి పాలన ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ లో లేదు. ముఖ్యంగా ప్యాన్ ఇండియా సినిమా నిర్మాతలు పడిన అగచాట్లు అన్నిఇన్ని కావు.
వేగంగా ఫ్లాష్ బ్యాక్ వైపు ఒక లుక్ వేస్తే పరిశ్రమ స్టార్లందరూ జగన్ దగ్గరకు వెళ్లి విన్నపాలు చేసుకోవడం, అవసరం లేకపోయినా మంత్రుల స్థాయి వ్యక్తులు నిర్మాతలను కూర్చోబెట్టి మీటింగులు పెట్టడం, పవన్ సినిమాలకు ఏకంగా మినిస్టర్లు ప్రెస్ మీట్ లో రివ్యూలు చెప్పడం, టికెట్ హైకులకు అర్ధరాత్రి దాకా నాన్చడం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు అవుతుంది. ఇన్ని జరిగినా ఎవరూ గట్టిగా నోరు మెదపలేని ఇరకాటం. ఇప్పుడు టిడిపి జనసేన బిజెపి కూటమి వచ్చేసింది. స్వయానా పవన్ కళ్యాణే కీలక భూమిక పోషిస్తున్నాడు. సిఎం చంద్రబాబునాయుడు, బాలయ్యతో సత్సంబంధాలు ఉన్న వాళ్లే టాలీవుడ్ లో ఎక్కువ.
ఇకపై భవిష్యత్తులో తమవైపు నుంచి ఎలాంటి వినతులు వెళ్లినా వాటికి సానుకూల స్పందన ఉంటుందనే ఆశాభావం అందరిలోనూ కనిపిస్తోంది. ప్రచార సమయంలో చంద్రబాబునాయుడు పలు సందర్భాల్లో చిరంజీవి, రాజమౌళి, మహేష్, ప్రభాస్ పేర్లను ప్రస్తావించి వాళ్ళను జగన్ అవమానించడం గురించి ప్రత్యేకంగా దుయ్యబట్టారు. అలాంటి సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే స్థాయి నీది కాదని నిలదీశారు. ఇకపై అమరావతి రాజధానిగా తిరిగి జీవం పోసుకుంటున్న వేళ షూటింగులను ప్రోత్సహించేలా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశాలు బోలెడు. ఇక టెన్షన్ లేదని కొందరు ప్రొడ్యూసర్లు బాహాటంగానే కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on June 5, 2024 4:21 pm
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…
2014లో ఉమ్మడి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత.. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో..…
స్టార్ హీరోలకు కోట్లలో అభిమానులు ఉంటారు. నిర్మాణంలో ఉన్న క్రేజీ సినిమాలకు సంబంధించిన అప్డేట్ అంటే చాలు వాళ్లకు ప్రాణం…
ఐపీఎల్లో ముంబయితో సమానంగా ఐదుసార్లు విజేతగా నిలిచిన జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్. ముంబయి కంటే ఎక్కువగా ఫైనల్స్ ఆడిన,…
వైసీపీ అధినేత జగన్ తమపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం.. హైకోర్టును ఆశ్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ…