‘దేవర’ సందడి ముగిసింది. ఇక తెలుగు ప్రేక్షకుల దృష్టంతా ‘పుష్ప-2’ మీదే ఉంది. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు డిసెంబరు 5 వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే సినిమాకు ఫస్టాఫ్ లాక్ చేయడం.. దాని గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఒక రేంజిలో చెప్పడం.. యూనిట్ సభ్యుల నుంచి కూడా ప్రథమార్ధం అదిరిపోయిందనే టాక్ వస్తుండడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి.
‘పుష్ప-2’ కోసం తెలుగు ప్రేక్షకులను మించి హిందీ ఆడియన్స్ ఎదురు చూస్తుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ‘పుష్ప’ తెలుగు వెర్షన్ ఓ మోస్తరుగా ఆడితే.. హిందీ వెర్షన్ బ్లాక్ బస్టర్ అయింది.
సినిమా రిలీజ్ తర్వాత పుష్ప మేనరిజమ్స్, ఆ సినిమా పాటలు హిందీలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ‘పుష్ప-2’ సినిమాకు హిందీలో బిజినెస్ కూడా ఒక రేంజిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల పరంగా కూడా హిందీ మార్కెట్ మీద ప్రత్యేకంగా దృష్టిసారించబోతోందట టీమ్.
ప్రస్తుతం తెలుగు సినిమాలకు అర్ధరాత్రి 1 గంట నుంచే పెయిడ్ ప్రిమియర్స్ పడుతున్న సంగతి తెలిసిందే. కల్కి, దేవర సినిమాలకు ఇలాగే చేశారు. ‘పుష్ప-2’కు కూడా ఇదే ఒరవడి కొనసాగనుంది. ఐతే అంతకంటే ముందు హిందీలో స్పెషల్ షో పడబోతోందట.
ముంబయిలో ముందు రోజు రాత్రి 9.30కే ‘పుష్ప-2’ స్పెషల్ ప్రిమియర్ వేయబోతున్నారట. బాలీవుడ్ సెలబ్రెటీలు, మీడియాకు ఈ షో ఉంటుందని సమాచారం. సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్న టీం.. ఈ ప్రిమియర్ ద్వారా ముందే పాజిటివ్ టాక్ ముందే బయటికి వచ్చి హిందీ ప్రేక్షకుల్లో ఇంకా హైప్ పెరగడానికి ఉపయోగపడుతుందని.. తద్వారా ఓపెనింగ్స్ కూడా పెంచుకోవచ్చని భావిస్తున్నారట.
త్వరలోనే దీని గురించి అనౌన్స్మెంట్ కూడా వస్తుందని సమాచారం. ‘పుష్ప’ ప్రి ప్రొడక్షన్ పనులు సమయానికి ముగియక హడావుడి పడ్డ టీం.. ‘పుష్ప-2’కు మాత్రం అన్నీ ముందే సిద్ధం చేసి పక్కాగా రిలీజ్ చేయాలని భావిస్తోంది.
This post was last modified on October 15, 2024 1:27 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…