ఇంకో నెల రోజుల్లో విడుదల కాబోతున్న కంగువ కోసం గ్రౌండ్ రెడీ అవుతోంది. 2024లో కల్కి 2898 ఏడి, దేవర, గుంటూరు కారం, గోట్ తర్వాత అతి పెద్ద ఓపెనింగ్స్ దక్కించుకోబోతున్న ప్యాన్ ఇండియా మూవీగా దీని మీద భారీ అంచనాలున్నాయి. ఒరిజినల్ వెర్షన్ కి సూర్య స్వంతంగా డబ్బింగ్ చెబుతుండగా ఏఐ టెక్నాలజీ వాడి ఏడు ఇతర భాషల్లో ఆయన గొంతే వినిపించేలా దర్శక నిర్మాతలు సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. 3డి వెర్షన్ తాలూకు పనులు చివరి దశకు వచ్చాయట. నవంబర్ 15 ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మిస్ కాకుండా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్న వైనం కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ మేరకు ఆహ్వానం వెళ్లిందని ఫిలిం నగర్ టాక్. ఇంత బలంగా చెప్పేందుకు కారణముంది. కంగువకు నిర్మాణ భాగస్వామి యువి క్రియేషన్స్. దాని అధినేతలు వంశీ, ప్రమోద్ లు డార్లింగ్ కు ఎంత ప్రాణ స్నేహితులో చెప్పనక్కర్లేదు. సో అడగటం ఆలస్యం నో అనకపోవచ్చు. కాకపోతే హను రాఘవపూడితో చేస్తూన్న ఫౌజీ షూటింగ్ పీక్స్ లో ఉన్న సమయంలో దీనికి అందుబాటులో ఉంటాడో లేదో చూడాలి. అయితే కాల్ షీట్స్ చెక్ చేసుకునే యువి వాళ్ళు అడుగుతారు కాబట్టి డౌట్ అక్కర్లేదేమో.
ఇదే నిజమైతే సూర్య, ప్రభాస్ లను ఒకే వేదిక మీద చూసే అభిమానులకు దక్కుతుంది. ఒకళ్ళ గురించి ఒకరు పరస్పరం చెప్పుకునే మాటలు ఎలా ఉంటాయోననే ఆసక్తి సామాన్య ప్రేక్షకుల్లోనూ ఉంటుంది. ఎంత పెద్ద హిట్లు కొట్టినా సౌమ్యంగా ఉండే ఇద్దరు పెద్ద హీరోల కలయిక కన్నా కావాల్సింది ఏముంటుంది. కంగువ కోసం భారీ ఎత్తున పబ్లిసిటీ డిజైన్ చేస్తున్న స్టూడియో గ్రీన్ సంస్థ బాహుబలి స్థాయిలో బ్లాక్ బస్టర్ ని ఆశిస్తోంది. రజనీకాంత్ పెద్దన్న నిరాశపరిచినప్పటికీ దర్శకుడు సిరుతై శివ చెప్పిన కథ విపరీతంగా నచ్చడంతో ఇంత భారీ బడ్జెట్ తో రిస్క్ తీసుకున్నారు. ట్రైలర్ లాంఛ్ త్వరలోనే ఉండబోతోంది.
This post was last modified on October 14, 2024 11:39 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…