దర్శకుడు ప్రశాంత్ నీల్ మరో ఐదేళ్ళ వరకు బిజీగా ఉండేలా పర్ఫెక్ట్ లైనప్ అయితే సెట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఒక అగ్ర హీరో డేట్స్ దొరకాలి అంటే ఏడాది లేదా రెండేళ్ళు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇక హీరోల పరిస్థితి కూడా దాదాపు అలానే మారింది. అందుకే అగ్ర దర్శకులతో ముందే ఒక కథ లాక్ చేసుకుంటున్నారు.
ఇక నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చెయాలనే టార్గెట్ తో ప్లాన్ అయితే సెట్ చేసుకున్నాడు. ఇక మరోవైపు ప్రభాస్ తో సలార్ 2 కూడా ఫినిష్ చేయాల్సి ఉంది. దానికి ఎక్కువ టైమ్ పట్టకపోవచ్చు. 2027లో సమ్మర్ కు సలార్ 2 రావచ్చని టాక్.
KGF3 స్క్రిప్ట్ కూడా ముందే సిద్ధం చేసుకున్న నీల్ డైలాగ్ వెర్షన్ ను ఫినిష్ చేయాల్సి ఉందట. దానికి ఒక ఏడాదిన్నర టైమ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ కాంబో సెట్టయినట్లు తెలుస్తోంది. దానయ్య నిర్మాణంలో రానున్న ఈ ప్రాజెక్టు 2029 లేదా 2030 లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
అసలైతే ఈ కాంబో సలర్ తరువాతే సెట్స్ పైకి రావాల్సింది. 2021లొనే నీల్ చరణ్ కు ఒక కథ వినిపించాడు. కానీ అప్పుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. ఫైనల్ గా ఇప్పుడు మరో కథకు కనెక్ట్ అయినట్లు సమాచారం. ఏదేమైనా నీల్ మాత్రం మరో ఐదేళ్ళ వరకు ఖాళీ లేకుండా అగ్ర హీరోలందరిని లాక్ చేసుకున్నాడు. మరి ఈ లైనప్ అనుకున్నట్లుగా సాగుతుందో లేదో చూడాలి.
This post was last modified on October 13, 2024 12:57 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…