నందమూరి అభిమానులు ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ తెరంగేట్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ ద్వారా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఫస్ట్ లుక్ పోస్టర్ తో శుభవార్తను పంచుకున్నారు. టైటిల్ పెట్టడం, రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లడం ఇంకా జరగలేదు కానీ క్యాస్టింగ్ కు సంబంధించిన పనులు జరిగిపోతున్నాయి. హీరోయిన్ గా రషా తదాని పేరుని పరిశీలిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. గతంలో ఈమెను రామ్ చరణ్ 16 కోసం ట్రై చేసి ఫోటో షూట్ చేసినట్టు వార్త వచ్చింది కానీ తర్వాత ఏమైందో బయటికి రాలేదు. ఫైనల్ గా జాన్వీ కపూర్ ని లాక్ చేసుకుని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
రషా తదాని వెనుక కొన్ని ఆసక్తికరమైన సంగతులున్నాయి. ఈమె బాలీవుడ్ సీనియర్ నటి రవీనాటాండన్ కూతురు. 1993 బంగారు బుల్లోడులో బాలకృష్ణ సరసన రమ్యకృష్ణతో పాటు మెయిన్ హీరోయిన్ గా నటించింది. అది పెద్ద హిట్టయినా తెలుగులో కొనసాగకుండా బాలీవుడ్ అవకాశాల వైపే మొగ్గు చూపింది. కొంత గ్యాప్ తీసుకుని నాగార్జున ఆకాశవీధిలో నటించినా అది డిజాస్టర్ కావడంతో మళ్ళీ కనిపించలేదు. మంచు ఫ్యామిలీ తీసిన పాండవులు పాండవులు తుమ్మెద ఆమె కనిపించిన చివరి తెలుగు సినిమా. కన్నడ కెజిఎఫ్ లో ప్రధాన మంత్రిగా మెప్పించింది కూడా ఈమెనే.
ఇంత కనెక్షన్ ఉన్న రవీనాటాండన్ తన కూతురిని సౌత్ లో లాంచ్ చేయడానికి మోక్షజ్ఞ కన్నా గ్రాండ్ ఆప్షన్ వేరే ఉండదు. ఇంకా ఖరారుగా చెప్పలేదు కాబట్టి అధికారిక ప్రకటన వచ్చేదాకా వేచి చూడాల్సిందే. నవంబర్ లేదా ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెట్టే ప్లాన్ లో ఉన్న ప్రశాంత్ వర్మ ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. ఆయన సినిమాటిక్ యునివర్స్ తో సంబంధం లేని ఇండిపెండెంట్ మూవీగా ఇది ఉంటుందని సమాచారం. ఒకవేళ రషా తదాని కనక ఓకే కాకపోతే తర్వాత ఎవరున్నారో ఇంకా లీక్ కాలేదు. చాలా పెద్ద బడ్జెట్ తో రూపొందనున్న మోక్షజ్ఞ డెబ్యూ 2026లో విడుదల కావొచ్చని టాక్.
This post was last modified on October 13, 2024 9:52 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…