నందమూరి అభిమానులు ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ తెరంగేట్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ ద్వారా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఫస్ట్ లుక్ పోస్టర్ తో శుభవార్తను పంచుకున్నారు. టైటిల్ పెట్టడం, రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లడం ఇంకా జరగలేదు కానీ క్యాస్టింగ్ కు సంబంధించిన పనులు జరిగిపోతున్నాయి. హీరోయిన్ గా రషా తదాని పేరుని పరిశీలిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. గతంలో ఈమెను రామ్ చరణ్ 16 కోసం ట్రై చేసి ఫోటో షూట్ చేసినట్టు వార్త వచ్చింది కానీ తర్వాత ఏమైందో బయటికి రాలేదు. ఫైనల్ గా జాన్వీ కపూర్ ని లాక్ చేసుకుని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
రషా తదాని వెనుక కొన్ని ఆసక్తికరమైన సంగతులున్నాయి. ఈమె బాలీవుడ్ సీనియర్ నటి రవీనాటాండన్ కూతురు. 1993 బంగారు బుల్లోడులో బాలకృష్ణ సరసన రమ్యకృష్ణతో పాటు మెయిన్ హీరోయిన్ గా నటించింది. అది పెద్ద హిట్టయినా తెలుగులో కొనసాగకుండా బాలీవుడ్ అవకాశాల వైపే మొగ్గు చూపింది. కొంత గ్యాప్ తీసుకుని నాగార్జున ఆకాశవీధిలో నటించినా అది డిజాస్టర్ కావడంతో మళ్ళీ కనిపించలేదు. మంచు ఫ్యామిలీ తీసిన పాండవులు పాండవులు తుమ్మెద ఆమె కనిపించిన చివరి తెలుగు సినిమా. కన్నడ కెజిఎఫ్ లో ప్రధాన మంత్రిగా మెప్పించింది కూడా ఈమెనే.
ఇంత కనెక్షన్ ఉన్న రవీనాటాండన్ తన కూతురిని సౌత్ లో లాంచ్ చేయడానికి మోక్షజ్ఞ కన్నా గ్రాండ్ ఆప్షన్ వేరే ఉండదు. ఇంకా ఖరారుగా చెప్పలేదు కాబట్టి అధికారిక ప్రకటన వచ్చేదాకా వేచి చూడాల్సిందే. నవంబర్ లేదా ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెట్టే ప్లాన్ లో ఉన్న ప్రశాంత్ వర్మ ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. ఆయన సినిమాటిక్ యునివర్స్ తో సంబంధం లేని ఇండిపెండెంట్ మూవీగా ఇది ఉంటుందని సమాచారం. ఒకవేళ రషా తదాని కనక ఓకే కాకపోతే తర్వాత ఎవరున్నారో ఇంకా లీక్ కాలేదు. చాలా పెద్ద బడ్జెట్ తో రూపొందనున్న మోక్షజ్ఞ డెబ్యూ 2026లో విడుదల కావొచ్చని టాక్.
This post was last modified on October 13, 2024 9:52 am
మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…
టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…
వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భాగంగా ఇటీవల కాలంలో `రప్పా-రప్పా` డైలాగులు తరచుగా వినిపించేవి. రప్పా-రప్పా అని రాసున్న బ్యానర్లు,…
వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…
పురాణ గాథలను తెరకెక్కించేటపుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విషయం…
వైసీపీ అధినేత జగన్ తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను ఆయన పరామర్శించారు. తొలుత…