నందమూరి అభిమానులు ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ తెరంగేట్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ ద్వారా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఫస్ట్ లుక్ పోస్టర్ తో శుభవార్తను పంచుకున్నారు. టైటిల్ పెట్టడం, రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లడం ఇంకా జరగలేదు కానీ క్యాస్టింగ్ కు సంబంధించిన పనులు జరిగిపోతున్నాయి. హీరోయిన్ గా రషా తదాని పేరుని పరిశీలిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. గతంలో ఈమెను రామ్ చరణ్ 16 కోసం ట్రై చేసి ఫోటో షూట్ చేసినట్టు వార్త వచ్చింది కానీ తర్వాత ఏమైందో బయటికి రాలేదు. ఫైనల్ గా జాన్వీ కపూర్ ని లాక్ చేసుకుని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
రషా తదాని వెనుక కొన్ని ఆసక్తికరమైన సంగతులున్నాయి. ఈమె బాలీవుడ్ సీనియర్ నటి రవీనాటాండన్ కూతురు. 1993 బంగారు బుల్లోడులో బాలకృష్ణ సరసన రమ్యకృష్ణతో పాటు మెయిన్ హీరోయిన్ గా నటించింది. అది పెద్ద హిట్టయినా తెలుగులో కొనసాగకుండా బాలీవుడ్ అవకాశాల వైపే మొగ్గు చూపింది. కొంత గ్యాప్ తీసుకుని నాగార్జున ఆకాశవీధిలో నటించినా అది డిజాస్టర్ కావడంతో మళ్ళీ కనిపించలేదు. మంచు ఫ్యామిలీ తీసిన పాండవులు పాండవులు తుమ్మెద ఆమె కనిపించిన చివరి తెలుగు సినిమా. కన్నడ కెజిఎఫ్ లో ప్రధాన మంత్రిగా మెప్పించింది కూడా ఈమెనే.
ఇంత కనెక్షన్ ఉన్న రవీనాటాండన్ తన కూతురిని సౌత్ లో లాంచ్ చేయడానికి మోక్షజ్ఞ కన్నా గ్రాండ్ ఆప్షన్ వేరే ఉండదు. ఇంకా ఖరారుగా చెప్పలేదు కాబట్టి అధికారిక ప్రకటన వచ్చేదాకా వేచి చూడాల్సిందే. నవంబర్ లేదా ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెట్టే ప్లాన్ లో ఉన్న ప్రశాంత్ వర్మ ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. ఆయన సినిమాటిక్ యునివర్స్ తో సంబంధం లేని ఇండిపెండెంట్ మూవీగా ఇది ఉంటుందని సమాచారం. ఒకవేళ రషా తదాని కనక ఓకే కాకపోతే తర్వాత ఎవరున్నారో ఇంకా లీక్ కాలేదు. చాలా పెద్ద బడ్జెట్ తో రూపొందనున్న మోక్షజ్ఞ డెబ్యూ 2026లో విడుదల కావొచ్చని టాక్.
This post was last modified on October 13, 2024 9:52 am
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…