Movie News

సగం థియేటర్లతో లాభం కాదు నష్టం!

అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లను తెరుచుకోవచ్చునని, యాభై శాతం సీట్లు మాత్రమే నిండేలా చూసుకుని సినిమాలు ప్రదర్శించుకోవచ్చునని గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. గుడ్డి కంటే మెల్ల నయం అని కొందరు ఆనందిస్తున్నారు కానీ ప్రాక్టికల్ గా ఆలోచించే నిర్మాతలు మాత్రం ఇది లాభదాయకం కాదని, పూర్తి కెపాసిటీ అమ్మే పర్మిషన్ వచ్చే వరకు వేచి చూడడం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు.

సగం టిక్కెట్లు మాత్రమే అమ్మడానికి టికెట్ ధర డబుల్ చెయ్యాలి. కానీ ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వలేదు. మునుపటి రేట్లు పెట్టి సగం థియేటర్ మాత్రం నిండితే హౌస్ ఫుల్ అంటే థియేటర్ రెంట్స్ మాట ఏమిటి? ఇన్ని నెలల లాక్ డౌన్ వల్ల సినిమా థియేటర్స్ బిజినెస్ దారుణంగా దెబ్బ తినేసింది. ఇప్పుడు వాళ్ళు రెంట్లు తగ్గించుకునే అవకాశమే లేదు. అలా అడగడం భావ్యం కాదు కూడా. అంటే ఫుల్ రెంట్ చెల్లించి సగం గ్రాస్ కలెక్షన్ మాత్రమే వస్తే నిర్మాత, బయ్యర్ మాట ఏమిటి? దీని వల్ల డిస్ట్రిబ్యూటర్స్ కూడా మొత్తం కాకుండా సగం రేట్ ఇస్తామని అంటారు.

అంతా చేసి సినిమా రిలీజ్ చేసినా ఆ సగం థియేటర్లు అయినా నిండుతాయా లేదా అనేది అనుమానమే. అందుకే ఈ గోల అంతా దేనికని ఓటిటి రిలీజ్ కే నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. ఈలోగా ఓటిటి ద్వారా విడుదలైన సినిమాలను థియేటర్లలో ప్రదర్శించి స్పందన ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారు. సంక్రాంతి నాటికి పరిస్థితి మామూలు అవుతుందని, అప్పుడు యథావిధిగా సినిమాలు రిలీజ్ చేయవచ్చునని భావిస్తున్నారు.

This post was last modified on October 1, 2020 10:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖైదీ 2 ఇక ఎప్పటికీ రాదేమో

దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా ఖైదీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకు ముందు…

3 hours ago

అఖండ తాండవానికి అదొక్కటే సమస్య

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…

5 hours ago

రెహమాన్ మీదే ‘పెద్ది’ బరువు

ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…

5 hours ago

బోరుగడ్డతో వైసీపీకి సంబంధం లేదా?

బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…

5 hours ago

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

7 hours ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

7 hours ago