Movie News

సగం థియేటర్లతో లాభం కాదు నష్టం!

అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లను తెరుచుకోవచ్చునని, యాభై శాతం సీట్లు మాత్రమే నిండేలా చూసుకుని సినిమాలు ప్రదర్శించుకోవచ్చునని గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. గుడ్డి కంటే మెల్ల నయం అని కొందరు ఆనందిస్తున్నారు కానీ ప్రాక్టికల్ గా ఆలోచించే నిర్మాతలు మాత్రం ఇది లాభదాయకం కాదని, పూర్తి కెపాసిటీ అమ్మే పర్మిషన్ వచ్చే వరకు వేచి చూడడం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు.

సగం టిక్కెట్లు మాత్రమే అమ్మడానికి టికెట్ ధర డబుల్ చెయ్యాలి. కానీ ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వలేదు. మునుపటి రేట్లు పెట్టి సగం థియేటర్ మాత్రం నిండితే హౌస్ ఫుల్ అంటే థియేటర్ రెంట్స్ మాట ఏమిటి? ఇన్ని నెలల లాక్ డౌన్ వల్ల సినిమా థియేటర్స్ బిజినెస్ దారుణంగా దెబ్బ తినేసింది. ఇప్పుడు వాళ్ళు రెంట్లు తగ్గించుకునే అవకాశమే లేదు. అలా అడగడం భావ్యం కాదు కూడా. అంటే ఫుల్ రెంట్ చెల్లించి సగం గ్రాస్ కలెక్షన్ మాత్రమే వస్తే నిర్మాత, బయ్యర్ మాట ఏమిటి? దీని వల్ల డిస్ట్రిబ్యూటర్స్ కూడా మొత్తం కాకుండా సగం రేట్ ఇస్తామని అంటారు.

అంతా చేసి సినిమా రిలీజ్ చేసినా ఆ సగం థియేటర్లు అయినా నిండుతాయా లేదా అనేది అనుమానమే. అందుకే ఈ గోల అంతా దేనికని ఓటిటి రిలీజ్ కే నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. ఈలోగా ఓటిటి ద్వారా విడుదలైన సినిమాలను థియేటర్లలో ప్రదర్శించి స్పందన ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారు. సంక్రాంతి నాటికి పరిస్థితి మామూలు అవుతుందని, అప్పుడు యథావిధిగా సినిమాలు రిలీజ్ చేయవచ్చునని భావిస్తున్నారు.

This post was last modified on October 1, 2020 10:39 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని ఆగుతున్నాం: బొత్స

ఏపీ అధికార పార్టీ వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని…

3 hours ago

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

12 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

13 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

14 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

15 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

15 hours ago