అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లను తెరుచుకోవచ్చునని, యాభై శాతం సీట్లు మాత్రమే నిండేలా చూసుకుని సినిమాలు ప్రదర్శించుకోవచ్చునని గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. గుడ్డి కంటే మెల్ల నయం అని కొందరు ఆనందిస్తున్నారు కానీ ప్రాక్టికల్ గా ఆలోచించే నిర్మాతలు మాత్రం ఇది లాభదాయకం కాదని, పూర్తి కెపాసిటీ అమ్మే పర్మిషన్ వచ్చే వరకు వేచి చూడడం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు.
సగం టిక్కెట్లు మాత్రమే అమ్మడానికి టికెట్ ధర డబుల్ చెయ్యాలి. కానీ ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వలేదు. మునుపటి రేట్లు పెట్టి సగం థియేటర్ మాత్రం నిండితే హౌస్ ఫుల్ అంటే థియేటర్ రెంట్స్ మాట ఏమిటి? ఇన్ని నెలల లాక్ డౌన్ వల్ల సినిమా థియేటర్స్ బిజినెస్ దారుణంగా దెబ్బ తినేసింది. ఇప్పుడు వాళ్ళు రెంట్లు తగ్గించుకునే అవకాశమే లేదు. అలా అడగడం భావ్యం కాదు కూడా. అంటే ఫుల్ రెంట్ చెల్లించి సగం గ్రాస్ కలెక్షన్ మాత్రమే వస్తే నిర్మాత, బయ్యర్ మాట ఏమిటి? దీని వల్ల డిస్ట్రిబ్యూటర్స్ కూడా మొత్తం కాకుండా సగం రేట్ ఇస్తామని అంటారు.
అంతా చేసి సినిమా రిలీజ్ చేసినా ఆ సగం థియేటర్లు అయినా నిండుతాయా లేదా అనేది అనుమానమే. అందుకే ఈ గోల అంతా దేనికని ఓటిటి రిలీజ్ కే నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. ఈలోగా ఓటిటి ద్వారా విడుదలైన సినిమాలను థియేటర్లలో ప్రదర్శించి స్పందన ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారు. సంక్రాంతి నాటికి పరిస్థితి మామూలు అవుతుందని, అప్పుడు యథావిధిగా సినిమాలు రిలీజ్ చేయవచ్చునని భావిస్తున్నారు.
This post was last modified on October 1, 2020 10:39 am
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…