ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సమంతా విచ్చేసింది. దగ్గుబాటి రానా నాలుగు మంచి మాటలు చెప్పాడు. త్రివిక్రమ్ అండగా నిలబడి స్పీచ్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ హీరోయిన్ గా టాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకున్న అలియా భట్ ప్రధాన పాత్ర. ఒక సినిమాకు కనీస బజ్ రావడానికి ఈ మాత్రం అంశాలు సరిపోతాయి. అందుకే జిగ్రాని తెలుగులో డబ్బింగ్ చేసి మరో అయిదు సినిమాల మధ్య పోటీలో దసరాకు విడుదల చేశారు. సరే కంటెంట్ బాగుంటే భాషను మన ప్రేక్షకులు అంత సీరియస్ గా పట్టించుకోరు కాబట్టి ఆ ధైర్యంతోనే నిర్మాతలు జిగ్రాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. అయితే జరిగింది వేరు.
ఇది 1993లో వచ్చిన శ్రీదేవి – సంజయ్ దత్ ‘గుంరా’ అనే పాత చిత్రం నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ. తమ్ముడు అంకుర్ (వేదాంగ్ రైనా)ని ప్రాణంగా చూసుకునే అక్క సత్యభామ (అలియా భట్). ఉన్నత చదువుల కోసం మలేషియా వెళ్లిన అంకుర్ తన బంధువుతో పాటు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడు. అక్కడి ప్రభుత్వం మరణ శిక్ష విదిస్తుంది. తోడబుట్టినవాడిని రక్షించుకునే లక్ష్యంతో సత్య అక్కడికి వెళ్లి స్థానికంగా ఉండే ముత్తు (రాహుల్ రవీంద్రన్) లాంటి వాళ్ళ సహాయం తీసుకుంటుంది. జీవితాన్ని పణంగా పెట్టిన సత్య చివరికి అంకుర్ ని ఎలా కాపాడుకుంది, ఇండియాకు ఎలా తీసుకొచ్చిందనేది కథ.
స్టోరీ ఎలా ఉందనేది పక్కనపెడితే ఇటు ఎమోషన్స్, అటు యాక్షన్ రెండింటిని బ్యాలన్స్ చేయడం దర్శకుడు వాసన్ బాలా పడిన తడబాటు జిగ్రాని భరించలేని ప్రహసనంగా మార్చాయి. పేలవమైన కథా కథనాలను అలియా భట్ పెర్ఫార్మన్స్ కాపాడలేకపోయింది. గ్రిప్పింగ్ గా అనిపించే ఎపిసోడ్స్ లేకపోవడం ప్రధాన లోపం. అక్కా తమ్ముడి బాండింగ్ ని సైతం సరిగా రిజిస్టర్ చేయలేదు. సాంకేతిక పనితనం అండగా నిలబడ్డా రైటింగ్ చాలా బలహీనంగా ఉండటంతో కోట్ల రూపాయల బడ్జెట్ కు న్యాయం జరగలేదు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకపోయినా షో అయ్యాక అలియా తూనే క్యా కియా అనకుండా ఉండలేం.
This post was last modified on October 12, 2024 4:22 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…