మనం ‘పేరు’ కానిది, ఓ అచ్చ తెలుగు టైటిల్ పెట్టి.. దాన్ని అదే పేరుతో తమిళంలో రిలీజ్ చేస్తే అక్కడి వాళ్లు ఊరుకుంటారా? కనీసం ఆ సినిమాను వాళ్లు పట్టించుకుంటారా? కానీ మన వాళ్లు మాత్రం ‘సింగం-2’, ‘సింగం-3’ అని తమిళ పేర్లు పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తే విరగబడి చూసేశాం. అదైనా పర్వాలేదు కానీ.. ‘వలిమై’ అని అసలు అర్థమేంటో తెలియని తమిళ పదాన్ని టైటిల్గా పెట్టి రిలీజ్ చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.
ఇంకేముంది? తెలుగు వాళ్లు దేన్నయినా తేలిగ్గా తీసుకుంటారు.. మనం ఎలాంటి పేర్లు పెట్టినా పర్వాలేదు అనే ఉదాసీన ధోరణి వచ్చేసింది తమిళ నిర్మాతల్లో. వరుసగా పొన్నియన్ సెల్వన్, రాయన్, వేట్టయాన్ అంటూ తమిళ పేర్లే పెట్టి సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. కనీసం వీటిని తెలుగులో రిలీజ్ చేస్తున్న తెలుగు నిర్మాతలైనా తెలుగు పేర్లు పెడదాం అనే ప్రయత్నం కూడా చేయట్లేదు. తెలుగు డబ్బింగ్ కోసం పెడుతున్న శ్రద్ధలో పేరు మార్చడం మీద పెట్టకపోవడం విచారకరం.
ఒకప్పుడు రజినీకాంత్ సినిమాలంటే తెలుగు డబ్బింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ ఉండేది. కానీ ఇప్పుడు ఆయన సినిమాను కూడా తమిళ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. కానీ దీని గురించి ప్రశ్నించే వాళ్లు కరవయ్యారు. ఎట్టకేలకు రచయిత అబ్బూరి రవి ఈ సినిమా పేరు పెట్టకుండా.. తమిళ టైటిళ్లు పెట్టి తెలుగులో రిలీజ్ చేస్తుండడంపై ఓ పోస్టు పెట్టి మన జనాల్లో కదలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ ఆయన గోడును పట్టించుకునేదెవరు? చిన్న చిన్న విషయాలకు ట్రెండ్స్ చేస్తే నెటిజన్లు.. ఇలాంటి విషయాలకు ఎందుకు హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేయరు.. ఇలా తమిళ టైటిళ్లు పెట్టి రిలీజ్ చేస్తే చూడం అంటూ బాయ్కాట్ ఎందుకు చేయరు అన్నది ప్రశ్నార్థకం. ఇలా మన వాళ్లు లైట్ తీసుకుంటూ పోతే.. రేప్పొద్దున తమిళ పేర్లను తెలుగు లిపిలో కూడా రాయడం ఆపేసి తమిళంలోనే వేస్తారేమో?
This post was last modified on October 11, 2024 3:07 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…