ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రెండు వారాలు దాటితే బాగా నెమ్మదించిపోతుంది. కానీ దేవరకు మాత్రం బ్లాక్ బస్టర్ దక్కిన ఆనందంతో పాటు అదృష్టం కూడా కలిసివస్తోంది. కీలకమైన దసరా పండక్కు ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు కొత్త రిలీజులు ఉన్నా దేవరకు మంచి థియేటర్ కౌంట్ కొనసాగుతోంది. కారణం కలెక్షన్లు స్టడీగా ఉండటమే. అయిదు వందల కోట్ల గ్రాస్ కు అతి దగ్గరగా ఉన్న ఈ మాస్ బొమ్మకు ఈ వీకెండ్ మరో అవకాశాన్ని సృష్టిస్తోంది. కొత్త సినిమాల్లో టయర్ 1 స్టార్లు ఉన్నవి ఏవీ లేకపోవడంతో ఇప్పటిదాకా థియేటర్లో చూడని వాళ్ళకు దేవర ఫస్ట్ ఆప్షన్ అవుతోంది.
వేట్టయన్ తీర్పు దాదాపు వచ్చినట్టే. ఫ్లాప్ మాట వినిపించలేదు కానీ జైలర్ స్థాయిలో మేజిక్ చేయదని అర్థమైపోయింది. మా నాన్న సూపర్ హీరో గురించి వస్తున్న ఎమోషనల్ రిపోర్ట్స్ కుటుంబ ప్రేక్షకులను ఏ మేరకు రప్పిస్తాయో చూడాలి. ఎంటర్ టైన్మెంట్ ని నమ్ముకున్న జనక అయితే గనక ఫలితం రేపు వస్తుంది. గోపీచంద్ విశ్వం కు డీసెంట్ రివ్యూస్ వినిపిస్తున్నాయి. శ్రీను వైట్ల కంబ్యాక్ అవుతారా లేదానేది వేచి చూడాలి. ఇక మార్టిన్ కు ఏవో ఆర్థిక కారణాల వల్ల చాలా చోట్ల ఉదయం షోలు పడలేదు. ఇంత భారీ చిత్రానికి అసలే బజ్ లేదు. దానికి తోడు ఇలాంటి అడ్డంకులు ఉన్న ఆసక్తిని తగ్గిస్తాయి.
అలియా భట్ జిగ్రాను ఇప్పటికైతే జనాలు పెద్దగా పట్టించుకోలేదుమల్టీ . మల్టీప్లెక్సుల్లో హిందీ వెర్షన్ కు డిమాండ్ ఉంది. ఇవన్నీ గమనిస్తే దేవరకు ఇంకో వారాంతం దున్నేసే ఛాన్స్ దొరికినట్టే. ప్రస్తుతానికి టీమ్ ప్రమోషన్లు ఆపేసింది కానీ ఇప్పటికే పబ్లిక్ లోకి వెళ్ళిపోయిన టాక్ తో పాటు ఓటిటి స్ట్రీమింగ్ యాభై రోజుల తర్వాతే ఉంటుందనే వార్త కలెక్షన్లకు దోహదపడుతోంది. మెయిన్ సెంటర్స్ లో శని ఆదివారాలు హౌస్ ఫుల్స్ పడటం ఖాయం. నైజాం, సీడెడ్ లో దేవర స్ట్రాంగ్ గా ఉంది. పండగ సందర్భంగా పదిహేనో రోజు అనంతపురం లాంటి చోట్ల ఉదయం ఎనిమిది గంటలకు స్పెషల్ షోలు వేస్తున్నారు.
This post was last modified on October 11, 2024 1:43 pm
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…