భారతీయ వ్యాపార దిగ్గజం రతన్ టాటా కన్నుమూత కోట్లాది ప్రజలను కలవరపరిచింది. మన దేశానికి పారిశ్రామిక విప్లవం రావడంలో కీలక పాత్ర పోషించిన ఈ బిజినెస్ టైకూన్ తన ఎనభై ఆరు సంవత్సరాల జీవితంలో అధిక శాతం సమాజం కోసమే ఆలోచించి వస్తువులు తయారు చేశారు తప్పించి లాభాల కోసమో కోట్ల రూపాయల సంపద కోసమో కాదు.
అందుకే అత్యున్నత పురస్కారాలు ఎన్ని దక్కినా, కాలు కింద పెట్టకుండా సర్వ భోగాలు అనుభవించే తాహతు ఉన్నా ఎప్పుడూ సామాన్యుడిగా ఉండేందుకు తపించారు తప్ప ఏనాడూ ఆర్భాటాలకు వెళ్లని గొప్ప చరిత్ర ఆయనది. ఇలాంటి మహా వ్యక్తి గురించి ఇప్పటి తరానికి చెప్పాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. దానికి సరైన మాధ్యమం సినిమా. రతన్ టాటా బయోపిక్ ని తెరమీద తీసుకురాగలిగితే ఎన్నో తరాలకు అదో గొప్ప రిఫరెన్స్ గా నిలిచిపోతుంది.
గతంలో ధీరూభాయ్ అంబానీ లైఫ్ ని మణిరత్నం గురు పేరుతో మూడు గంటల్లో చెప్పే ప్రయత్నం చేశారు. పేరు వచ్చింది కానీ ఆశించిన గొప్ప స్థాయిలో విజయవంతం కాలేదు. అయినా గురు వన్ అఫ్ ది బెస్ట్ వర్క్స్ అఫ్ మణి అంటారు విమర్శకులు. అదే తరహాలో రతన్ టాటాని కూడా స్క్రీన్ మీద చూపించేందుకు ఎవరైనా దర్శక నిర్మాతలు ముందుకు రావాలి. కొన్నేళ్ల క్రితం ఆర్ మాధవన్ లేదా అభిషేక్ బచ్చన్ లతో రతన్ టాటా బయోపిక్ ని సుధా కొంగర తీసే ప్రయత్నంలో ఉన్నారనే టాక్ వచ్చింది కానీ తర్వాత ఆ వార్తను ఆవిడ కొట్టిపారేశారు.
సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా పూనుకోవాలి. అది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో జరగాలి. ఇప్పటిదాకా లెక్కలేనన్ని బయోపిక్కులు ఎన్ని వచ్చినా ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయింది గాంధీ ఒక్కటే. మళ్ళీ అదే స్థాయిలో రతన్ టాటా గురించి చెప్పగలిగితే అంతకన్నా గర్వకారణం ఎవరికైనా ఏముంటుంది. ఇప్పుడే ఎక్కువ చర్చించుకోవడం తొందరపాటు అవుతుంది కానీ ఇంకొంత కాలం వేచి చూడాలి.
This post was last modified on October 10, 2024 7:13 pm
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…