రెండేళ్ల కిందటి నుంచి తెలుగులో రీ రిలీజ్ల హంగామా నడుస్తోంది. మధ్యలో కొంచెం జోరు తగ్గినట్లు అనిపించినా.. ఈ మధ్య మళ్లీ ఊపు కనిపిస్తోంది. ఆగస్టులో మహేష్ బాబు మూవీ ‘మురారి’, సెప్టెంబరులో పవన్ కళ్యాణ్ సినిమా ‘గబ్బర్ సింగ్’ మోత మోగించేశాయి. కొంచెం గ్యాప్ తర్వాత మరో రీ రిలీజ్ విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తోంది. అదేమీ పెద్ద స్టార్ హీరో సినిమా కాదు. అయినా క్రేజ్ బాగానే ఉంది. ఆ మూవీనే ‘ఖడ్గం’.
కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రమిది. తెలుగులో వచ్చిన దేశభక్తి చిత్రాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్గా దీన్ని చెప్పొచ్చు. రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ట్రెండీగా అనిపించే సినిమా ఇది. దీన్ని గత నెలలోనే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఈ నెల 18న రీ రిలీజ్కు ముహూర్తం కుదిరింది. ఇందుకోసం కృష్ణవంశీ దగ్గరుండి రీ ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారు.
అంతే కాక ‘ఖడ్గం’ రీ రిలీజ్ను పురస్కరించుకుని కృష్ణవంశీ, శ్రీకాంత్ తదితరులు కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఈ చిత్రంలో అసలు తాను నటించాల్సింది కాదన్నాడు. ప్రధాన పాత్రకు తాను వద్దంటూ నిర్మాత మధుమురళి చెప్పినట్లు తెలిపాడు. తన స్టానంలో ఇంకా పెద్ద స్టార్ను తీసుకోవాలన్నది ఆయన అభిప్రాయమని.. కానీ కృష్ణవంశీ మాత్రం ఆ పాత్రకు తనే పర్ఫెక్ట్ అని పట్టుబట్టి ఈ సినిమా చేయించినట్లు తెలిపాడు.
చాలామంది ఇప్పటికీ ‘ఖడ్గం’ లాంటి సినిమా చేయమని అడుగుతుంటారని.. కానీ ‘ఖడ్గం’ ఒక మాస్టర్ పీస్ అని.. ఇలాంటి సినిమాను రీక్రియేట్ చేయడం సాధ్యం కాదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ఎన్ని తరాలు మారినా దేశభక్తి చిత్రాల్లో ‘ఖడ్గం’ మిన్నగా ఉంటుందని.. టీవీల్లో ఎన్నిసార్లు చూసినా తాజాగా అనిపిస్తుందని.. ఇలాంటి సినిమా మళ్లీ రిలీజ్ అవుతుండడం చాలా ఆనందంగా ఉందని శ్రీకాంత్ చెప్పాడు.
This post was last modified on October 6, 2024 9:46 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…