బాహుబలి రేంజులో కోలీవుడ్ స్థాయిని పెంచుతుందని అక్కడి యావత్ పరిశ్రమ ఆశలు పెట్టుకున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి ఆఖరికి నవంబర్ 14 లాక్ చేసుకున్నారు కానీ దానికైనా ఖచ్చితంగా కట్టుబడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇంత పెద్ద సినిమా వస్తున్నా వరుణ్ తేజ్ మట్కా లాంటివి పోటీకి సిద్ధపడటం చూస్తుంటే సూర్య సినిమాని తక్కువంచనా వేస్తున్నారానే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా దసరా అయిపోగానే భారీ ఎత్తున ప్రమోషన్లకు స్టూడియో గ్రీన్, యువి సంస్థలు ప్లాన్ చేసుకుంటున్నాయి.
ఇదలా ఉంచితే కంగువలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి గతంలో వచ్చిన 24కి కనెక్షన్ ఉంటుందని చెన్నై టాక్. కథ పరంగా కాదు కానీ పాయింట్ విషయంలో సారూప్యత ఉంటుందట.
అంటే వందల సంవత్సరాల వెనుక ఉన్న ఒక అడవి యోధుడు వర్తమానంలోకి వచ్చి ఆధునిక టెక్నాలజీ వాడకంలో ఆరితేరిపోయిన ఒక గూఢచారిని కలుసుకుంటే ఎలా ఉంటుందనే అంశాన్ని దర్శకుడు సిరుతై శివ టచ్ చేశారని అంటున్నారు. 24లో చూపించిన టైం ట్రావెల్ ని కంగువలో ఇంకా విభిన్నంగా వాడుకుని ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా తెరకెక్కించారని అంటున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న కంగువలో దిశా పటాని హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ గా నటించారు. రజనీకాంత్ వేట్టయన్ కోసం అక్టోబర్ 10ని వదులుకున్నారని తొలుత ప్రచారం జరిగింది కానీ వాస్తవానికి పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా బాలన్స్ ఉండటం వల్లే కంగువ బృందం నవంబర్ కి షిఫ్ట్ అయ్యిందని చెన్నై టాక్.
ఈటి తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న సూర్య తన అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారని తెలిసినా క్వాలిటీ కోసం కంగువ ఎంత ఆలస్యమైనా భరిస్తూ వచ్చాడు. దేవర తరహాలోనే కంగువకు రెండో భాగం 2026 లేదా ఆ పై సంవత్సరం వచ్చేలా చూస్తున్నారట.
This post was last modified on October 6, 2024 12:07 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…