Movie News

‘అమర్ అక్బర్ ఆంటోనీ’కి లాభాలా?

శ్రీను వైట్ల కెరీర్‌కు పెద్ద బ్రేక్ వేసిన సినిమా.. అమర్ అక్బర్ ఆంటోనీ. దాని కంటే ముందు ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ చిత్రాలతో డిజాస్టర్లు ఎదుర్కొన్నప్పటికీ.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే వచ్చాడు వైట్ల. కానీ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా వాషౌట్ అయిపోవడంతో ఈ ప్రభావం వైట్ల మీద గట్టిగానే పడింది.

మళ్లీ ఇంకో సినిమా తీసి రిలీజ్ చేయడానికి ఆరేళ్ల సమయం పట్టేసింది. ఇప్పుడాయన గోపీచంద్ హీరోగా ‘విశ్వం’ మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో వైట్ల ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాడు. ఈ సినిమా నిర్మాతలకు లాభాలు అందించినట్లు వైట్ల చెప్పడం విశేషం. ఆ సినిమా తాలూకు ప్రతికూల ప్రభావం మొత్తం తనే ఎదుర్కొన్నట్లు అతనన్నాడు.

‘‘నా సినిమాలు ఒకేలా ఉంటున్నాయని ప్రేక్షకులు మొనాటనీ ఫీలవుతున్న సమయంలో డిఫరెంట్‌గా చేద్దామనుకున్నా. ఒక కన్ఫ్యూజన్లో ఆ సినిమా చేశాను. కొత్తగా ఏదో ట్రై చేశాను. తక్కువ బడ్జెట్లో ఆ సినిమా పూర్తి చేశాను. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. కానీ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ద్వారా నిర్మాతలకు లాభాలు వచ్చాయి.

ఆ సినిమా ఫెయిల్యూర్ ప్రభావం మాత్రం నా మీద పడింది. కేవలం నిర్మాతలను రక్షించడం కోసమే సినిమా తీయకూడదని.. ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని కథ విషయంలో రాజీ పడకుండా సినిమా చేయాలని అప్పుడు నాకర్థమైంది. ఆ తర్వాత అన్నీ చూసుకుని ‘విశ్వం’ చేశాను’’ అని వైట్ల తెలిపాడు.

ఐతే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో నిర్మాతలకు లాభాలు వచ్చాయని వైట్ల చెబుతున్న మాటల్లో ఎంత వరకు నిజముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చిత్రాన్ని అప్పట్లో రూ.40 కోట్ల బడ్జెట్లో మైత్రీ మూవీ మేకర్స్ తీసినట్లు వార్తలొచ్చాయి. సినిమాకు సరిగా బిజినెస్ జరగలేదు. పైగా తొలి రోజే థియేటర్లు వెలవెలబోయాయి. మరి ప్రొడ్యూసర్లకు ఎలా లాభాలు వచ్చాయో?

This post was last modified on October 5, 2024 9:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వంద రోజుల దగ్గరలో కల్కికో సమస్య

వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ తో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడి విడుదలై…

1 hour ago

సూర్య కంగువ….24 కనెక్షన్ ?

బాహుబలి రేంజులో కోలీవుడ్ స్థాయిని పెంచుతుందని అక్కడి యావత్ పరిశ్రమ ఆశలు పెట్టుకున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. ఇప్పటికే…

2 hours ago

శ్రీకాకుళంలో వైసీపీ ధ‌ర్మాన చిచ్చు.. ఎప్ప‌టికి చ‌ల్లారునో.. !

అధికారంలో ఉన్న‌ప్పుడు అంతా నాదే అంటూ.. కొంద‌రు వైసీపీ నేత‌లు చెల‌రేగిపోయారు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు అవ‌కాశం కూడా క‌ల్పించ‌లేదు. బ‌ల‌మైన…

2 hours ago

ష‌ర్మిల పై కేవీపీ గుర్రు..

కేవీపీ రామ‌చంద్రరావు. కాంగ్రెస్ పార్టీ స్టార్‌వార్ట్‌గా ఆయ‌న ప్ర‌సిద్ధి చెందారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డికి అన్నీ తానై 2004-2009…

6 hours ago

సామాన్యుల శాటిస్‌ఫ్యాక్ష‌న్‌.. బాబు స‌రికొత్త ప్లాన్‌.. !

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి నాలుగు మాసాలు పూర్త‌వుతోంది. ఈ నేప‌థ్యంలో `ప్ర‌జా ప్ర‌భుత్వం `పై సామాన్యుల టాక్ ఎలా…

7 hours ago

దర్శన్‌ను రేణుక స్వామి ఆత్మ వెంటాడుతోందట

ప్లాన్ చేసి చేశారో.. లేక క్షణికావేశంలో చేశారో కానీ.. కన్నడ కథానాయకుడు దర్శన్ తన అభిమానే అయిన రేణుక స్వామి…

14 hours ago