Movie News

లోకేష్ కనకరాజ్‌కు కోపమొచ్చింది

తమిళంలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకడు.. లోకేష్ కనకరాజ్. మామూలుగా అతను చాలా కూల్‌గా కనిపిస్తాడు. అలాంటి దర్శకుడికి ఇప్పుడు కోపం వచ్చింది. తన కొత్త చిత్రం ‘కూలీ’కి సంబంధించి ఊహాగానాలు ప్రచారం చేసినందుకు అతను యూట్యూబ్ ఛానెళ్ల మీద మండిపడ్డాడు.

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఐతే ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో భాగంగానే రజినీ ఇబ్బంది పడి ఆసుపత్రి పాలయ్యారని యూట్యూబ్ ఛానెళ్లలో వార్తలు ప్రసారం అయ్యాయి. మామూలుగా ఇలాంటి ఊహాగానాలకు లోకేష్ స్థాయి దర్శకులు స్పందించరు. కానీ అతను మాత్రం ఈ విషయమై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రజినీ తన సమస్యకు చికిత్స చేయించుకోబోతునన్నట్ల చాలా ముందుగానే తమకు చెప్పినట్లు లోకేష్ కనకరాజ్ వెల్లడించాడు. ‘‘రజినీ సర్‌తో మాట్లాడాను. ఆయన బాగానే కోలుకుంటున్నారు. తాను ఓ సమస్యకు చికిత్స తీసుకోబోతున్నట్లు మా టీంకు ఆయన కొన్ని రోజుల ముందే చెప్పారు. కానీ కొందరు యూట్యూబర్లు మాత్రం ‘కూలీ’ షూటింగ్ సందర్భంగా ఆయనకు ఏదో అయినట్లు వార్తలు సృష్టించారు. ఇలాంటి వార్తలు చూస్తే చాలా కోపం వస్తుంది. మా షూటింగ్ కంటే రజినీ సర్ ఆరోగ్యమే మాకు ముఖ్యం. సెట్లో ఆయనకు నిజంగా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే షూటింగ్ ఆపేస్తాం. యూట్యూబ్‌లో ఇష్టం వచ్చినట్లు వార్తలు సృష్టించి జనాలను బాధ పెట్టకండి. ఇలాంటివి ఇక ఆపండి. రజినీ సార్ అక్టోబరు 15 నుంచి మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారు’’ అని ‘కూలీ’ షూట్ అప్‌డేట్ కూడా ఇచ్చాడు లోకేష్ కనకరాజ్.

ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on October 5, 2024 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

1 hour ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

2 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

5 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

5 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

6 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

8 hours ago