Movie News

లోకేష్ కనకరాజ్‌కు కోపమొచ్చింది

తమిళంలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకడు.. లోకేష్ కనకరాజ్. మామూలుగా అతను చాలా కూల్‌గా కనిపిస్తాడు. అలాంటి దర్శకుడికి ఇప్పుడు కోపం వచ్చింది. తన కొత్త చిత్రం ‘కూలీ’కి సంబంధించి ఊహాగానాలు ప్రచారం చేసినందుకు అతను యూట్యూబ్ ఛానెళ్ల మీద మండిపడ్డాడు.

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఐతే ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో భాగంగానే రజినీ ఇబ్బంది పడి ఆసుపత్రి పాలయ్యారని యూట్యూబ్ ఛానెళ్లలో వార్తలు ప్రసారం అయ్యాయి. మామూలుగా ఇలాంటి ఊహాగానాలకు లోకేష్ స్థాయి దర్శకులు స్పందించరు. కానీ అతను మాత్రం ఈ విషయమై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రజినీ తన సమస్యకు చికిత్స చేయించుకోబోతునన్నట్ల చాలా ముందుగానే తమకు చెప్పినట్లు లోకేష్ కనకరాజ్ వెల్లడించాడు. ‘‘రజినీ సర్‌తో మాట్లాడాను. ఆయన బాగానే కోలుకుంటున్నారు. తాను ఓ సమస్యకు చికిత్స తీసుకోబోతున్నట్లు మా టీంకు ఆయన కొన్ని రోజుల ముందే చెప్పారు. కానీ కొందరు యూట్యూబర్లు మాత్రం ‘కూలీ’ షూటింగ్ సందర్భంగా ఆయనకు ఏదో అయినట్లు వార్తలు సృష్టించారు. ఇలాంటి వార్తలు చూస్తే చాలా కోపం వస్తుంది. మా షూటింగ్ కంటే రజినీ సర్ ఆరోగ్యమే మాకు ముఖ్యం. సెట్లో ఆయనకు నిజంగా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే షూటింగ్ ఆపేస్తాం. యూట్యూబ్‌లో ఇష్టం వచ్చినట్లు వార్తలు సృష్టించి జనాలను బాధ పెట్టకండి. ఇలాంటివి ఇక ఆపండి. రజినీ సార్ అక్టోబరు 15 నుంచి మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారు’’ అని ‘కూలీ’ షూట్ అప్‌డేట్ కూడా ఇచ్చాడు లోకేష్ కనకరాజ్.

ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on October 5, 2024 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

1 hour ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

6 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

7 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

8 hours ago