Movie News

కూతురితో రాజేంద్రప్రసాద్ అనుబంధం

చాలా చిన్న వయసులో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి కన్నుమూయడం ఇండస్ట్రీ వర్గాలను, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. కేవలం 38 సంవత్సరాల జీవితం మాత్రమే చూసిన ఒకే ఒక ఆడ నలుసు అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోతే ఆ తండ్రి పడే బాధ ఎవరూ ఓదార్చలేనిది.

సినిమా లాగే వీళ్ళ బంధంలోనూ గుండెని తడి చేసే నాటకీయత ఉండటం విధి లిఖితం. గాయత్రిది ప్రేమ వివాహం. ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో రాజేంద్రప్రసాద్ కొంత కాలం ఆమెతో మాట్లాడ్డం మానేశారు. 2018లో రమేష్ చెప్పాల దర్శకత్వంలో బేవార్స్ సినిమాలో ఆయనో కీలక పాత్ర పోషించారు.

కథ ప్రకారం కూతురు చనిపోతే తల్లి నా చిట్టి తల్లి అంటూ సాగే ఒక విషాద గీతం ఉంటుంది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ హృద్యమైన పాటను యూట్యూబ్ లో 80 మిలియన్లకు పైగా చూశారంటే ఎంతగా శ్రోతలను తాకిందో అర్థం చేసుకోవచ్చు.

బేవార్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ పాటలో నటించాక గాయత్రిని ఇంటికి పిలిపించి నాలుగుసార్లు వినిపించానని, ఇద్దరూ కంటతడి పెట్టుకుని దగ్గరయ్యామని బాగా ఎమోషనల్ అయ్యారు. ఇక అప్పటి నుంచి రెండిళ్ళ మధ్య రాకపోకలు మొదలయ్యాయి. మనసున్న మనుషులు ప్రతి ఒక్కరు వినాలని అప్పట్లో రాజేంద్రుడు పిలుపిచ్చారు.

ఇప్పుడు అంతా సర్దుకున్నాక గాయత్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం రాజేంద్రప్రసాద్ ని హతాశుడిని చేసింది. కేవలం కెమెరా ముందే అంత భావోద్వేగానికి గురైన ఆయన పదేళ్ల వయసులో తల్లి చనిపోయినప్పుడు కూడా ఏడవలేదని, కానీ సినిమాలో కూతురు పోయిందన్నా తట్టుకోలేకపోయారు. అలాంటిది ఇప్పుడు అదే నిజమయ్యింది.

కాకతాళీయంగా బేవార్స్ తీసిన రమేష్ చెప్పాలానే ఇప్పుడు లగ్గం అనే సినిమా తీశారు. అందులోనూ రాజేంద్రప్రసాద్ ఉన్నారు. విదేశాల నుంచి దీని ప్రమోషన్ల కోసమే వచ్చారు. ఎవరికీ రాకూడని కడుపు కోత రాజేంద్రప్రసాద్ అనుభవిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని అభిమానుల ఆకాంక్ష.

This post was last modified on October 5, 2024 12:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

43 minutes ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

4 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

5 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

6 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

6 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

6 hours ago