Movie News

కూతురితో రాజేంద్రప్రసాద్ అనుబంధం

చాలా చిన్న వయసులో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి కన్నుమూయడం ఇండస్ట్రీ వర్గాలను, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. కేవలం 38 సంవత్సరాల జీవితం మాత్రమే చూసిన ఒకే ఒక ఆడ నలుసు అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోతే ఆ తండ్రి పడే బాధ ఎవరూ ఓదార్చలేనిది.

సినిమా లాగే వీళ్ళ బంధంలోనూ గుండెని తడి చేసే నాటకీయత ఉండటం విధి లిఖితం. గాయత్రిది ప్రేమ వివాహం. ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో రాజేంద్రప్రసాద్ కొంత కాలం ఆమెతో మాట్లాడ్డం మానేశారు. 2018లో రమేష్ చెప్పాల దర్శకత్వంలో బేవార్స్ సినిమాలో ఆయనో కీలక పాత్ర పోషించారు.

కథ ప్రకారం కూతురు చనిపోతే తల్లి నా చిట్టి తల్లి అంటూ సాగే ఒక విషాద గీతం ఉంటుంది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ హృద్యమైన పాటను యూట్యూబ్ లో 80 మిలియన్లకు పైగా చూశారంటే ఎంతగా శ్రోతలను తాకిందో అర్థం చేసుకోవచ్చు.

బేవార్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ పాటలో నటించాక గాయత్రిని ఇంటికి పిలిపించి నాలుగుసార్లు వినిపించానని, ఇద్దరూ కంటతడి పెట్టుకుని దగ్గరయ్యామని బాగా ఎమోషనల్ అయ్యారు. ఇక అప్పటి నుంచి రెండిళ్ళ మధ్య రాకపోకలు మొదలయ్యాయి. మనసున్న మనుషులు ప్రతి ఒక్కరు వినాలని అప్పట్లో రాజేంద్రుడు పిలుపిచ్చారు.

ఇప్పుడు అంతా సర్దుకున్నాక గాయత్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం రాజేంద్రప్రసాద్ ని హతాశుడిని చేసింది. కేవలం కెమెరా ముందే అంత భావోద్వేగానికి గురైన ఆయన పదేళ్ల వయసులో తల్లి చనిపోయినప్పుడు కూడా ఏడవలేదని, కానీ సినిమాలో కూతురు పోయిందన్నా తట్టుకోలేకపోయారు. అలాంటిది ఇప్పుడు అదే నిజమయ్యింది.

కాకతాళీయంగా బేవార్స్ తీసిన రమేష్ చెప్పాలానే ఇప్పుడు లగ్గం అనే సినిమా తీశారు. అందులోనూ రాజేంద్రప్రసాద్ ఉన్నారు. విదేశాల నుంచి దీని ప్రమోషన్ల కోసమే వచ్చారు. ఎవరికీ రాకూడని కడుపు కోత రాజేంద్రప్రసాద్ అనుభవిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని అభిమానుల ఆకాంక్ష.

This post was last modified on October 5, 2024 12:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

6 minutes ago

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

53 minutes ago

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…

1 hour ago

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

3 hours ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

3 hours ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

4 hours ago