యానిమల్ సినిమా చాలామంది కెరీర్లను మలుపు తిప్పింది. కానీ ఆ సినిమా వల్ల అత్యధిక ప్రయోజనం పొందింది బాబీ డియోల్ అంటే అతిశయోక్తి కాదు. హీరోగా రణబీర్ కపూర్, దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ భారీ విజయాలందుకుని తమ స్థాయిని ఎంతో పెంచుకున్నారు.
అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రి లాంటి వాళ్ల కెరీర్లకు కూడా ఈ సినిమా మంచి ఊపు తెచ్చింది. కానీ బాబీ డియోల్ పొందిన ప్రయోజనం మాత్రం అనూహ్యం. ఈ సినిమాకు ముందు బాబీని అందరూ మరిచిపోయారు. ఆ పేరుతో ఓ మాజీ హీరో ఉన్న సంగతే గుర్తించడం మానేశారు.
హీరోగా కాకపోయినా క్యారెక్టర్, విలన్ రోల్స్ కూడా ఇచ్చేవాళ్లు కాదు. అలాంటి టైంలో ‘యానిమల్’ మూవీలో సందీప్ రెడ్డి డిజైన్ చేసిన వయొలెంట్ క్యారెక్టర్ను అద్భుత రీతిలో పోషించిన బాబీ.. ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. ఇందులో తన పెర్ఫామెన్స్ స్టాండౌట్గా నిలిచింది. రిలీజ్ తర్వాత ఈ పాత్ర సెన్సేషన్ క్రియేట్ చేసింది.
దీంతో బాబీ కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఇండియాలోనే బిజీయెస్ట్ విలన్లలో ఒకడైపోయాడు బాబీ. ఆల్రెడీ తెలుగులో బాలకృష్ణ-బాబీ సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’లోనూ అతనో ముఖ్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
సూర్య క్రేజీ మూవీ ‘కంగువ’లోనూ బాబీనే విలన్. ఇవి కాక హిందీలో యశ్ రాజ్ ఫిలిమ్స్ వారి ‘ఆల్ఫా’లో విలన్గా ఎంపికయ్యాడు. అనురాగ్ కశ్యప్ కొత్త చిత్రంలోనూ నటిస్తున్నాడు. తాజాగా బాబీ నటించబోయే మరో క్రేజీ మూవీ గురించి అప్డేట్ వచ్చింది.
తమిళంలో టాప్ స్టార్ అయిన విజయ్ చిత్రంలో బాబీ విలన్ పాత్ర చేయబోతున్నాడు. రాజకీయాల్లోకి వెళ్లేముందు విజయ్ చివరగా హీరోగా నటించే చిత్రాన్ని హెచ్.వినోద్ రూపొందించనున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో బాబీ నటిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. బాబీ చేస్తున్నాడంటే అది విలన్ రోలే అయి ఉంటుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుందని చెన్నై వర్గాల సమాచారం.
This post was last modified on October 2, 2024 12:02 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…