యానిమల్ సినిమా చాలామంది కెరీర్లను మలుపు తిప్పింది. కానీ ఆ సినిమా వల్ల అత్యధిక ప్రయోజనం పొందింది బాబీ డియోల్ అంటే అతిశయోక్తి కాదు. హీరోగా రణబీర్ కపూర్, దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ భారీ విజయాలందుకుని తమ స్థాయిని ఎంతో పెంచుకున్నారు.
అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రి లాంటి వాళ్ల కెరీర్లకు కూడా ఈ సినిమా మంచి ఊపు తెచ్చింది. కానీ బాబీ డియోల్ పొందిన ప్రయోజనం మాత్రం అనూహ్యం. ఈ సినిమాకు ముందు బాబీని అందరూ మరిచిపోయారు. ఆ పేరుతో ఓ మాజీ హీరో ఉన్న సంగతే గుర్తించడం మానేశారు.
హీరోగా కాకపోయినా క్యారెక్టర్, విలన్ రోల్స్ కూడా ఇచ్చేవాళ్లు కాదు. అలాంటి టైంలో ‘యానిమల్’ మూవీలో సందీప్ రెడ్డి డిజైన్ చేసిన వయొలెంట్ క్యారెక్టర్ను అద్భుత రీతిలో పోషించిన బాబీ.. ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. ఇందులో తన పెర్ఫామెన్స్ స్టాండౌట్గా నిలిచింది. రిలీజ్ తర్వాత ఈ పాత్ర సెన్సేషన్ క్రియేట్ చేసింది.
దీంతో బాబీ కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఇండియాలోనే బిజీయెస్ట్ విలన్లలో ఒకడైపోయాడు బాబీ. ఆల్రెడీ తెలుగులో బాలకృష్ణ-బాబీ సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’లోనూ అతనో ముఖ్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
సూర్య క్రేజీ మూవీ ‘కంగువ’లోనూ బాబీనే విలన్. ఇవి కాక హిందీలో యశ్ రాజ్ ఫిలిమ్స్ వారి ‘ఆల్ఫా’లో విలన్గా ఎంపికయ్యాడు. అనురాగ్ కశ్యప్ కొత్త చిత్రంలోనూ నటిస్తున్నాడు. తాజాగా బాబీ నటించబోయే మరో క్రేజీ మూవీ గురించి అప్డేట్ వచ్చింది.
తమిళంలో టాప్ స్టార్ అయిన విజయ్ చిత్రంలో బాబీ విలన్ పాత్ర చేయబోతున్నాడు. రాజకీయాల్లోకి వెళ్లేముందు విజయ్ చివరగా హీరోగా నటించే చిత్రాన్ని హెచ్.వినోద్ రూపొందించనున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో బాబీ నటిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. బాబీ చేస్తున్నాడంటే అది విలన్ రోలే అయి ఉంటుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుందని చెన్నై వర్గాల సమాచారం.
This post was last modified on October 2, 2024 12:02 pm
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…