ఈ ఏడాది భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. భారీ అంచనాల మధ్య గత శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ అంత గొప్పగా లేకపోయినా ఈ సినిమాకు రిలీజ్ ముంగిట హైప్ తక్కువగా ఏమీ లేదు.
ఇక రిలీజ్ తర్వాత ట్రైలర్ లాగే సినిమా కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కొరటాల శివ చివరగా తీసిన ‘ఆచార్య’ కంటే చాలా బెటర్ అన్నారే తప్ప.. సినిమా సూపర్ అనే టాక్ ఆడియన్స్ నుంచి వినిపించలేదు. రివ్యూలు కూడా మోడరేట్గా ఉన్నాయి.
అయినా సరే.. తొలి రోజు ఈ సినిమా రూ.150 కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం రేపింది. కానీ తర్వాత ‘దేవర’ పడుతూ లేస్తూ సాగింది. శనివారం వసూళ్లు డ్రాప్ అయ్యాయి. కానీ ఆ రోజు కూడా రాత్రి షోలకు స్పందన బాగుంది. ఆదివారం కూడా సినిమా బాగానే పెర్ఫామ్ చేసింది.
మొత్తంగా మూడు రోజుల్లో కలిపి ‘దేవర’ వరల్డ్ వైడ్ రూ.250 కోట్లకు కాస్త ఎక్కువగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. కానీ టీం మాత్రం అధికారికంగా రూ.300 కోట్ల పోస్టర్ దించేసింది. వాస్తవ వసూళ్లు ఆ స్థాయిలో లేవని తెలుస్తోంది. సినిమాకు హైప్ తేవడం కోసం, అభిమానుల కోసం ఇలా కలెక్షన్లు పెంచి చూపించడం అందరూ చేసేదే. అయినా సరే.. వీకెండ్లో ‘దేవర’ రూ.250 కోట్ల మార్కును టచ్ చేయడం అంటే పెద్ద విషయమే. ఇండియా వరకు వసూళ్లు రూ.200 కోట్లకు చేరువగా ఉన్నాయి. నైజాం గ్రాస్ రూ.55 కోట్ల మేర ఉండగా.. ఆంధ్రా, రాయలసీమ కలిపి గ్రాస్ రూ.90 కోట్ల మేర వచ్చినట్లు సమాచారం.
‘దేవర’ హిందీ వెర్షన్ గ్రాస్ రూ.50 కోట్లకు చేరువగా ఉండడం విశేషం. కర్ణాటకలో కూడా సినిమా బాగా ఆడుతోంది. ఐతే వీకెండ్ పూర్తయిన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. బుధవారం గాంధీ జయంతి సెలవు మాత్రం సినిమాకు బాగానే కలిసి రావచ్చు. రెండో వీకెండ్లో కూడా సినిమా బాగానే ఆడే అవకాశముంది.
This post was last modified on September 30, 2024 3:38 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…