రాజమౌళి సినిమాల స్థాయిని ఎవరూ అందుకోలేరనే అభిప్రాయం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బలంగా ఉంది. జక్కన్న తరహలో భారీ సినిమాలు తీయాలని తీయాలని ప్రయత్నించిన కొందరు దర్శకుడు, నిర్మాతలు గట్టి ఎదురు దెబ్బలు తిన్నారు. ఐతే ‘కల్కి’ మూవీతో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్, ఆయన అల్లుడైన దర్శకుడు నాగ్ అశ్విన్ ఇండియన్ స్క్రీన్ మీద అద్భుతాన్ని ఆవిష్కరించారు.
రాజమౌళి సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో భారీతనం, విజువల్స్, ఎఫెక్ట్స్తో ఈ సినిమా ప్రేక్షకులకు అనిర్వచనీయమైన అనుభూతిని అందించింది. బాక్సాఫీస్ దగ్గర కూడా గొప్ప ఫలితాన్ని అందుకుంది. ఇంత పెద్ద సినిమా తీసి హిట్ కొట్టినా.. రాజమౌళితో సినిమా తీయాలనే కోరిక మాత్రం అలాగే ఉందని అంటున్నాడు అశ్వినీదత్.
“రాజమౌళితో ఇంతకుముందే పని చేశా. ఆయన తొలి చిత్రం ‘స్టూడెంట్ నంబర్ వన్’కు నేను ప్రెజెంటర్ని. అది ఆయన తొలి సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇప్పుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు. ఆయనతో పూర్తి స్థాయి నిర్మాతగా సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. కాకపోతే కుదరడం లేదు. ఇప్పటికీ ఆ ఆశ అలాగే ఉంది” అని దత్ చెప్పారు.
‘కల్కి’ మూవీ వరల్డ్ వైడ్ ఫుల్ రన్లో రూ.1150 కోట్లు వసూలు చేసిందని చెప్పిన అశ్వినీదత్.. తాను బడ్జెట్ విషయంలో టీంకు ఎలాంటి పరిమితులు పెట్టలేదన్నారు. ‘కల్కి-2’ ఇంకా గ్రాండ్గా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రభాస్ వీలును బట్టి నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్తారని చెప్పారు.
This post was last modified on September 29, 2024 9:38 pm
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…
అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. 30 ఏళ్ల కిందట తాను చేసిన శంకు స్థాపన తాలూకు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…