రాజమౌళి సినిమాల స్థాయిని ఎవరూ అందుకోలేరనే అభిప్రాయం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బలంగా ఉంది. జక్కన్న తరహలో భారీ సినిమాలు తీయాలని తీయాలని ప్రయత్నించిన కొందరు దర్శకుడు, నిర్మాతలు గట్టి ఎదురు దెబ్బలు తిన్నారు. ఐతే ‘కల్కి’ మూవీతో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్, ఆయన అల్లుడైన దర్శకుడు నాగ్ అశ్విన్ ఇండియన్ స్క్రీన్ మీద అద్భుతాన్ని ఆవిష్కరించారు.
రాజమౌళి సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో భారీతనం, విజువల్స్, ఎఫెక్ట్స్తో ఈ సినిమా ప్రేక్షకులకు అనిర్వచనీయమైన అనుభూతిని అందించింది. బాక్సాఫీస్ దగ్గర కూడా గొప్ప ఫలితాన్ని అందుకుంది. ఇంత పెద్ద సినిమా తీసి హిట్ కొట్టినా.. రాజమౌళితో సినిమా తీయాలనే కోరిక మాత్రం అలాగే ఉందని అంటున్నాడు అశ్వినీదత్.
“రాజమౌళితో ఇంతకుముందే పని చేశా. ఆయన తొలి చిత్రం ‘స్టూడెంట్ నంబర్ వన్’కు నేను ప్రెజెంటర్ని. అది ఆయన తొలి సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇప్పుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు. ఆయనతో పూర్తి స్థాయి నిర్మాతగా సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. కాకపోతే కుదరడం లేదు. ఇప్పటికీ ఆ ఆశ అలాగే ఉంది” అని దత్ చెప్పారు.
‘కల్కి’ మూవీ వరల్డ్ వైడ్ ఫుల్ రన్లో రూ.1150 కోట్లు వసూలు చేసిందని చెప్పిన అశ్వినీదత్.. తాను బడ్జెట్ విషయంలో టీంకు ఎలాంటి పరిమితులు పెట్టలేదన్నారు. ‘కల్కి-2’ ఇంకా గ్రాండ్గా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రభాస్ వీలును బట్టి నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్తారని చెప్పారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…