రాజమౌళి సినిమాల స్థాయిని ఎవరూ అందుకోలేరనే అభిప్రాయం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బలంగా ఉంది. జక్కన్న తరహలో భారీ సినిమాలు తీయాలని తీయాలని ప్రయత్నించిన కొందరు దర్శకుడు, నిర్మాతలు గట్టి ఎదురు దెబ్బలు తిన్నారు. ఐతే ‘కల్కి’ మూవీతో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్, ఆయన అల్లుడైన దర్శకుడు నాగ్ అశ్విన్ ఇండియన్ స్క్రీన్ మీద అద్భుతాన్ని ఆవిష్కరించారు.
రాజమౌళి సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో భారీతనం, విజువల్స్, ఎఫెక్ట్స్తో ఈ సినిమా ప్రేక్షకులకు అనిర్వచనీయమైన అనుభూతిని అందించింది. బాక్సాఫీస్ దగ్గర కూడా గొప్ప ఫలితాన్ని అందుకుంది. ఇంత పెద్ద సినిమా తీసి హిట్ కొట్టినా.. రాజమౌళితో సినిమా తీయాలనే కోరిక మాత్రం అలాగే ఉందని అంటున్నాడు అశ్వినీదత్.
“రాజమౌళితో ఇంతకుముందే పని చేశా. ఆయన తొలి చిత్రం ‘స్టూడెంట్ నంబర్ వన్’కు నేను ప్రెజెంటర్ని. అది ఆయన తొలి సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇప్పుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు. ఆయనతో పూర్తి స్థాయి నిర్మాతగా సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. కాకపోతే కుదరడం లేదు. ఇప్పటికీ ఆ ఆశ అలాగే ఉంది” అని దత్ చెప్పారు.
‘కల్కి’ మూవీ వరల్డ్ వైడ్ ఫుల్ రన్లో రూ.1150 కోట్లు వసూలు చేసిందని చెప్పిన అశ్వినీదత్.. తాను బడ్జెట్ విషయంలో టీంకు ఎలాంటి పరిమితులు పెట్టలేదన్నారు. ‘కల్కి-2’ ఇంకా గ్రాండ్గా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రభాస్ వీలును బట్టి నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్తారని చెప్పారు.
This post was last modified on September 29, 2024 9:38 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…