‘ఆర్ఆర్ఆర్’ సినిమా జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ను ఎంత పెంచిందో ‘దేవర’ సినిమాతో రుజువవుతూనే ఉంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పెంచుకున్న స్థాయిలో కాకపోయినా.. దేశవ్యాప్తంగా తారక్ క్రేజ్, మార్కెట్ ఎంతో పెరిగిన మాట వాస్తవం.
అంతిమంగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో కానీ.. ఓపెనింగ్స్ వరకు దుమ్ములేపుతోంది ‘దేవర’. మరి ‘ఆర్ఆర్ఆర్’లో మరో హీరో అయిన రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినా ఎంత పెరిగిందో చూడాలని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ ‘ఆచార్య’ చేసినా.. అది అతిథి పాత్ర. పైగా అది బ్యాడ్ మూవీ. కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. సోలో హీరోగా శంకర్ లాంటి లెజెండరీ డైరెక్టర్తో చేసిన ‘గేమ్ చేంజర్’యే చరణ్ సత్తాకు పరీక్షే. కానీ ఈ సినిమా అతడికి మోయలేని భారంగా మారుతుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తయి విడుదలై ఉంటే.. ఫలితం ఎలా ఉన్నా ఇబ్బంది ఉండేది కాదు. కానీ మొదలైన నాలుగేళ్లకు కానీ పూర్తి కావట్లేదు. బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. వడ్డీల భారం మోయలేని స్థాయికి చేరుకుంది.
ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నడూ రాజు సినిమాలకు ఇలా ప్రొడక్షన్ కాస్ట్ చేతులు దాటిపోలేదు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి రానున్న సోలో సినిమా కాబట్టి బిజినెస్ పరంగా ఇబ్బందులే ఉండకూడదు. కానీ మధ్యలో అతిథి పాత్ర చేసిన ‘ఆచార్య’ సినిమా డిజాస్టర్ అయింది.
‘గేమ్ చేంజర్’ ఏమో విపరీతంగా ఆలస్యం కావడం వల్ల దీనిపై హైప్ కొంత తగ్గింది. పైగా శంకర్ చివరి సినిమా ‘ఇండియన్-2’ పెద్ద డిజాస్టర్ కావడంతో దాని తాలూకు నెగెటివ్ ఎఫెక్ట్ కూడా దీని మీద పడింది. బడ్జెట్ అమాంతం పెరిగిపోవడం వల్ల థియేట్రికల్ హక్కులు మరీ ఎక్కువ రేట్లకు అమ్మాలని చూస్తున్నారు. కానీ బయ్యర్ల నుంచి అంత స్పందన లేదు.
నిర్మాత కోరుకున్న మేర బిజినెస్ జరిగినా.. రకరకాల కారణాలతో ముసురుకున్న నెగెటివిటీని అధిగమించి ఈ చిత్రం అంతంత పెద్ద టార్గెట్లను అందుకోగలదా అన్నది సందేహం. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప ‘గేమ్ చేంజర్’ బయ్యర్లతో పాటు నిర్మాతకు సానుకూల ఫలితం తీసుకురావడం కష్టం.
This post was last modified on September 29, 2024 3:12 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…