ఈ మధ్య తరచుగా ఫిలిం సెలబ్రెటీల విడాకుల వార్తలు వింటున్నాం. తాజాగా ఈ జాబితాలోకి జయం రవి కూడా వచ్చాడు. తన భార్యతో 18 ఏళ్ల వైవాహిక బంధానికి అతను తెరదించుతున్నట్లు ప్రకటించాడు. ఐతే తన అనుమతి లేకుండా విడాకుల ప్రకటన చేశాడంటూ రవి మీద ఆర్తి అసంతృప్తి వ్యక్తం చేసింది. తన మాటలు చూస్తే రవితో ఆమె కలిసి ఉండడానికే ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.
ఒకప్పుడు ఈ భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా మాట్లాడారు బహిరంగ వేదికల్లో. కానీ అంత అన్యోన్యంగా ఉన్న జంట విడిపోతోంది అంటే అభిమానులకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఇంతకీ వీరి విడాకులకు దారి తీసిన పరిస్థితులేంటి అనే దాని మీద చర్చ నడుస్తోంది. గాయని కెనీషాతో జయం రవికి శారీరక సంబంధం ఏర్పడిందని.. అదే విడాకులకు కారణమైందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
ఈ ప్రచారంపై జయం రవి ఏమీ స్పందించలేదు కానీ.. కెనీషా మాత్రం రెస్పాండ్ అయింది. తన గురించి జరుగుతున్న ఈ ప్రచారం అబద్ధమని ఆమె స్పష్టం చేసింది. “జయం రవికి నాకు మధ్య శారీరక సంబంధం లేదు. ఇది నిజం. మా మధ్య ఉన్నది కేవలం వ్యాపారపరమైన సంబంధమే. ఆయన నాకు వ్యాపారంలో సపోర్ట్ చేస్తున్నారు. అన్నిటికి మించి జయం రవి నాకు మంచి మిత్రుడు. అందరూ అనుకుంటున్నట్లు జయం రవి విడాకుల నిర్ణయానికి కారణం నేను కాదు. నా పై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. దయచేసి ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు” అని ఓ ఇంటర్వ్యూలో కెనీషా చెప్పింది.
ఆర్తితో విడాకులు తీసుకోవడం అత్యంత బాధాకర నిర్ణయమని.. కానీ అది తమ ఇద్దరి మంచి కోసమే అని రవి అంటున్నాడు. ఆర్తి మాత్రం విడాకులకు అంగీకరించట్లేదని తెలుస్తోంది. ఆమె రవితోనే కలిసి ఉండేలా పెద్దల ద్వారా ప్రయత్నం చేస్తున్నట్లు చెన్నై వర్గాల సమాచారం.
అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…
పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…
ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…
గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13…
రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…
తెలంగాణలో ఓ కీలక నియామకానికి సంబంధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…