ఈ మధ్య తరచుగా ఫిలిం సెలబ్రెటీల విడాకుల వార్తలు వింటున్నాం. తాజాగా ఈ జాబితాలోకి జయం రవి కూడా వచ్చాడు. తన భార్యతో 18 ఏళ్ల వైవాహిక బంధానికి అతను తెరదించుతున్నట్లు ప్రకటించాడు. ఐతే తన అనుమతి లేకుండా విడాకుల ప్రకటన చేశాడంటూ రవి మీద ఆర్తి అసంతృప్తి వ్యక్తం చేసింది. తన మాటలు చూస్తే రవితో ఆమె కలిసి ఉండడానికే ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.
ఒకప్పుడు ఈ భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా మాట్లాడారు బహిరంగ వేదికల్లో. కానీ అంత అన్యోన్యంగా ఉన్న జంట విడిపోతోంది అంటే అభిమానులకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఇంతకీ వీరి విడాకులకు దారి తీసిన పరిస్థితులేంటి అనే దాని మీద చర్చ నడుస్తోంది. గాయని కెనీషాతో జయం రవికి శారీరక సంబంధం ఏర్పడిందని.. అదే విడాకులకు కారణమైందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
ఈ ప్రచారంపై జయం రవి ఏమీ స్పందించలేదు కానీ.. కెనీషా మాత్రం రెస్పాండ్ అయింది. తన గురించి జరుగుతున్న ఈ ప్రచారం అబద్ధమని ఆమె స్పష్టం చేసింది. “జయం రవికి నాకు మధ్య శారీరక సంబంధం లేదు. ఇది నిజం. మా మధ్య ఉన్నది కేవలం వ్యాపారపరమైన సంబంధమే. ఆయన నాకు వ్యాపారంలో సపోర్ట్ చేస్తున్నారు. అన్నిటికి మించి జయం రవి నాకు మంచి మిత్రుడు. అందరూ అనుకుంటున్నట్లు జయం రవి విడాకుల నిర్ణయానికి కారణం నేను కాదు. నా పై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. దయచేసి ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు” అని ఓ ఇంటర్వ్యూలో కెనీషా చెప్పింది.
ఆర్తితో విడాకులు తీసుకోవడం అత్యంత బాధాకర నిర్ణయమని.. కానీ అది తమ ఇద్దరి మంచి కోసమే అని రవి అంటున్నాడు. ఆర్తి మాత్రం విడాకులకు అంగీకరించట్లేదని తెలుస్తోంది. ఆమె రవితోనే కలిసి ఉండేలా పెద్దల ద్వారా ప్రయత్నం చేస్తున్నట్లు చెన్నై వర్గాల సమాచారం.
This post was last modified on September 29, 2024 2:21 pm
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…