ఈ మధ్య తరచుగా ఫిలిం సెలబ్రెటీల విడాకుల వార్తలు వింటున్నాం. తాజాగా ఈ జాబితాలోకి జయం రవి కూడా వచ్చాడు. తన భార్యతో 18 ఏళ్ల వైవాహిక బంధానికి అతను తెరదించుతున్నట్లు ప్రకటించాడు. ఐతే తన అనుమతి లేకుండా విడాకుల ప్రకటన చేశాడంటూ రవి మీద ఆర్తి అసంతృప్తి వ్యక్తం చేసింది. తన మాటలు చూస్తే రవితో ఆమె కలిసి ఉండడానికే ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.
ఒకప్పుడు ఈ భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా మాట్లాడారు బహిరంగ వేదికల్లో. కానీ అంత అన్యోన్యంగా ఉన్న జంట విడిపోతోంది అంటే అభిమానులకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఇంతకీ వీరి విడాకులకు దారి తీసిన పరిస్థితులేంటి అనే దాని మీద చర్చ నడుస్తోంది. గాయని కెనీషాతో జయం రవికి శారీరక సంబంధం ఏర్పడిందని.. అదే విడాకులకు కారణమైందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
ఈ ప్రచారంపై జయం రవి ఏమీ స్పందించలేదు కానీ.. కెనీషా మాత్రం రెస్పాండ్ అయింది. తన గురించి జరుగుతున్న ఈ ప్రచారం అబద్ధమని ఆమె స్పష్టం చేసింది. “జయం రవికి నాకు మధ్య శారీరక సంబంధం లేదు. ఇది నిజం. మా మధ్య ఉన్నది కేవలం వ్యాపారపరమైన సంబంధమే. ఆయన నాకు వ్యాపారంలో సపోర్ట్ చేస్తున్నారు. అన్నిటికి మించి జయం రవి నాకు మంచి మిత్రుడు. అందరూ అనుకుంటున్నట్లు జయం రవి విడాకుల నిర్ణయానికి కారణం నేను కాదు. నా పై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. దయచేసి ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు” అని ఓ ఇంటర్వ్యూలో కెనీషా చెప్పింది.
ఆర్తితో విడాకులు తీసుకోవడం అత్యంత బాధాకర నిర్ణయమని.. కానీ అది తమ ఇద్దరి మంచి కోసమే అని రవి అంటున్నాడు. ఆర్తి మాత్రం విడాకులకు అంగీకరించట్లేదని తెలుస్తోంది. ఆమె రవితోనే కలిసి ఉండేలా పెద్దల ద్వారా ప్రయత్నం చేస్తున్నట్లు చెన్నై వర్గాల సమాచారం.
ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో…
తొలి రోజు పూర్తి చేసుకున్న పెద్ది మొత్తం ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ దాటేసి బలమైన సెకండ్…
అతిలోకసుందరిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీదేవి అంటే ఎప్పటికీ చెక్కుచెదరని పేరు. అలాంటి గొప్ప నటికి…
తెలంగాణకు రావొచ్చు.. పోవచ్చు.. ఇక్కడ నివసించొచ్చు కానీ, మా రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే ఊరు కునేది లేదంటూ.. పెద్ద…
గ్రాండ్ ఓల్ద్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ షర్మిలకు ఝలక్ ఇచ్చింది. షర్మిలను రాజ్యసభకు పంపనున్నట్లు బలమైన వార్తలు వచ్చాక కూడా…
ఏపీలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన తీర ప్రాంతం(బీచ్) ఏపీలో…