Movie News

సినిమా చరిత్ర తిరగరాసి.. మూడేళ్ళయ్యింది

వందేళ్ల తర్వాత కూడా తెలుగు సినిమా గురించి చెప్పాలంటే… ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’ తర్వాత అని విడమర్చి చెప్పాల్సి ఉంటుందేమో. అంతలా తెలుగు సినిమాపైనే కాదు, ఇండియన్ సినిమాపై తన ప్రభావం చూపింది ఈ టాలీవుడ్ వండర్.

రాజమౌళి మూడేళ్ల పాటు చెక్కిన ‘బాహుబలి 2-ది కంక్లూజన్’ సినిమా విడుదలై, నేటికి మూడేళ్లు పూర్తయ్యింది. ‘డార్లింగ్’ ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క శెట్టి, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కనివినీ ఎరుగని రికార్డులెన్నో తిరగరాసింది.

హాలీవుడ్ మూవీస్‌కి మాత్రమే సాధ్యమనుకున్న చిత్రవిచిత్రాలన్నో భారతీయులకు తొలిసారి రుచి చూపించింది. దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘బాహుబలి-2’… ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారతీయ సినీ చరిత్రలో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది.

వెయ్యి కోట్ల రూపాయల షేర్ మార్క్ దాటిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన ‘బాహుబలి’… డబ్ అన్ని భాషల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడం మరో రికార్డు.

అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర 22 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టిన బాహుబలి… జపాన్, గల్ఫ్ దేశాల్లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. ఈ మూవీ రికార్డులను కొట్టాలని ఈ మూడేళ్లల్లో చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. అయితే ఎవ్వరూ ‘బాహుబలి’ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు.

‘బాహుబలి 2’ మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ట్విట్టర్‌లో ‘ప్రభాస్’, ‘బాహుబలి’ వరల్డ్‌ వైడ్‌గా ట్రెండింగ్‌లో టాప్‌గా నిలిచాయి. ఇదే రోజు సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్ సాధించిన తెలుగు మూవీ ‘పోకిరి’ కూడా విడుదల కావడంతో ఏప్రిల్ 28 టాలీవుడ్‌కి చాలా స్పెషల్ డేట్‌గా మారింది.

This post was last modified on April 28, 2020 11:58 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago