Movie News

సినిమా చరిత్ర తిరగరాసి.. మూడేళ్ళయ్యింది

వందేళ్ల తర్వాత కూడా తెలుగు సినిమా గురించి చెప్పాలంటే… ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’ తర్వాత అని విడమర్చి చెప్పాల్సి ఉంటుందేమో. అంతలా తెలుగు సినిమాపైనే కాదు, ఇండియన్ సినిమాపై తన ప్రభావం చూపింది ఈ టాలీవుడ్ వండర్.

రాజమౌళి మూడేళ్ల పాటు చెక్కిన ‘బాహుబలి 2-ది కంక్లూజన్’ సినిమా విడుదలై, నేటికి మూడేళ్లు పూర్తయ్యింది. ‘డార్లింగ్’ ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క శెట్టి, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కనివినీ ఎరుగని రికార్డులెన్నో తిరగరాసింది.

హాలీవుడ్ మూవీస్‌కి మాత్రమే సాధ్యమనుకున్న చిత్రవిచిత్రాలన్నో భారతీయులకు తొలిసారి రుచి చూపించింది. దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘బాహుబలి-2’… ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారతీయ సినీ చరిత్రలో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది.

వెయ్యి కోట్ల రూపాయల షేర్ మార్క్ దాటిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన ‘బాహుబలి’… డబ్ అన్ని భాషల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడం మరో రికార్డు.

అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర 22 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టిన బాహుబలి… జపాన్, గల్ఫ్ దేశాల్లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. ఈ మూవీ రికార్డులను కొట్టాలని ఈ మూడేళ్లల్లో చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. అయితే ఎవ్వరూ ‘బాహుబలి’ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు.

‘బాహుబలి 2’ మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ట్విట్టర్‌లో ‘ప్రభాస్’, ‘బాహుబలి’ వరల్డ్‌ వైడ్‌గా ట్రెండింగ్‌లో టాప్‌గా నిలిచాయి. ఇదే రోజు సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్ సాధించిన తెలుగు మూవీ ‘పోకిరి’ కూడా విడుదల కావడంతో ఏప్రిల్ 28 టాలీవుడ్‌కి చాలా స్పెషల్ డేట్‌గా మారింది.

This post was last modified on April 28, 2020 11:58 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

58 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

2 hours ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

3 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

7 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

7 hours ago