దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ లో సెకండ్ హీరోయిన్ గా చేసిన త్రిప్తి డిమ్రి అందులో కనిపించేది ముప్పావు గంటే అయినా రష్మిక మందన్నకు సమానంగా ఇంకా చెప్పాలంటే యూత్ లో అంతకన్నా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. అయితే హఠాత్తుగా వచ్చిన ఈ ఫామ్ నిలబెట్టుకోవడంలో వేస్తున్న తప్పటడుగులు తగిన మూల్యాన్ని చెల్లించేలా చేస్తున్నాయి. ఆ మధ్య బ్యాడ్ న్యూజ్ అనే విచిత్రమైన సినిమాలో నటించిన త్రిప్తి డిమ్రి ఆ పాత్ర మీద వచ్చిన విమర్శలకు జడిసిపోయింది. వెరైటీ పేరుతో గర్భంలో బిడ్డకు తండ్రెవరో కనిపెట్టే ఇద్దరు హీరోల కాన్సెప్ట్ మీద నెగటివిటీ వచ్చింది.
తన కొత్త మూవీ విక్కీ విద్య కా వో వాలా వీడియో త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో సాంగ్ కు కేవలం రెండు రోజుల్లో ఇరవై మిలియన్ల వ్యూస్ వచ్చేశాయి. పాట బ్రహ్మాండంగా ఉందా అంటే అదేం కాదు. మొత్తం నాలుగు నిమిషాలు తన గ్లామర్ షోతో నింపేశాడు దర్శకుడు. పక్కన రాజ్ కుమార్ రావు ఉన్నా సరే మొత్తం త్రిప్తి మీదే ఫోకస్ పెట్టాడు. పోనీ కొరియోగ్రఫీ ఏమైనా బాగుందా అంటే ఇవేం స్టెప్పులు బాబోయ్ అంటున్నారు నెటిజెన్లు. ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో చూస్తున్న న్యూట్రల్ ఆడియన్స్ వెతికి మరీ ఈ యూట్యూబ్ లో పాటను చూస్తున్నారు.
యానిమల్ పార్క్ మొదలవ్వడానికి ఇంకా టైం ఉండటంతో త్రిప్తి డిమ్రి కొత్త కమిట్ మెంట్లు వేగంగా ఇస్తోంది. అందులో భాగంగానే పేరు పెంచేవి కాకుండా డ్యామేజ్ చేసేవి ఎక్కువగా వస్తున్నాయి. భూల్ భులయ్యా 3 మీద బోలెడు ఆశలు పెట్టుకుంది. విద్యా బాలన్, మాధురి దీక్షిత్ తో తెరను పంచుకోవడం ఏమైనా ప్రమోషన్ ఇస్తుందేమో చూడాలి. ధఢక్ 2లోనూ ఆఫర్ కొట్టేసింది. ఈ రెండు క్లిక్ కావడం చాలా అవసరం. సందీప్ వంగా నుంచి సీక్వెల్ కు పిలుపు వచ్చేలోగా ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు చెయాలి కానీ ఇలా తగ్గించుకోకూడదని అభిమానులు కోరుతున్నారు. అయినా వినే సీన్ ఉందా అంటే డౌటే.
This post was last modified on September 26, 2024 5:39 pm
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…