జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందుతున్న దేవర ఇంకో నలభై ఎనిమిది గంటల్లోపే థియేటర్లలో తొలి షో వేయనుంది. ఇప్పటికే అభిమానుల ఉద్వేగం పతాక స్థాయిలో ఉండగా అర్ధరాత్రి ప్రీమియర్లు ఎన్నో సంవత్సరాల తర్వాత ఏపీ తెలంగాణలో పడుతుండటంతో వాటి టికెట్ల కోసం డిమాండ్ మాములుగా లేదు. సుదర్శన్ లాంటి క్రేజీ సింగల్ స్క్రీన్ లో అయిదు వేల రూపాయల ధర పలుకుతుండగా సి సెంటర్లలోనూ వెయ్యికి తక్కువ అమ్మడం లేదని ఆఫ్ లైన్ లో ఫ్యాన్స్ టాక్. తర్వాత నాలుగు గంటల షోకు సైతం ఇదే రేంజ్ లో అమ్మకాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా దేవర రెండో భాగం గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక కీలకమైన క్లూ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను డీకోడ్ చేస్తే అర్థమవుతుంది. దేవర పార్ట్ 1 చివరి ముప్పావు గంట కళ్ళు పక్కకు తిప్పుకోలేనంత కీలక భాగం కాగా ఆఖరి పది నిముషాలు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటుంది. అంటే బాహుబలిని ఎవరు చంపారు అనే ప్రశ్నను రేకెత్తించి దాని ద్వారానే సీక్వెల్ కి మార్కెటింగ్ చేసిన రాజమౌళి తరహాలోనే కొరటాల శివ మతి పోయే స్థాయిలో ట్విస్టుతో పాటు పెద్ద సస్పెన్స్ సృష్టించి పెట్టారట.
షో అయిపోయాక బయటికి వచ్చేటప్పుడు వీలైనంత త్వరగా పార్ట్ 2 చూడాలనిపించే ఎగ్జైట్ మెంట్ కలిగిస్తుందని ఇన్ సైడ్ టాక్. ఇంకో రెండు రోజులు ఆగితే మ్యాటర్ బయటికి వచ్చేస్తుంది కానీ కొరటాల మాత్రం ఊహించనంత యాక్షన్ మాస్ ని ఇందులో జొప్పించారని సమాచారం. దేవర పాత్ర మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుందని, వర క్యారెక్టర్ ని పరిచయం చేశాక దాన్ని విలన్ భైరతో ముడిపెట్టి శుభం కార్డుకు ముందు షాకింగ్ ఎలిమెంట్ తో ముగిస్తారట. ఎంత వయొలెన్స్ ఉన్నా ఎమోషన్స్ ఏ మాత్రం తగ్గకుండా ఒక కంప్లీట్ ప్యాకేజ్ లా రూపొందిన దేవరకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డులకు పాతరే.
This post was last modified on September 25, 2024 10:52 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…