జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందుతున్న దేవర ఇంకో నలభై ఎనిమిది గంటల్లోపే థియేటర్లలో తొలి షో వేయనుంది. ఇప్పటికే అభిమానుల ఉద్వేగం పతాక స్థాయిలో ఉండగా అర్ధరాత్రి ప్రీమియర్లు ఎన్నో సంవత్సరాల తర్వాత ఏపీ తెలంగాణలో పడుతుండటంతో వాటి టికెట్ల కోసం డిమాండ్ మాములుగా లేదు. సుదర్శన్ లాంటి క్రేజీ సింగల్ స్క్రీన్ లో అయిదు వేల రూపాయల ధర పలుకుతుండగా సి సెంటర్లలోనూ వెయ్యికి తక్కువ అమ్మడం లేదని ఆఫ్ లైన్ లో ఫ్యాన్స్ టాక్. తర్వాత నాలుగు గంటల షోకు సైతం ఇదే రేంజ్ లో అమ్మకాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా దేవర రెండో భాగం గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక కీలకమైన క్లూ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను డీకోడ్ చేస్తే అర్థమవుతుంది. దేవర పార్ట్ 1 చివరి ముప్పావు గంట కళ్ళు పక్కకు తిప్పుకోలేనంత కీలక భాగం కాగా ఆఖరి పది నిముషాలు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటుంది. అంటే బాహుబలిని ఎవరు చంపారు అనే ప్రశ్నను రేకెత్తించి దాని ద్వారానే సీక్వెల్ కి మార్కెటింగ్ చేసిన రాజమౌళి తరహాలోనే కొరటాల శివ మతి పోయే స్థాయిలో ట్విస్టుతో పాటు పెద్ద సస్పెన్స్ సృష్టించి పెట్టారట.
షో అయిపోయాక బయటికి వచ్చేటప్పుడు వీలైనంత త్వరగా పార్ట్ 2 చూడాలనిపించే ఎగ్జైట్ మెంట్ కలిగిస్తుందని ఇన్ సైడ్ టాక్. ఇంకో రెండు రోజులు ఆగితే మ్యాటర్ బయటికి వచ్చేస్తుంది కానీ కొరటాల మాత్రం ఊహించనంత యాక్షన్ మాస్ ని ఇందులో జొప్పించారని సమాచారం. దేవర పాత్ర మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుందని, వర క్యారెక్టర్ ని పరిచయం చేశాక దాన్ని విలన్ భైరతో ముడిపెట్టి శుభం కార్డుకు ముందు షాకింగ్ ఎలిమెంట్ తో ముగిస్తారట. ఎంత వయొలెన్స్ ఉన్నా ఎమోషన్స్ ఏ మాత్రం తగ్గకుండా ఒక కంప్లీట్ ప్యాకేజ్ లా రూపొందిన దేవరకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డులకు పాతరే.
This post was last modified on September 25, 2024 10:52 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…