జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందుతున్న దేవర ఇంకో నలభై ఎనిమిది గంటల్లోపే థియేటర్లలో తొలి షో వేయనుంది. ఇప్పటికే అభిమానుల ఉద్వేగం పతాక స్థాయిలో ఉండగా అర్ధరాత్రి ప్రీమియర్లు ఎన్నో సంవత్సరాల తర్వాత ఏపీ తెలంగాణలో పడుతుండటంతో వాటి టికెట్ల కోసం డిమాండ్ మాములుగా లేదు. సుదర్శన్ లాంటి క్రేజీ సింగల్ స్క్రీన్ లో అయిదు వేల రూపాయల ధర పలుకుతుండగా సి సెంటర్లలోనూ వెయ్యికి తక్కువ అమ్మడం లేదని ఆఫ్ లైన్ లో ఫ్యాన్స్ టాక్. తర్వాత నాలుగు గంటల షోకు సైతం ఇదే రేంజ్ లో అమ్మకాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా దేవర రెండో భాగం గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక కీలకమైన క్లూ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను డీకోడ్ చేస్తే అర్థమవుతుంది. దేవర పార్ట్ 1 చివరి ముప్పావు గంట కళ్ళు పక్కకు తిప్పుకోలేనంత కీలక భాగం కాగా ఆఖరి పది నిముషాలు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటుంది. అంటే బాహుబలిని ఎవరు చంపారు అనే ప్రశ్నను రేకెత్తించి దాని ద్వారానే సీక్వెల్ కి మార్కెటింగ్ చేసిన రాజమౌళి తరహాలోనే కొరటాల శివ మతి పోయే స్థాయిలో ట్విస్టుతో పాటు పెద్ద సస్పెన్స్ సృష్టించి పెట్టారట.
షో అయిపోయాక బయటికి వచ్చేటప్పుడు వీలైనంత త్వరగా పార్ట్ 2 చూడాలనిపించే ఎగ్జైట్ మెంట్ కలిగిస్తుందని ఇన్ సైడ్ టాక్. ఇంకో రెండు రోజులు ఆగితే మ్యాటర్ బయటికి వచ్చేస్తుంది కానీ కొరటాల మాత్రం ఊహించనంత యాక్షన్ మాస్ ని ఇందులో జొప్పించారని సమాచారం. దేవర పాత్ర మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుందని, వర క్యారెక్టర్ ని పరిచయం చేశాక దాన్ని విలన్ భైరతో ముడిపెట్టి శుభం కార్డుకు ముందు షాకింగ్ ఎలిమెంట్ తో ముగిస్తారట. ఎంత వయొలెన్స్ ఉన్నా ఎమోషన్స్ ఏ మాత్రం తగ్గకుండా ఒక కంప్లీట్ ప్యాకేజ్ లా రూపొందిన దేవరకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డులకు పాతరే.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…