కెరీర్ ప్రారంభంలో ఎగబడి వస్తున్నాయని తొందరపడి ఆఫర్లన్నీ ఒప్పేసుకుంటే వాటి ప్రభావం తర్వాత ఎప్పుడో ఉంటుంది. ముఖ్యంగా టాలెంట్ ఉన్న కుర్ర హీరోల జాగ్రత్తగా ఉండాలి. అర్జున్ రెడ్డి రిలీజయ్యాక విజయ్ దేవరకొండ ఇమేజ్ చూసి ఎక్కడో ల్యాబులో మూలానపడిన ఏ మంత్రం వేశావే కేవలం బిజినెస్ కోసం బయటికి తీసుకొచ్చిన ఉదంతం అభిమానులు మర్చిపోలేరు. సుహాస్ కు సైతం ఇది అనుభవమవుతోంది. అందరూ దేవర హడావిడిలో పడ్డారు కానీ మొన్న శనివారం గొర్రె పురాణం రిలీజైన సంగతి చాలా మంది పట్టించుకోలేదు. అసలు వచ్చిందనే విషయమే తెలియకుండా జరిగింది.
ట్రైలర్ లాంచ్ తో మొదలుపెట్టి విడుదల తేదీ దాకా సుహాస్ ఎక్కడా దీని ప్రమోషన్లలో పాల్గొనలేదు. రెండు మతాల మధ్య దోబూచులాటకు కారణమైన ఒక గొర్రెకు, జైల్లో ఖైదీకి ముడిపెట్టిన విధానం వినడానికి వైరెటీగా ఉన్నా తెరకెక్కించే క్రమంలో పడిన తడబాటు భరించలేని ప్రహసనంగా మారింది. అసలే పబ్లిసిటీ లేక ఓపెనింగ్స్ రాలేదని ఒకపక్క నిర్మాత ఇదవుతుంటే టాక్ కూడా అంతంత మాత్రంగా ఉండటం ఫలితాన్ని డిజాస్టర్ గా మార్చేసింది. ఆ మధ్య శ్రీరంగనీతులుకు సైతం సుహాస్ కి ఇదే అనుభవం ఎదురయ్యింది. ఓటిటిలో వచ్చేదాకా ఎవరికీ దాని ఊసే లేదు.
వచ్చే దసరాకు రాబోతున్న జనక అయితే గనక మీద సుహాస్ కు బోలెడు ఆశలున్నాయి. ఓవర్సీస్ హక్కులను కొన్నాడంటేనే నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా దిల్ రాజు పిల్లలు నెలకొల్పిన బ్యానర్. సో మార్కెటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇలాంటి మూవీ వస్తున్న టైంలో గొర్రె పురాణం రావడం కరెక్ట్ కాదని భావించాడో లేక ఎలాగూ కంటెంట్ ఎలా ఉందో అర్థమై దూరంగా ఉన్నాడో తెలియదు. ఇవి కాకుండా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయేమో లోగుట్టు పెరుమాళ్ళకెరుక. దీని తర్వాత తర్వాతి వరసలో కేబుల్ రెడ్డి, ఉప్పు కప్పురంబు, ఆనంద్ రావు అడ్వెంచర్స్ విడుదలకు రెడీ అవుతున్నాయి.
This post was last modified on September 25, 2024 10:10 am
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…