హీరోల కొడుకులు వేరే క్రాఫ్ట్ వైపు చూసే అవకాశమే కనిపించడం లేదు ఈ మధ్య. వేర క్రాఫ్ట్స్కు చెందిన వారసులు కూడా నటన వైపే అడుగేస్తున్న ఈ రోజుల్లో హీరోల కొడుకులు హీరోలు కాకుండా ఇంకేం అవుతారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ కొద్దిమంది మాత్రం తమ రూటే వేరు అంటూ సాగిపోతుంటారు. తమిళ టాప్ స్టార్ విజయ్ తనయుడు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా అతను సినిమా చేయబోతున్నాడు.
ఐతే భవిష్యత్తులో దర్శకత్వమే చేస్తాడా లేదా అన్నది తెలియదు కానీ.. ప్రస్తుతానికి మాస్ రాజా రవితేజ తనయుడు మహాధన్ భూపతి రాజు కూడా ఆ విభాగం మీదే దృష్టిపెట్టినట్లు సమాచారం. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సంచలనం రేపిన సందీప్ రెడ్డి దగ్గర అతను దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుంటున్నాడట.
మహాధన్.. తన తండ్రి సినిమా ‘రాజా ది గ్రేట్’తో బాల నటుడిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అందులో చిన్నప్పటి రవితేజగా కనిపించాడు. ఆ తర్వాత అతను మళ్లీ సినిమాల్లో నటించలేదు. చదువు మీద దృష్టిపెట్టాడు. ఇక కొంచెం పెద్దవాడు అయ్యాక హీరోగా ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ అతను ఓవైపు చదువుకుంటూనే ఇంకోవైపు తనకెంతో ఇష్టమైన సందీప్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నాడట.
ఐతే దర్శకత్వ శాఖలో పని చేస్తున్నంతమాత్రాన దర్శకత్వమే చేయాలనేమీ లేదు. రవితేజ సైతం ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసి ఆ తర్వాత నటనలోకి వచ్చాడు. నటుడికి అన్ని విభాగాల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఇలా చేయిస్తుండొచ్చు. మరి భవిష్యత్తులో మహాధన్ దర్శకుడవుతాడా.. హీరో అవుతాడా అన్నది కాలమే నిర్ణయించారు. మరోవైపు రవితేజ కూతురు సైతం సినిమాల్లోకి వస్తోందని.. ఆమె ప్రొడక్షన్ మీద దృష్టిపెట్టిందని సమాచారం.
This post was last modified on September 25, 2024 6:06 am
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…