హీరోల కొడుకులు వేరే క్రాఫ్ట్ వైపు చూసే అవకాశమే కనిపించడం లేదు ఈ మధ్య. వేర క్రాఫ్ట్స్కు చెందిన వారసులు కూడా నటన వైపే అడుగేస్తున్న ఈ రోజుల్లో హీరోల కొడుకులు హీరోలు కాకుండా ఇంకేం అవుతారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ కొద్దిమంది మాత్రం తమ రూటే వేరు అంటూ సాగిపోతుంటారు. తమిళ టాప్ స్టార్ విజయ్ తనయుడు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా అతను సినిమా చేయబోతున్నాడు.
ఐతే భవిష్యత్తులో దర్శకత్వమే చేస్తాడా లేదా అన్నది తెలియదు కానీ.. ప్రస్తుతానికి మాస్ రాజా రవితేజ తనయుడు మహాధన్ భూపతి రాజు కూడా ఆ విభాగం మీదే దృష్టిపెట్టినట్లు సమాచారం. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సంచలనం రేపిన సందీప్ రెడ్డి దగ్గర అతను దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుంటున్నాడట.
మహాధన్.. తన తండ్రి సినిమా ‘రాజా ది గ్రేట్’తో బాల నటుడిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అందులో చిన్నప్పటి రవితేజగా కనిపించాడు. ఆ తర్వాత అతను మళ్లీ సినిమాల్లో నటించలేదు. చదువు మీద దృష్టిపెట్టాడు. ఇక కొంచెం పెద్దవాడు అయ్యాక హీరోగా ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ అతను ఓవైపు చదువుకుంటూనే ఇంకోవైపు తనకెంతో ఇష్టమైన సందీప్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నాడట.
ఐతే దర్శకత్వ శాఖలో పని చేస్తున్నంతమాత్రాన దర్శకత్వమే చేయాలనేమీ లేదు. రవితేజ సైతం ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసి ఆ తర్వాత నటనలోకి వచ్చాడు. నటుడికి అన్ని విభాగాల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఇలా చేయిస్తుండొచ్చు. మరి భవిష్యత్తులో మహాధన్ దర్శకుడవుతాడా.. హీరో అవుతాడా అన్నది కాలమే నిర్ణయించారు. మరోవైపు రవితేజ కూతురు సైతం సినిమాల్లోకి వస్తోందని.. ఆమె ప్రొడక్షన్ మీద దృష్టిపెట్టిందని సమాచారం.
This post was last modified on September 25, 2024 6:06 am
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…