హీరోల కొడుకులు వేరే క్రాఫ్ట్ వైపు చూసే అవకాశమే కనిపించడం లేదు ఈ మధ్య. వేర క్రాఫ్ట్స్కు చెందిన వారసులు కూడా నటన వైపే అడుగేస్తున్న ఈ రోజుల్లో హీరోల కొడుకులు హీరోలు కాకుండా ఇంకేం అవుతారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ కొద్దిమంది మాత్రం తమ రూటే వేరు అంటూ సాగిపోతుంటారు. తమిళ టాప్ స్టార్ విజయ్ తనయుడు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా అతను సినిమా చేయబోతున్నాడు.
ఐతే భవిష్యత్తులో దర్శకత్వమే చేస్తాడా లేదా అన్నది తెలియదు కానీ.. ప్రస్తుతానికి మాస్ రాజా రవితేజ తనయుడు మహాధన్ భూపతి రాజు కూడా ఆ విభాగం మీదే దృష్టిపెట్టినట్లు సమాచారం. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సంచలనం రేపిన సందీప్ రెడ్డి దగ్గర అతను దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుంటున్నాడట.
మహాధన్.. తన తండ్రి సినిమా ‘రాజా ది గ్రేట్’తో బాల నటుడిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అందులో చిన్నప్పటి రవితేజగా కనిపించాడు. ఆ తర్వాత అతను మళ్లీ సినిమాల్లో నటించలేదు. చదువు మీద దృష్టిపెట్టాడు. ఇక కొంచెం పెద్దవాడు అయ్యాక హీరోగా ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ అతను ఓవైపు చదువుకుంటూనే ఇంకోవైపు తనకెంతో ఇష్టమైన సందీప్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నాడట.
ఐతే దర్శకత్వ శాఖలో పని చేస్తున్నంతమాత్రాన దర్శకత్వమే చేయాలనేమీ లేదు. రవితేజ సైతం ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసి ఆ తర్వాత నటనలోకి వచ్చాడు. నటుడికి అన్ని విభాగాల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఇలా చేయిస్తుండొచ్చు. మరి భవిష్యత్తులో మహాధన్ దర్శకుడవుతాడా.. హీరో అవుతాడా అన్నది కాలమే నిర్ణయించారు. మరోవైపు రవితేజ కూతురు సైతం సినిమాల్లోకి వస్తోందని.. ఆమె ప్రొడక్షన్ మీద దృష్టిపెట్టిందని సమాచారం.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…