పవన్ కళ్యాణ్ అభిమానులకు గొప్ప శుభవార్త వచ్చేసింది. అయితే వాళ్ళు ఎదురుచూస్తున్నట్టు ఓజికి సంబంధించినది కాదు. హరిహర వీరమల్లు విడుదల గురించి. 2025 మార్చి 28 ప్రపంచవ్యాప్తంగా పార్ట్ 1 స్వార్డ్ అండ్ స్పిరిట్ ని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటన ఇచ్చి కొత్త పోస్టర్ వదిలారు. అధిక భాగం క్రిష్ దర్శకత్వం వహించగా మిగిలింది నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్లో భారీ యుద్ధ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొనగా షూటింగ్ కొనసాగించబోతున్నారు.
ఓజి కన్నా ముందు వీరమల్లుకి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఉంది. ఇప్పటికే విపరీతమైన జాప్యానికి గురైన ఈ ప్యాన్ ఇండియా మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఓటిటి ఒప్పందం ప్రకారం ఇప్పటికే జరిగిన ఆలస్యం మరింత కొనసాగిస్తే ఎక్కువ నష్టపోవాల్సి ఉంటుంది. పైగా రెండు భాగాలు కాబట్టి ముందు దీన్ని రిలీజ్ చేస్తే సీక్వెల్ ని కొంచెం గ్యాప్ ఇచ్చి ఏడాది లేదా రెండేళ్ల తర్వాత విడుదల చేసుకోవచ్చు. తద్వారా డిప్యూటీ సిఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు అయిదేళ్ల కాలంలో నాలుగు వచ్చినట్టవుతుంది. వీరమల్లు రెండు భాగాలు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లు లిస్టులో ఉన్నాయి.
రాజకీయ పరిస్థితులు సున్నితంగా ఉన్న కారణంగా పవన్ కళ్యాణ్ వీలైనంత వేగంగా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. పని ఒత్తిడి, వివిధ శాఖల సమస్యలు, ఊహించని విధంగా వచ్చే వరద లాంటి విపత్తులు తనను ఊపిరాడనంత బిజీగా మార్చేస్తున్నాయి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే మనస్థాపంతో షూటింగులు వద్దనుకున్న పవన్ ఇప్పుడు జనాలకు రోజుకో సమస్య వస్తుంటే కుదురుగా ఉండగలరా. తిరుపతి లడ్డు వ్యవహారంలో ఎంతగా కలత చెందారో చూస్తున్నాం. ఈ లెక్కన పైన చెప్పిన నాలుగు సినిమాలు మినహాయించి పవన్ ఇకపై కొత్త నిర్మాతలకు కమిట్ మెంట్లు ఇవ్వడం డౌటే.
This post was last modified on September 23, 2024 7:26 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…