దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం పట్ల సోషల్ మీడియాలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయన స్వంత సినిమా స్టేజి మీద చూసి ఆరేళ్ళు గడిచిపోవడంతో దాని తాలూకు ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో కొలవలేనంతగా ఉంది. నిన్న ఒక్కసారిగా వేలాది మంది ఎందుకు ఎగబడి వచ్చారనే ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. ఇక్కడ రెండు అంశాలు కీలక పాత్ర పోషించాయి. మొదటిది తారక్ ప్రసంగం. దేవర గురించిన విశేషాలతో పాటు ఫ్యాన్స్ గురించి, తన భవిష్యత్ ప్లానింగ్ గురించి చాలా చెబుతాడనే అంచనాలు బలంగా ఉన్నాయి.
ఏపీలో టిడిపి కూటమిలో అధికారంలోకి వచ్చాక జూనియర్ బయట ప్రసంగిస్తున్న మొదటి వేడుక ఇదే. ఎప్పుడూ లేనంత అధికంగా టికెట్ రేట్ల పెంపుకి అనుమతులు ఇచ్చారు ఖచ్చితంగా చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చేవాడన్నది ఒక కోణం. దాంతో పాటు మోక్షజ్ఞ ఎంట్రీకి శుభాకాంక్షలు చెబుతూ ఇటీవలే ట్వీట్ చేసిన తారక్ దేవర ఈవెంట్ లోనూ మాట్లాడేవాడని ఇంకొందరు ఆశించారు. ఇక రెండోది అనిరుద్ రవిచందర్ లైవ్ కన్సర్ట్. దేవర ముంగిట నువ్వెంత అంటూ మైకు పట్టుకుని ఊగిపోతూ ఉత్సాహం కలిగిస్తుంటే ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయేది. ఇదీ మిస్ చేసుకున్నారు.
ఇక త్రివిక్రమ్, కొరటాల, రాజమౌళి స్పీచ్ గురించి హైప్ మళ్ళీ చెప్పనక్కర్లేదు. జాన్వీ కపూర్ తెలుగు ప్రసంగాన్ని ప్రత్యేకంగా నేర్చుకుని మరీ వచ్చినా వీడియోతో సరిపెట్టుకొవాల్సి వచ్చింది. ఇంతకీ గెస్టులందరూ వచ్చారో లేక సమాచారం తెలుసుకుని ఇంటి దగ్గరే ఆగిపోయారో దీనికి సంబంధించిన క్లారిటీ లేదు. త్రివిక్రమ్, నాగవంశీలు రిటర్న్ వెళ్ళిపోతూ కనిపించారు. బయట ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు మాత్రం ఓ రేంజ్ లో కనిపించాయి. అయినా ఏనాడూ జరగనిది ఇంత రభస వెనుక వేరే కారణాలు, ఇతర శక్తులు ఏమైనా ఉన్నాయానే కోణంలో కూడా ప్రస్తుతం విచారణ జరుగుతోందని వినికిడి.
This post was last modified on September 23, 2024 10:56 am
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…