దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం పట్ల సోషల్ మీడియాలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయన స్వంత సినిమా స్టేజి మీద చూసి ఆరేళ్ళు గడిచిపోవడంతో దాని తాలూకు ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో కొలవలేనంతగా ఉంది. నిన్న ఒక్కసారిగా వేలాది మంది ఎందుకు ఎగబడి వచ్చారనే ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. ఇక్కడ రెండు అంశాలు కీలక పాత్ర పోషించాయి. మొదటిది తారక్ ప్రసంగం. దేవర గురించిన విశేషాలతో పాటు ఫ్యాన్స్ గురించి, తన భవిష్యత్ ప్లానింగ్ గురించి చాలా చెబుతాడనే అంచనాలు బలంగా ఉన్నాయి.
ఏపీలో టిడిపి కూటమిలో అధికారంలోకి వచ్చాక జూనియర్ బయట ప్రసంగిస్తున్న మొదటి వేడుక ఇదే. ఎప్పుడూ లేనంత అధికంగా టికెట్ రేట్ల పెంపుకి అనుమతులు ఇచ్చారు ఖచ్చితంగా చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చేవాడన్నది ఒక కోణం. దాంతో పాటు మోక్షజ్ఞ ఎంట్రీకి శుభాకాంక్షలు చెబుతూ ఇటీవలే ట్వీట్ చేసిన తారక్ దేవర ఈవెంట్ లోనూ మాట్లాడేవాడని ఇంకొందరు ఆశించారు. ఇక రెండోది అనిరుద్ రవిచందర్ లైవ్ కన్సర్ట్. దేవర ముంగిట నువ్వెంత అంటూ మైకు పట్టుకుని ఊగిపోతూ ఉత్సాహం కలిగిస్తుంటే ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయేది. ఇదీ మిస్ చేసుకున్నారు.
ఇక త్రివిక్రమ్, కొరటాల, రాజమౌళి స్పీచ్ గురించి హైప్ మళ్ళీ చెప్పనక్కర్లేదు. జాన్వీ కపూర్ తెలుగు ప్రసంగాన్ని ప్రత్యేకంగా నేర్చుకుని మరీ వచ్చినా వీడియోతో సరిపెట్టుకొవాల్సి వచ్చింది. ఇంతకీ గెస్టులందరూ వచ్చారో లేక సమాచారం తెలుసుకుని ఇంటి దగ్గరే ఆగిపోయారో దీనికి సంబంధించిన క్లారిటీ లేదు. త్రివిక్రమ్, నాగవంశీలు రిటర్న్ వెళ్ళిపోతూ కనిపించారు. బయట ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు మాత్రం ఓ రేంజ్ లో కనిపించాయి. అయినా ఏనాడూ జరగనిది ఇంత రభస వెనుక వేరే కారణాలు, ఇతర శక్తులు ఏమైనా ఉన్నాయానే కోణంలో కూడా ప్రస్తుతం విచారణ జరుగుతోందని వినికిడి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…