తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్తో రామ్ చరణ్ సినిమా అన్నపుడు మెగా అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. చిరంజీవి సహా ఎందరో టాలీవుడ్ టాప్ స్టార్లు ఆశపడ్డా శంకర్తో సినిమా చేయలేకపోయారు. అలాంటిది చరణ్కు ఆ అవకాశం వచ్చిందని ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ వారిలో ఎగ్జైట్మెంట్ను చాలా వరకు తగ్గించే పరిణామాలు జరిగాయి గత మూణ్నాలుగేళ్లలో.
ఈ సినిమా చిత్రీకరణ బాగా ఆలస్యమైంది. పలుమార్లు షెడ్యూల్స్కు బ్రేకులు పడ్డాయి. సినిమా గురించి సరైన అప్డేట్స్ లేవు. రిలీజ్ గురించి ఎంతకీ క్లారిటీ రాలేదు. ఈ సినిమా క్రిస్మస్కు వస్తుందని దిల్ రాజు చెప్పాక కూడా చాలా వారాలు గడిచిపోయాయి. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. కానీ ఇటీవలే సంగీత దర్శకుడు తమన్.. ‘గేమ్ చేంజర్’ డిసెంబరు 20న రాబోతోందని ఒక పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పాడు. అయినా సరే అఫీషియన్ న్యూస్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఐతే ఎట్టకేలకు ‘గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా సెకండ్ సింగిల్తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఒకేసారి జరగబోతోందట. అందరూ అంచనా వేస్తున్నట్లే డిసెంబరు 20న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించనున్నారట. ఒకట్రెండు రోజుల్లో ఒక పోస్టర్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.
‘గేమ్ చేంజర్’ డేట్ను బట్టి వేరే సినిమాల భవితవ్యం కూడా తేలుతుంది. ఆ సినిమా క్రిస్మస్ వీకెండ్కు కన్ఫమ్ అయితే రాబిన్ హుడ్, తండేల్ వాయిదా వేయడం లాంఛనమే. వాటికి కొత్త డేట్లు ఖరారు చేసి ఆ చిత్ర బృందాలు కూడా ప్రకటనలు ఇచ్చేస్తాయి. ‘కన్నప్ప’ సినిమా రిలీజ్ వ్యవహారం కూడా ‘గేమ్ చేంజర్’ డేట్ను బట్టే ఉంటుందని తెలుస్తోంది. ‘గేమ్ చేంజర్’ చిత్రీకరణ ముందే పూర్తయినా.. ఇటీవల కొన్ని సీన్లు రీషూట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి టాకీ పార్ట్ అయితే అవగొట్టేశారట. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
This post was last modified on September 22, 2024 5:27 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…