రొటీన్ జోలికి వెళ్లకుండా విభిన్నమైన కథలు అందులోనూ సస్పెన్స్, థ్రిల్, యాక్షన్ ఉండేవి ఎంచుకుంటాడని పేరున్న అడవి శేష్ నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా రాలేదు. హిట్ 2 ది సెకండ్ కేస్ హిట్టయినా మేజర్ ని మించిన సినిమాని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తన నుంచి ఏదైనా మూవీ వస్తోందంటే ప్రత్యేకంగా ఎదురు చూసే అభిమానులు బోలెడున్నారు. వాళ్లకు శుభవార్త చెబుతూ ఇవాళ అడవి శేష్ ఒక ట్వీట్ చేశాడు. 2025లో ఒకటి రెండు కాదు ఏకంగా మూడు రిలీజులు ఉంటాయని చెప్పి స్వీట్ షాక్ ఇచ్చాడు. రవితేజ, నాని లాంటి వాళ్ళు చూపించే ఈ వేగం ఇప్పుడు శేష్ అందిపుచ్చుకున్నాడు.
ఇక్కడో ట్విస్ట్ ఉంది. శేష్ చెప్పినవాటిలో గూఢచారి 2 ఒకటి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ స్క్రిప్ట్ కే రెండేళ్లకు పైగా ఖర్చు పెట్టారు. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని ఇప్పటికే టాక్ ఉంది. రెండోది శృతి హాసన్ జోడిగా నటిస్తున్న డెకాయిట్. షూటింగ్ కు ముందే ఆకట్టుకునే టీజర్ తో అంచనాలు పెంచేసింది. రెండు సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరి మూడోది ఏంటనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. సినిమానా లేక వెబ్ సిరీసా లేక స్వంత ప్రొడక్షన్లో ఇంకేదైనా ప్రయోగం చేస్తున్నాడా ఇదేమి చెప్పకుండా సస్పెన్స్ పెట్టేశాడు.
ఏదైతేనేం అడవి శేష్ నుంచి మూడు సినిమాల రావడం కన్నా పండగ ఏముంటుంది. కెరీర్ ఎప్పుడో మొదలుపెట్టినా బ్రేక్ అందుకోవడానికి బాగా టైం పట్టిన ఈ యూత్ హీరో క్షణంతో తొలి బ్రేక్ అందుకున్నాడు. లెక్కలేనన్ని ఆఫర్లు వచ్చినా సరే ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మేజర్ తో ప్యాన్ ఇండియా గుర్తింపు రావడంతో ఇకపై ప్రతిదీ హిందీ వెర్షన్ కూడా వస్తుంది. నార్త్ ఆడియన్స్ లోనూ గుర్తింపు వచ్చింది కనక సబ్జెక్ట్ సెలక్షన్ తో జాగ్రత్తలు అవసరమే. శేష్ చెప్పిన మూడు రిలీజుల ప్రకారం మొదటిది మార్చి లేదా అంతకన్నా ముందే వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి ఏది ఫస్టవుతుందో.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…