ఇండియన్ బాక్సాఫీస్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాకు ఇంకో ఆరు రోజులే సమయం ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ వచ్చే శుక్రవారమే థియేటర్లలోకి దిగుతోంది. ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల తీసిన సినిమా అయినప్పటికీ దీని మీద ఆ ప్రభావం పెద్దగా లేదు. సినిమాకు తెలుగులోనే కాక వేరే భాషల్లోనూ మంచి హైపే వచ్చింది. కాకపోతే ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కొంచెం మిశ్రమ స్పందన తెచ్చుకోవడం టీంను కలవర పెట్టింది. తారక్ ఫ్యాన్స్ కూడా కొంత కంగారు పడ్డారు.
రెండు మూడు రోజుల నెగెటివిటీ తర్వాత మళ్లీ హైప్ పుంజుకున్నప్పటికీ.. తారక్ అభిమానుల్లో లోలోన కంగారు లేకపోలేదు. ట్రైలర్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఈ ఫీడ్ బ్యాక్ టీంకు కూడా చేరినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం రిలీజ్ ముంగిట ‘దేవర’ నుంచి మరో ట్రైలర్ రాబోతోందట. ఫస్ట్ ట్రైలర్తో పోలిస్తే బెటర్ షాట్స్, డైలాగ్స్ ఉండేట్లు.. కథ పరంగా ఎగ్జైట్మెంట్ పెంచేలా ఈ ట్రైలర్ కట్ చేస్తున్నాడట కొరటాల.
నిజానికి రిలీజ్ ట్రైలర్ వదిలే ఆలోచన ముందు నుంచే ఉందట. అందుకే ఫస్ట్ ట్రైలర్ను విడుదలకు 20 రోజుల ముందే వదిలారు. అది ఆశించిన ప్రయోజనాన్ని నెరవేరిస్తే వేరే ట్రైలర్ వదిలేవారు కాదేమో. కానీ ఆ ట్రైలర్ మిశ్రమ స్పందన తెచ్చుకున్న నేపథ్యంలో కొత్త ట్రైలర్ అనివార్యమైంది. దీన్ని స్ట్రైకింగ్గా ఉండేలా చూసుకుంటే రిలీజ్ ముంగిట హైక్ కూడా కరెక్ట్ మీటర్లో ఉంటుందని భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవరకు టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోలు ఖాయమైనట్లే. ఏపీలో ఆల్రెడీ అనుమతులు వచ్చేశాయి. తెలంగాణలో కూడా లాంఛనమే. ఇంకో రెండు రోజుల్లో టికెట్ల అమ్మకాలు కూడా మొదలు కానున్నాయి.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…