చిరంజీవి ఆచార్య షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, దాని తర్వాత ఏ సినిమా వుంటుందనే దానిపై మీడియాలో చాలా రకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఏ సినిమా ఎప్పుడు మొదలు పెట్టాలి, దేనిని ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై చిరంజీవికి పిచ్చ క్లారిటీ వుంది. ఆచార్య ముందుగా వచ్చే వేసవిలో విడుదలవుతుంది. ఏప్రిల్ నెలాఖరులో లేదా మే రెండవ వారంలో ఈ చిత్రం రిలీజ్ కావడం పక్కా. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయినా కానీ అప్పటికి రిలీజ్ అయ్యేలా చిరు వర్క్ చేయబోతున్నారు. ఆ సినిమా తర్వాత వేదళాం షూటింగ్ ముందుగా స్టార్ట్ అవుతుంది.
అది కొన్నాళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న తర్వాత లూసిఫర్ రీమేక్ కూడా మొదలు పెడతారు. వేదళాం రీమేక్ దసరా సీజన్లో విడుదలయ్యేలా, ఆ తర్వాత లూసిఫర్ 2022 సంక్రాంతికి వచ్చేలా చిరంజీవి పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆచార్య తర్వాత అస్సలు టైమ్ వేస్ట్ కాకుండా వేదళాం, లూసిఫర్ కోసం ప్రీ ప్రొడక్షన్ ఇప్పుడే పూర్తి చేసేస్తున్నారు. ఆ రెండు సినిమాలలోను చిరంజీవి ఇంచుమించు ఒకే తరహా లుక్తో కనిపిస్తారు. వేదళాం కోసం వేసే మరో గెటప్కి సంబంధించిన షూట్ ఆచార్య అయిన వెంటనే పూర్తి చేస్తారు. నెక్స్ట్ లుక్కి మారిన తర్వాత లూసిఫర్ షూటింగ్ కూడా ప్యారలల్గా చేస్తారు.
This post was last modified on September 30, 2020 1:37 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…