చిరంజీవి ఆచార్య షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, దాని తర్వాత ఏ సినిమా వుంటుందనే దానిపై మీడియాలో చాలా రకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఏ సినిమా ఎప్పుడు మొదలు పెట్టాలి, దేనిని ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై చిరంజీవికి పిచ్చ క్లారిటీ వుంది. ఆచార్య ముందుగా వచ్చే వేసవిలో విడుదలవుతుంది. ఏప్రిల్ నెలాఖరులో లేదా మే రెండవ వారంలో ఈ చిత్రం రిలీజ్ కావడం పక్కా. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయినా కానీ అప్పటికి రిలీజ్ అయ్యేలా చిరు వర్క్ చేయబోతున్నారు. ఆ సినిమా తర్వాత వేదళాం షూటింగ్ ముందుగా స్టార్ట్ అవుతుంది.
అది కొన్నాళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న తర్వాత లూసిఫర్ రీమేక్ కూడా మొదలు పెడతారు. వేదళాం రీమేక్ దసరా సీజన్లో విడుదలయ్యేలా, ఆ తర్వాత లూసిఫర్ 2022 సంక్రాంతికి వచ్చేలా చిరంజీవి పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆచార్య తర్వాత అస్సలు టైమ్ వేస్ట్ కాకుండా వేదళాం, లూసిఫర్ కోసం ప్రీ ప్రొడక్షన్ ఇప్పుడే పూర్తి చేసేస్తున్నారు. ఆ రెండు సినిమాలలోను చిరంజీవి ఇంచుమించు ఒకే తరహా లుక్తో కనిపిస్తారు. వేదళాం కోసం వేసే మరో గెటప్కి సంబంధించిన షూట్ ఆచార్య అయిన వెంటనే పూర్తి చేస్తారు. నెక్స్ట్ లుక్కి మారిన తర్వాత లూసిఫర్ షూటింగ్ కూడా ప్యారలల్గా చేస్తారు.
This post was last modified on September 30, 2020 1:37 am
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…
అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…