చిరంజీవి ఆచార్య షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, దాని తర్వాత ఏ సినిమా వుంటుందనే దానిపై మీడియాలో చాలా రకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఏ సినిమా ఎప్పుడు మొదలు పెట్టాలి, దేనిని ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై చిరంజీవికి పిచ్చ క్లారిటీ వుంది. ఆచార్య ముందుగా వచ్చే వేసవిలో విడుదలవుతుంది. ఏప్రిల్ నెలాఖరులో లేదా మే రెండవ వారంలో ఈ చిత్రం రిలీజ్ కావడం పక్కా. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయినా కానీ అప్పటికి రిలీజ్ అయ్యేలా చిరు వర్క్ చేయబోతున్నారు. ఆ సినిమా తర్వాత వేదళాం షూటింగ్ ముందుగా స్టార్ట్ అవుతుంది.
అది కొన్నాళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న తర్వాత లూసిఫర్ రీమేక్ కూడా మొదలు పెడతారు. వేదళాం రీమేక్ దసరా సీజన్లో విడుదలయ్యేలా, ఆ తర్వాత లూసిఫర్ 2022 సంక్రాంతికి వచ్చేలా చిరంజీవి పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆచార్య తర్వాత అస్సలు టైమ్ వేస్ట్ కాకుండా వేదళాం, లూసిఫర్ కోసం ప్రీ ప్రొడక్షన్ ఇప్పుడే పూర్తి చేసేస్తున్నారు. ఆ రెండు సినిమాలలోను చిరంజీవి ఇంచుమించు ఒకే తరహా లుక్తో కనిపిస్తారు. వేదళాం కోసం వేసే మరో గెటప్కి సంబంధించిన షూట్ ఆచార్య అయిన వెంటనే పూర్తి చేస్తారు. నెక్స్ట్ లుక్కి మారిన తర్వాత లూసిఫర్ షూటింగ్ కూడా ప్యారలల్గా చేస్తారు.
This post was last modified on September 30, 2020 1:37 am
వీవీఐపీలు…ప్రత్యేకించి ముఖ్యమంత్రుల కాన్వాయ్ లు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. అనుకోని కారణాల వల్ల సీఎం వెళ్లడం కాస్తంత…
తమిళనాడు రాజకీయం రంజుగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనన్ని ట్విస్టులు అక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు కారణం నిన్నటిదాకా అక్కడ ఉన్నవి…
దేశంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు ముగిశాయి. మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పరాజయం…
అవును.. దళపతి విజయ్ ఏడ్చేశాడు. అవేమీ తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు వచ్చిన ఆనంద భాష్పాలు కావు. తన…
అందరూ తమిళ రాజకీయాలు, విజయ్ గెలుపు ముచ్చట్లలో పడిపోయారు కానీ పెద్ది ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న…
భాగ్యనగరం హైదరాబాద్లో మహిళల దుస్థితి ఎలా ఉందో.. ఒంటరి మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేసిన…