దేవరతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న జాన్వీ కపూర్ డెబ్యూలో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ విపరీతంగా ఉంది. ఎందుకంటే హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉన్న టాలీవుడ్ లో తనో మంచి ఛాయస్ అయితే తమ ప్రాజెక్టులకు సెట్ చేసేందుకు దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. దేవర రిలీజ్ కు ముందే రామ్ చరణ్ 16కి లాక్ కావడం తన క్రేజ్ ని మరింత పెంచింది. ట్రైలర్ లో ఆమె నటనకు సంబందించిన ఎక్కువ సీన్లు రివీల్ చేయలేదు కానీ తాజా ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన సంగతి వింటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు.
షూటింగ్ స్పాట్ లో రెండు పేజీల డైలాగుని ఏకధాటిగా సింగల్ టేక్ లో చెప్పడం చూసి యూనిట్ షాకై చూస్తుంటే వెంటనే తారక్ కొరటాల శివని ఉద్దేశించి సూపర్ వెంటనే ఓకే చేసేయమని చెప్పేశాడట. అప్పటిదాకా ఆ అమ్మాయి నటనని చూస్తుండిపోయిన దర్శకుడు వెంటనే తేరుకుని కట్ చెప్పాడు. అది ఏ సందర్భంలో వచ్చే సన్నివేశం లాంటివి చెప్పలేదు కానీ మంచి ఎమోషన్ ఉన్న సీనని అర్థమవుతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం చిన్న ఎన్టీఆర్ ని ప్రేమించిన ప్రియురాలిగా సెకండాఫ్ లో వచ్చే ఒక ముఖ్యమైన ఎపిసోడ్ లో జాన్వీకి చాలా పవర్ ఫుల్ డైలాగులు పడ్డాయట.
తారక్ చెప్పింది దాన్ని ఉద్దేశించేనని తెలిసింది. శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ మీద కామన్ ఆడియన్స్ ప్రత్యేక అంచనాలు పెట్టుకున్నారు. బాలీవుడ్ లో ఇమేజ్ వేరు, ఇక్కడి ప్రేక్షకుల్లో తన పట్ల ఎక్స్ పెక్టేషన్లు వేరు. వాటిని నిలబెట్టుకుంటే మంచి భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది. తిరిగి నార్త్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎంచక్కా హైదరాబాద్ లోనే మకాం పెట్టేయొచ్చు. ఒకప్పుడు తల్లిని ఎంతో ఆదరించి గొప్ప బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన తెలుగు నేలతో కనక బంధం ఏర్పడితే వరసగా స్టార్ హీరోల అవకాశాలతో దూసుకుపోవచ్చు. ఇంకో వారం రోజుల్లో పరీక్ష ఫలితం వచ్చేస్తుంది.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…