దర్శకుడు కొరటాల శివ కొంచెం రిజర్వ్డ్ గా మాట్లాడతారని పేరు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఎంత స్టార్ హీరోతో సినిమా తీసినా ప్రమోషన్ల టైంలో ఆయన మాటలు సెటిల్డ్ గా ఉంటాయి. దేవర కోసం సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లకు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్న కొన్ని మాటలు వైరలవుతున్నాయి. ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి పని వాళ్ళను చేసుకోనివ్వాలని, అవసరం లేకపోయినా ఇబ్బంది పెట్టి, మనం పని చేయక అడ్డు పడితే దానికి బాధ్యత తీసుకోవడం కష్టమనే రీతిలో చెప్పడంతో సోషల్ మీడియాలో రకరకాల నిర్వచనాలు చెప్పేస్తున్నారు.
అందరికీ ముందు గురొచ్చేది ఆచార్యనే. కొరటాల కెరీర్ లో మొదటిసారి డిజాస్టర్ అనుభవం దక్కింది దాని వల్లే. ఆ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు చిరంజీవి ఎక్కువ జోక్యం చేసుకున్నారని, అవసరం లేకపోయినా రామ్ చరణ్ పాత్రను పొడిగించారని ఏవేవో ప్రచారాలు జరిగాయి. చిరు సైతం ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు చెప్పింది చేయడం తప్ప తన ఇన్వాల్ మెంట్ ఉండదని చెప్పడమూ మెగా ఫ్యాన్స్ పంచుకున్నారు. ఏదైతేనేం ఆచార్య తర్వాత మీడియాకు కనిపించకుండా వెళ్ళిపోయిన కొరటాల శివ తిరిగి దేవర విడుదల దగ్గరగా ఉన్నప్పుడు కొత్త ఉత్సాహంతో మూవీ కబుర్లు పంచుకుంటున్నారు.
కొరటాల అన్నది సహజ ధోరణిలోనే కావొచ్చు. దాన్ని ఆచార్యకు ముడిపెట్టడం రైటా రాంగా చెప్పలేం కానీ ఎక్స్ సామజిక మాధ్యమంలో ప్రతిదీ భూతద్దంలో చూస్తున్న ట్రెండ్ లో నానార్ధాలు తీయడం సహజం. అయినా దేవర బ్లాక్ బస్టర్ విషయంలో కొరటాల చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. తిరుమలలో స్వామి దర్శనం చేసుకున్నాక బయట కలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో మాట్లాడుతూ సక్సెస్ మీట్ లో కలుద్దామని చెప్పడం దానికి సంకేతమే. కల్కి 2898 ఏడి తర్వాత అంత భారీ స్కేల్ లో విడుదలవుతున్న ప్యాన్ ఇండియా మూవీగా దేవర పార్ట్ 1 అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి.
This post was last modified on September 20, 2024 3:49 pm
స్టార్ హీరోలకు కోట్లలో అభిమానులు ఉంటారు. నిర్మాణంలో ఉన్న క్రేజీ సినిమాలకు సంబంధించిన అప్డేట్ అంటే చాలు వాళ్లకు ప్రాణం…
ఐపీఎల్లో ముంబయితో సమానంగా ఐదుసార్లు విజేతగా నిలిచిన జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్. ముంబయి కంటే ఎక్కువగా ఫైనల్స్ ఆడిన,…
వైసీపీ అధినేత జగన్ తమపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం.. హైకోర్టును ఆశ్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ…
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే కొలువుల కోత మొదలుకాగా… త్వరలోనే హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పాలి. ఎందుకంటే..…
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన…