ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ను సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా జానీ కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన లడఖ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. మరికొందరు ఆయన చెన్నైకి వెళ్లిపోయారని కూడా చెబుతూ వచ్చారు. అయితే.. బెంగళూరులో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు.
ప్రస్తుతం బెంగళూరు నుంచి జానీని హైదరాబాద్కు తీసుకురానున్నారు. ఇదిలావుంటే.. 21 ఏళ్ల మహిళా కొరియో గ్రాఫర్ జానీపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. తొలుత రాయదుర్గం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తనపై పలుమార్లు లైంగిక దాడి చేశారని.. బెదిరించారని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. తన విధుల్లోనూ ఆటంకలిగించారని తెలిపారు. అవకాశం దక్కకుండా పోతాయన్న ఉద్దేశంతో మౌనంగా భరించినట్టు తెలిపారు.
ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు.. మంగళవారం సాయంత్రమే కేసు నమోదు చేశారు. అనంతరం.. దీనిని నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసులో ప్రధానంగా పోక్స్ తదితర కీలక చట్టాలను ప్రయోగించారు. మరోవైపు.. జనసేన పార్టీనాయకుడిగా ఉన్న జానీని ఆ పార్టీ దూరంపెట్టింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదంటూ.. స్పష్టం చేసింది. ఇప్పుడు ఏకంగా జానీని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఈ కేసులో జానీకి ముందస్తు బెయిల్ లభించే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…