ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ను సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా జానీ కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన లడఖ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. మరికొందరు ఆయన చెన్నైకి వెళ్లిపోయారని కూడా చెబుతూ వచ్చారు. అయితే.. బెంగళూరులో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు.
ప్రస్తుతం బెంగళూరు నుంచి జానీని హైదరాబాద్కు తీసుకురానున్నారు. ఇదిలావుంటే.. 21 ఏళ్ల మహిళా కొరియో గ్రాఫర్ జానీపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. తొలుత రాయదుర్గం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తనపై పలుమార్లు లైంగిక దాడి చేశారని.. బెదిరించారని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. తన విధుల్లోనూ ఆటంకలిగించారని తెలిపారు. అవకాశం దక్కకుండా పోతాయన్న ఉద్దేశంతో మౌనంగా భరించినట్టు తెలిపారు.
ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు.. మంగళవారం సాయంత్రమే కేసు నమోదు చేశారు. అనంతరం.. దీనిని నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసులో ప్రధానంగా పోక్స్ తదితర కీలక చట్టాలను ప్రయోగించారు. మరోవైపు.. జనసేన పార్టీనాయకుడిగా ఉన్న జానీని ఆ పార్టీ దూరంపెట్టింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదంటూ.. స్పష్టం చేసింది. ఇప్పుడు ఏకంగా జానీని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఈ కేసులో జానీకి ముందస్తు బెయిల్ లభించే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది.
This post was last modified on September 19, 2024 12:02 pm
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…