ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ను సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా జానీ కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన లడఖ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. మరికొందరు ఆయన చెన్నైకి వెళ్లిపోయారని కూడా చెబుతూ వచ్చారు. అయితే.. బెంగళూరులో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు.
ప్రస్తుతం బెంగళూరు నుంచి జానీని హైదరాబాద్కు తీసుకురానున్నారు. ఇదిలావుంటే.. 21 ఏళ్ల మహిళా కొరియో గ్రాఫర్ జానీపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. తొలుత రాయదుర్గం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తనపై పలుమార్లు లైంగిక దాడి చేశారని.. బెదిరించారని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. తన విధుల్లోనూ ఆటంకలిగించారని తెలిపారు. అవకాశం దక్కకుండా పోతాయన్న ఉద్దేశంతో మౌనంగా భరించినట్టు తెలిపారు.
ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు.. మంగళవారం సాయంత్రమే కేసు నమోదు చేశారు. అనంతరం.. దీనిని నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసులో ప్రధానంగా పోక్స్ తదితర కీలక చట్టాలను ప్రయోగించారు. మరోవైపు.. జనసేన పార్టీనాయకుడిగా ఉన్న జానీని ఆ పార్టీ దూరంపెట్టింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదంటూ.. స్పష్టం చేసింది. ఇప్పుడు ఏకంగా జానీని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఈ కేసులో జానీకి ముందస్తు బెయిల్ లభించే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది.
This post was last modified on September 19, 2024 12:02 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…